రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.
1. పరశురాముడు = ఈయన రామాయణంలోను మహాభారతంలోను కనిపించారు. రామాయణంలో రాముడు శివధనుర్భగం చేసారు అని ఆయనమీదకి యుద్ధనికి వచ్చి చివరికి శ్రీరాముడే శ్రీమహావిష్ణువు అని తెలుసుకొని వెళ్లిపోతారు. ఇటు మహాభారతంలో భీష్ముడికి, కర్ణుడికి గురువుగా కనిపిస్తారు.
2. హనుమంతుడు = రామాయణంలో సీతారాములను కలపటానికి కీలకంగా వ్యవహరిస్తారు. అంతేకాకుండా శ్రీరాముడిని తన దైవంగా పూజిస్తారు. మహాభారతంలో భీముడు పారిజాత పువ్వుల కోసం కుబేరుని వనం లోకి వెళుతుండగా గంధమాదన పర్వతం పైన బీముడికి దర్శనం ఇచ్చి దిశా నిర్ధేశం చేస్తారు.
3 జాంబవంతుడు = రామాయణంలో రామరావణ యుద్ధంలో రాముని పక్షం వహించి యుద్ధం చేస్తారు. అలాగే మహా భారతంలో శ్రీకృష్ణుడికి తన కుమార్తె జాంబవతిని ఇచ్చి వివాహం చేస్తారు.
4. విభీషణుడు = రామాయణంలో లంకలో రావణుని తమ్మునిగా రావణుని మరణానంతరం రాక్షస రాజుగా సింహాసనాన్ని అధిష్టిస్తారు. మహాభారతంలో సహదేవునికి రాజసూయ యాగం కింద తన మంత్రుల ద్వారా కప్పం చెలిస్తారు.
5. మాతలి =ఇంద్రుడి రధసారధి. ఈయన రామాయణంలో రాముడికి మహాభారతంలో అర్జునుడికి సారధ్యం వహిస్తారు.
6. నారద మహర్షి = ఈయన రామాయణంలోను మహాభారతంలోని కనిపిస్తారు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి