రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.  




1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రాముడు శివధనుర్భగం చేసారు అని ఆయనమీదకి యుద్ధనికి వచ్చి చివరికి శ్రీరాముడే శ్రీమహావిష్ణువు అని తెలుసుకొని వెళ్లిపోతారు.  ఇటు మహాభారతంలో భీష్ముడికి,  కర్ణుడికి గురువుగా కనిపిస్తారు. 

2. హనుమంతుడు = రామాయణంలో సీతారాములను కలపటానికి కీలకంగా వ్యవహరిస్తారు.  అంతేకాకుండా శ్రీరాముడిని తన దైవంగా పూజిస్తారు. మహాభారతంలో భీముడు పారిజాత పువ్వుల కోసం కుబేరుని వనం లోకి వెళుతుండగా  గంధమాదన పర్వతం పైన బీముడికి దర్శనం ఇచ్చి దిశా నిర్ధేశం చేస్తారు.

3 జాంబవంతుడు = రామాయణంలో  రామరావణ యుద్ధంలో రాముని పక్షం వహించి యుద్ధం చేస్తారు. అలాగే మహా భారతంలో శ్రీకృష్ణుడికి తన కుమార్తె జాంబవతిని ఇచ్చి వివాహం చేస్తారు.

4. విభీషణుడు = రామాయణంలో లంకలో రావణుని తమ్మునిగా రావణుని మరణానంతరం రాక్షస రాజుగా సింహాసనాన్ని అధిష్టిస్తారు. మహాభారతంలో సహదేవునికి రాజసూయ యాగం కింద తన మంత్రుల ద్వారా కప్పం  చెలిస్తారు. 

5. మాతలి =ఇంద్రుడి రధసారధి. ఈయన రామాయణంలో రాముడికి మహాభారతంలో అర్జునుడికి సారధ్యం వహిస్తారు.

6. నారద మహర్షి = ఈయన రామాయణంలోను మహాభారతంలోని కనిపిస్తారు.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...