రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.  




1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రాముడు శివధనుర్భగం చేసారు అని ఆయనమీదకి యుద్ధనికి వచ్చి చివరికి శ్రీరాముడే శ్రీమహావిష్ణువు అని తెలుసుకొని వెళ్లిపోతారు.  ఇటు మహాభారతంలో భీష్ముడికి,  కర్ణుడికి గురువుగా కనిపిస్తారు. 

2. హనుమంతుడు = రామాయణంలో సీతారాములను కలపటానికి కీలకంగా వ్యవహరిస్తారు.  అంతేకాకుండా శ్రీరాముడిని తన దైవంగా పూజిస్తారు. మహాభారతంలో భీముడు పారిజాత పువ్వుల కోసం కుబేరుని వనం లోకి వెళుతుండగా  గంధమాదన పర్వతం పైన బీముడికి దర్శనం ఇచ్చి దిశా నిర్ధేశం చేస్తారు.

3 జాంబవంతుడు = రామాయణంలో  రామరావణ యుద్ధంలో రాముని పక్షం వహించి యుద్ధం చేస్తారు. అలాగే మహా భారతంలో శ్రీకృష్ణుడికి తన కుమార్తె జాంబవతిని ఇచ్చి వివాహం చేస్తారు.

4. విభీషణుడు = రామాయణంలో లంకలో రావణుని తమ్మునిగా రావణుని మరణానంతరం రాక్షస రాజుగా సింహాసనాన్ని అధిష్టిస్తారు. మహాభారతంలో సహదేవునికి రాజసూయ యాగం కింద తన మంత్రుల ద్వారా కప్పం  చెలిస్తారు. 

5. మాతలి =ఇంద్రుడి రధసారధి. ఈయన రామాయణంలో రాముడికి మహాభారతంలో అర్జునుడికి సారధ్యం వహిస్తారు.

6. నారద మహర్షి = ఈయన రామాయణంలోను మహాభారతంలోని కనిపిస్తారు.


ద్రోణుడు ఏకలవ్యుడిని బొటనవేళ్లుని అడగటం ధర్మమా? అధర్మమా ?

 ద్రోణుడు ఏకలవ్యుడిని బొటనవేళ్లుని అడగటం ధర్మమా? అధర్మమా ?



ఏకలవ్యుడు హిరణ్యధనువు అనే నిషాదరాజు పుత్రుడు.


ఏకలవ్యుడు ఒకరోజు ద్రోణుడి దగ్గరకు వచ్చి తనకు విల్లు విద్య నేర్పమని అడిగాడు. దానికి ద్రోణుడు అంగీకరించాడు. అప్పుడు ఏకలవ్యుడు తిరిగి తాను ఉండే అరణ్యానికి వెళ్ళిపోయి ద్రోణుడినే గురువుగా భావిస్తూ విల్లువిద్య నేర్చుకున్నాడు.


ఒకరోజు కౌరవాపాండవులు వేటకు అడవికి వెళ్ళగా అక్కడ శబ్దబేది అనే అస్త్రం ప్రయోగించి ఏడు భాణాలు కుక్క నోట్లో పాడేటట్లు ఏకలవ్యుడు కొట్టాడు. అదిచూసి కౌరవ పాండవులు ద్రోణుడి వద్దకు వెళ్లి జరిగినది చెప్పారు. అతను ఎవరో చూద్దామని ద్రోణుడు ఏకలవ్యుడి వద్దకు వెళ్ళాడు. ఏకలవ్యుడు తననే గురువుగా భావించి విల్లువిద్య నేర్చుకున్నట్లు తెలిసింది. అప్పుడు ద్రోణుడు జరిగినది అర్ధం చేసుకొని నీవు నాకు గురు దక్షిణ చెల్లించాలి అన్నారు. అందుకు ఏకలవ్యుడు మీకు ఏమి ఇవ్వాలో అజ్ఞాపించండి అన్నారు. అప్పుడు ద్రోణుడు "నీ కుడి చేతి బొటన వెలు నివ్వు" అన్నారు. ఏకలవ్యుడు తన బొటన వెలునీ కోసి గురువు పాదాల దగ్గర ఉంచి గురువుని నమస్కారం వెళ్ళిపోయాడు. ఇది ధర్మమా? అధర్మమా?


అసలు ద్రోణుడు ఏకలవ్యుడికి విద్య ఎందుకు నేర్పలేదు?


అందుకు కారణం మహాభారతం అప్పటి కలమాన పరిస్థితులను బట్టి ద్రోణుడు హస్తినా పురంలో భిష్ముడి ద్వారా కురుపాండవులకు విద్యా నేర్పటానికి నియమించబడిన ఉద్యోగి. ఉద్యోగికి స్వాతంత్రం లేదు. యజమాని చెప్పే ధర్మలను పాటించవలసిందే. ఆ కాలపు నీయమాలను బట్టి బ్రాహ్మణక్షత్రియులకు తప్ప యుద్ధవిద్యాలు ఇతరులకు నేర్పటం నిషిద్ధం. అందుకనే ద్రోణుడు ఏకలవ్యుడికి విద్య నేర్పలేదు.


మరి 


ద్రోణుడు ఏకలవ్యుడి బొటనవేళ్లుని ఎందుకు అడిగాడు?


దానికి కారణం


అడవిలో జరిగిన విషయం కురుపాందవుల ద్వారా తెలుసుకున్న ద్రోణుడు దివ్యస్త్రాలు ఎప్పుడు జంతువులపైకాని నిరాయుధులపైకాని దివ్యస్త్రా విద్యా తెలియని వారిపై కానీ ప్రయోగించకూడదు. ఈ ధర్మాన్ని అతిక్రమించాడు ఏకలవ్యుడు. అందుకనే ఇతనిని ఈ విధముగా వదిలేస్తే తరువాతి కాలంలో అమాయకప్రజలపైన తన ప్రతాపాన్ని చూపిస్తాడు లోకానాశనానికి పునుకుంటాడు. ఇతనికి ఏది మంచి, ఏది చెడు తెలియదు. ఎక్కడ ఏమివాడాలో విచక్షణా జ్ఞానం లేదు. అందుకే ద్రోణుడు ఏకలవ్యుడిని బొటనవేళ్ళుతనకు గురుదక్షిణగా ఇవ్వమన్నారు. విల్లువిధ్యకు మూలం బొటనవిల్లే. గురుదక్షిణ సమర్పించిన ఏకలవ్యుడు అలాగే ఉండకుండా ఆ నాలుగు వేళ్ళతోనే విల్లు విద్యా అభ్యసించాడు.


ద్రోణచార్యులు అనుకున్నదే నిజంగా జరిగింది. ఏకలవ్యుడు ధర్మం వైపు కాకుండా అధర్మం వైపు అడుగులు వేసాడు. అధర్మానికి మారుపేరుగా నిలిచిన జారాసందునీతో చేరాడు. ఏకలవ్యుడు జరసందునికి విశ్వాసపాత్రుడిగా మారాడు. జరసంధుడు శ్రీకృష్ణుడితో యుద్ధనికి వచ్చినప్పుడు జరసంధుడి సైన్యంతో పాటు వచ్చిన ఏకలవ్యుడు శ్రీకృష్ణుడితో యుద్ధం చేసి అయన చేతిలో మరణించాడు. 


ద్రోణుడు నిజంగా స్వార్ధపరుడే అయితే తనని చంపటానికి పుటింది ధ్రుష్టద్యుమ్నుడు అని తెలిసిన అతనికి గురువై సకల విద్యాలు నేర్పించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...