కార్తీక పురాణము 7వ రోజు

శివ కేశవార్చనా విధులు

7వ అధ్యాయము



           మహారాజ! కార్తీక మాసము గురించి, దాని మహత్యం గురించి ఎంత చేపిన తనివితీరదు. ఈ మాసములో శ్రీమహావిష్ణువును సహస్రకమలములతో గాని తులసీదళములతో గాని  పూజించిన వారి ఇంట లక్ష్మీదేవి స్థిరముగా ఉంటుంది. శివునికి బిల్వపత్రములతో సహస్రనామపూజ చేసిన వారికీ జన్మరాహిత్యం కలుగుతుంది.  కార్తీక మాసములో ఉసిరి చెట్టు కింద సాలగ్రామమును ఉంచి భక్తితో పూజించిన వారికీ మోక్షం కలుగుతుంది. అలాగే బ్రాహ్మణులకు కూడా ఉసిరిచెట్టు క్రింద భోజనము పెట్టి తరువాత వాళ్ళు తిన సర్వ పాపాలు పోతాయి. కార్తక మాసములో కార్తీకస్నానాలు, వ్రతాలు, దీపారాధనలు చేయలేని వారు ఉదయం, సాయంత్రం, దేవాలయానికి వెళ్లి స్వామిని దర్శనం చేసుకోవాలి.  సంపనులు శివకేశవుల ఆలయాలకు వెళ్లి భక్తితో దేవతార్చన, యజ్ఞయాగాదులు, దానధర్మాలు, చేసిన వారికీ అశ్వమేధయాగము చేసిన ఫలితము కలుగుతుంది. వారి పితృదేవతలకు కూడా వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. శివాలయమునగాని, విష్ణువాలయమునగాని, జండా ప్రతిష్టుస్తే యమకింకరులు దగరకు కూడా రాలేరు. ఈ కార్తీక మాసములో తులసికోట వద్ద ఆవు పేడతో అలికి శంఖుచక్రాలు ఆకారాలు వేసి నువ్వులు ధాన్యము పోసి వాటి పైన ప్రమిద ఉంచి అందులో నువ్వులనూనె పోసి, వత్తిని వెలిగించలి. ఈ దీపాలు రాత్రి అంత ఆరకుండా చూడాలి. దీనినే నందా దీపము అంటారు. ఈ విధముగా చేసి నైవేద్యం పెట్టి కార్తీక పురాణము చదివితే హరిహరాదులు సంతసించి కైవల్యం ప్రసాదిస్తారు. కార్తీక మాసములో శివునికి జిల్లేడు పూవులతో అర్చించిన ఆయుష్షు వృద్ధి కలుగుతుంది. సాలగ్రామమునకు ప్రాతినిత్యం గంధము పటించి తులసితలములతో పూజించాలి. కార్తీక మాసములో నెలరోజులు పూజచేయలేనివారు ఒక సోమవారమైన చేసి శివకేశవులను పూజించిన మాసా ఫలితము కలుగుతుంది. కనుక జనకమహారాజా! నీవుకూడా యి వ్రతము ఆచరించి తరించు అని వసిష్ఠుడు జనకమహారాజుకు చెప్పారు. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...