భగవద్గీత

 అధ్యాయం 6

శ్లోకం 29

సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని |

ఈక్షతే యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శనః ||

అర్ధం :-

సర్వవ్యాప్తమైన అనంతచైతన్యమునందు ఏకీభావస్థితిరూపయోగ యుక్తమైన ఆత్మగలవాడును, అంతటను అన్నింటిని సమభావముతో చూచువాడును అగు యోగి తన ఆత్మను సర్వప్రాణులయందు స్థితమైయున్నట్లుగను, ప్రాణులన్నింటిని తన ఆత్మయందు కల్పితములుగను భావించును. 




సాలగ్రామం

సాలగ్రామం - స్వర్ణముఖీ 

సాలగ్రామం సాక్షితు శ్రీ మహా విష్ణువు స్వరూపం. ఈ సాలగ్రామాలు నేపాల్ లో ఉన్న కాట్మండు నగరంలో ఉత్తరణా ఉన్న గండకీ నదిలో ఉన్నాయి అని ప్రతీతి. 

       అసలు ఈసాలగ్రామం ఎలా భూలోకానికి వచ్చాయి.  అవి శ్రీమహా విష్ణువు స్వరూపం ఎలా అయ్యాయి. 

        పూర్వం రాక్షస రాజు అయినా జలంధరుడు కుమారుడు శంఖచూడుడు రాక్షస గురువుఅయిన శుక్రాచార్యుడు ఆజ్ఞ ప్రకారం బ్రహ్మ గురించి 100 సంవత్సరాలు గోరా తపస్సు చేశాడు. బ్రహ్మ అతని తపస్సుకి మెచ్చి అతనికి దర్శనా భాగ్యం కలిగించాడు. ఓ శంఖచూడుడ ని తపస్సుకి మెచ్చాను నీకు ఏమివరం కావాలో కోరుకో అని అన్నారు. అపుడు శంఖచూడుడు ఓ బ్రహ్మదేవా నాకు చావు లేకుండా వరం అనుగ్రహించు అన్నారు. అపుడు బ్రహ్మదేవుడు నాయన ఎవరైనా పుట్టిన తరువాత మరణించక తప్పదు నాతోసహా ఏది లోక నియమం. అపుడు శంఖచూడుడు అయితే స్వామి నాకు రెండు వరాలను అనుగ్రహించు అని అడిగాడు. అడుగు నాయన అన్నారు. నాకు మహా పతివ్రత అయినా భార్య కావాలి. బ్రహ్మ తధాస్తు అన్నారు. నా రెండొవ వరం ఆమె పాతివ్రతగా ఉన్నంతవరకు నాకు మరణం రాకూడదు అని కోరుకున్నాడు. దానికి బ్రహ్మదేవుడు తధాస్తు అన్నారు. 

            శంఖచూడుడు సంతోషంగా శుక్రాచార్యుడి దగరకు వెళ్లి ఈ విషయం చెప్పాడు. శుక్రాచార్యుడు సంతోషించి భూలోకములో ధర్మధ్వజుడు అనే రాజు ఉన్నాడు అతనికి బృంద అనే కుమార్తె ఉన్నది. ఆమెను వివాహం చేసుకోమని ఆజ్ఞాపించాడు. శంఖచూడుడు వెళ్లి ధర్మధ్వజునితో మాట్లాడి ఆమెను వివాహం చేసుకున్నాడు. కొంతకాలం సంతోషంగా గడిచిన తరువాత శుక్రాచార్యుడు శంఖచూడుడీతో ఇక నువ్వు లోకాన్ని జయించామని పంపుతాడు. శంఖచూడుడు భార్య అయినా బృంద చిన్నపటినుంచి శ్రీమహావిష్ణువు భక్తురాలు. ఆమె తన భర్త అయినా శంఖచూడుడీతో స్వామి మా తండ్రి గారి స్మామ్రాజ్యం మీ తండ్రి గారి స్మామ్రాజ్యం ఉన్నవి కదా మనం సంతోషంగానే ఉన్నముకదా లోకాన్ని జయించాలి అని ఆత్యాశను విడిచి పెట్టామని హితవు చెప్పింది.  రాక్షసుడైన శంఖచూడుడు వినలేదు.


         శంఖచూడుడు భూలోకాన్ని జయించాడు. మానవులను చిత్రహింసలు పెట్టాడు. యజ్ఞయాగాది క్రతువులు జరగకుండా ఆడుకున్నాడు. ఆ విధంగా దేవతలను బలహీనులను చేసి దేవతలపై దండెత్తాడు. అతని వరప్రభావం వలనా అతనిని దేవతలు ఏమిచేయలేకపోయారు. దేవతలు అక్కడినుండి భూలోకానికి వచ్చి అడవులలో తలదాచుకున్నారు. ఇక శంఖచూడుడునికి ఎదురులేదుఅని అహంకారంతో అనేక పాపాలు చేశాడు. దేవతలు అతని భాధలు భరించలేక బ్రహ్మదేవునికి మొరపెట్టుకున్నారు. అపుడు బ్రహ్మదేవుడు దేవతలారా అతని పాపాల వల్ల అతని తపఃశక్తి నశించింది. అతనిని చంపేవాడు ఒక మహాదేవుడే అని చేపి దేవతలను తీసుకొని బ్రహ్మ దేవుడు కైలాసానికి వెళ్లరు. మహాదేవుడు వీరి మొరలను ఆలకించి శంకచుడీడీపై యుద్ధనికి వేలాడు. మహాదేవుడు ఎంతగోరమైన యుద్ధం చేసిన శంఖచూడుడు మరణించటం లేదు. అపుడు శంకరుడు శ్రీమహావిష్ణువుని సహాయం కోరాడు. శ్రీమహావిష్ణువు బ్రహ్మదేవుని వరం గురించి చేపి శంకచూడుడి భార్య అయినా బృందకు పాతివ్రత్య భంగం కలగనంతవరకు శంఖచూడుడి మరణం సంభవించదు. నేను లోకం క్షేమం కోసం నేను బృంద పాతివ్రత్య భంగం కలిగిస్తాను అని శ్రీమహావిష్ణువు శంఖచూడుడి రూపం ధరించి బృంద దగరకు వేలారు. బృంద వచ్చింది నిజంగా తన భర్తే అనుకోని సంతోషించి అతనికి పాదాలు కడిగి భర్త అనే అనురాగంతో దగరకు వేలింది. ఆమె అలా వెళ్ళగానే ఆమె పాతివ్రత్యం భంగం అయింది. అదితెలుసుకున్నా బృంద రోదిస్తూ నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నిన్నే పరమాత్మగా పూజిస్తునాను కానీ నువ్వే నా పాతివ్రత్యాన్ని భంగం కలిగిస్తావా అని ఏడుస్తుంది. ఆ దుఃఖంలో విచక్షణ జ్ఞానం మరచి పోయి శ్రీమహావిష్ణువును నీవు శిలవు కమ్మని శపిస్తుంది. అందుకు శ్రీమహావిష్ణువు చిరునవ్వు నవ్వి లోక క్షామం కోసం నేను ఈ పని చేశాను. నీవు తాకిన ఈ దేహాన్ని ఇక్కడే వదిలేస్తాను. అది సాలగ్రామాలు గా మరి కోరిన వరాలను ప్రసాదిస్తుంది. బృంద నేటితో నీవు భూలోకానికి వచ్చిన కారణం, రాధాదేవి నీకు ఇచ్చిన శాపం, నీవు నన్ను కోరిన వరం నెరవేరాయి అని శ్రీమహావిషుణువు ఎల్లా చెప్పసాగాడు...................... 

                                         ................. ఇంకావుంది. 


భగవద్గీత

అధ్యాయం 6

శ్లోకం 28

యుంజన్నేవం  సదాత్మనం యోగివిగతకల్మషః|

సుఖేన బ్రహ్మసంస్పర్శమ్ అత్యంతం సుఖమశ్నుతే ||

అర్ధం :-

పాపరహితుడైన ఆ యోగిపూర్వోక్తరీతిగా నిరంతరము ఆత్మను పరమాత్మ యందే లగ్నమొనర్చుచు, పరబ్రహ్మపరమాత్మ ప్రాప్తిరూపమైన ఆపరిమితానందమును హాయిగా అనుభవించును. 



భగవద్గీత

 అధ్యాయం 6

శ్లోకం 27

ప్రసాంతమనసం హ్యేనం యోగినంసుఖముత్తమమ్ |

ఉపైతి శాంతరజసం బ్రహ్మభూతమకల్మషమ్||

అర్ధం :-

ప్రశాంతమైనమనస్సు కలవాడును, పాపరహితుడును, రజోగుణము శాంతమైనవాడును, అనగా ప్రపమ్చిక కార్యములయమ్దు ఆసక్తి తొలగినవాడును, సచ్చిదానంద ఘనపరమాత్మయందు ఏకిభవమును పొందినవాడును అగు యోగి బ్రహ్మానందమును పొందును. 



        

భగవద్గీత

 అధ్యాయం 6

శ్లోకం 26

యతో యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరమ్|

తతస్తతో నియమ్యైతత్ ఆత్మన్యేవ వశమ్ నయేత్||

అర్ధం :-

సహజముగా నిలకడలేని చంచలమైన మనస్సు ప్రాపంచిక విషయముల యందు విసృంఖలముగా పరిభ్రమించుచుండును. అట్టి మనస్సును ఆయా విషయములనుండి పదే పదే మరల్చి, దానిని పరమాత్మయందే స్థిరముగా నిల్పవలెను. 



భగవద్గీత

అధ్యాయం 6

శ్లోకం 25

శనైః శనైరుపరమేత్ బుద్ద్యా ధృతిగృహీతయా|
ఆత్మసంస్థం మనః కృత్వా న కించిదపి చింతయేత్ ||

అర్ధం :-

క్రమక్రమముగా సాధనచేయుచు ఉపరతిని పొందవలెను. ధైర్యముతో బుద్దిబలముతో మనస్సును పరమాత్మయందు స్థిరమొనర్చి, పరమాత్మనుతప్ప మరి ఏ ఇతర విషయమును ఏ మాత్రము చింతనచేయరాదు. 


భగవద్గీత

అధ్యాయం 6

శ్లోకం 24

సంకల్పప్రభవాన్ కామన్ త్యక్త్యాసర్వానశేషతః |

మనసైవేంద్రియగ్రామం వినియమ్య సనంతతః||

అర్ధం :-

సంకల్పములవలనకలిగిన కోరికలనన్నిటిని నిశ్శేషముగా త్యజించి, ఇంద్రియ సముదాయములను అన్నివిధములుగా మనస్సుతో పూర్తిగా నిగ్రహింపవలెను



ఆచమనం

పూజలు, వ్రతాల్లో ''ఆచమనం'' అనే మాట చాలా సార్లు వింటాం. 


"ఆచమనం" అనే ఆచారం పవిత్రమైనది.


ఉదయం లేచి స్నానం చేసిన తర్వాత, పూజకు ముందు, సంధ్యావందనం చేసే సమయంలో పలుసార్లు, భోజనానికి ముందు, తర్వాత, బయటకు ఎక్కడికైనా వెళ్ళి వచ్చిన తర్వాత ముఖం, కాళ్ళూ చేతులూ కడుక్కున్న తర్వాత ఆచమనం చేయొచ్చు.


ఆచమనం చేసే వ్యక్తి శుచిగా, శుభ్రంగా ఉండాలి. ఒక్కొక్కసారి ఒక్కొక్క ఉద్ధరణి చొప్పున మంత్రయుక్తంగా మూడుసార్లు చేతిలో నీరు పోసుకుని తాగాలి.


ఆచమనం గురించి సంస్కృతంలో ''గోకర్ణాకృతి హస్తేన మాషమగ్నజలం పిబేత్'' అని వర్ణించారు. అంటే, కుడి అరచేతిని ఆవు చెవి ఆకారంలో ఉంచి, ఇందులో మూడు ఉద్ధరణిల నీటిని (ఒక మినపగింజ మునిగేంత పరిమాణంలో నీళ్ళు) పోసి, వాటిని తాగాలి. చేతిలో పోసేనీళ్ళు అంతకంటే ఎక్కువ కానీ, తక్కువ కానీ ఉండకూడదు. నీరు కొలత అంతే ఉండాలి.


1.అసలు ఆచమనం ఎందుకు చేయాలి? 

మన గొంతు ముందు భాగం లోంచి శబ్దాలు వస్తాయి. దీన్ని స్వరపేటిక అంటాం. దీని చుట్టూ కార్టిలేజ్ కవచం ఉంటుంది కనుక కొంత వరకూ రక్షణ లభిస్తుంది.  అయినప్పటికీ, ఇది ఎంత అద్భుతమైనదో, అంత సున్నితమైనది. ఈ గొంతు స్థానంలో చిన్నదెబ్బ తగిలినా ప్రమాదం.

 స్వరపేటిక దెబ్బతిని మాట పడిపోవచ్చు, ఒక్కోసారి ప్రాణమే పోవచ్చు.  స్వరపేటిక లోపలి భాగంలో ధ్వని ఉత్పాదక పొరలు ఉంటాయి.  ఇవి ఇంగ్లీషు అక్షరం 'V' ఆకారంలో పరస్పరం కలిసిపోయి ఉంటాయి. 

 ఈ తంత్రులు సూక్ష్మంగా ఉండి, ఎపెక్స్ ముందుభాగంలో పాతుకుని ఉంటాయి. స్వరపేటిక కవాటాలు పల్చటి మాంసపు పొరతో ముడిపడి ఉంటాయి.

ఈ శరీర నిర్మాణం గురించి చెప్పుకోవడం ఎందుకంటే, మన భావవ్యక్తీకరణకు కారకమైన స్వరపేటిక మహా సున్నితమైనది. ముక్కు,నోరు, నాలుక, పెదవులు, పళ్ళు, గొంతు నాళాలు, అంగిలి, కొండనాలుక,గొంతు లోపలి భాగం, శ్వాస నాళం, అన్ననాళం, స్వర తంత్రులు, వాటిచుట్టూ ఉన్న ప్రదేశం ఇవన్నీ ఎంతో నాజూకైనవి. 

వీటికి బలం కలిగించడమే ఆచమనం పరమోద్దేశం.

ఆచమనంలో మూడు ఉద్ధరణిల నీరు మాత్రమే తాగాలి అనిచెప్పుకున్నాం కదా! గొంతులోంచి శబ్దం వెలువడేటప్పుడు అక్కడున్న గాలి బయటికొస్తుంది. 

ఇలా లోపలి నుండి గాలి బయటకు వస్తున్నప్పుడు అందులో వేగం ఉండకూడదు.

శబ్దం సులువుగా, స్పష్టంగా రావాలి. ఇలా కొన్నినీటిని జాగ్రత్తగా చేతిలోకి తీసుకుని, అంతే జాగ్రత్తగా మెల్లగాతాగడం అనే అలవాటు వల్ల మనం చేసే ప్రతి పనిలో శ్రద్ధ,జాగ్రత్త అలవడుతుంది. 

రోజులో ఆచమనం పేరుతో అనేకసార్లు మెల్లగా నీరు తాగడంవల్ల గొంతు, ఇతర అవయవాలు వ్యాయామం చేసినట్లు అవుతుంది.

“కేశవాయ స్వాహా" అన్నప్పుడు అది గొంతునుండి వెలువడుతుంది. నారాయణాయ స్వాహా" అనే మంత్రం నాలుక సాయంతో బయటకు వస్తుంది. 

చివరిగా "మాధవాయ స్వాహా" అనే మంత్రం పెదవుల సాయంతో వెలువడుతుంది.

ఆచమనం అనే ఆచారాన్ని పాటించి ఈమంత్రాలను ఉచ్చరించడం వల్ల గొంతు, నాలుక, పెదాలకు వ్యాయామం లభిస్తుంది.  పైగా ఇవి పరమాత్ముని నామాలు కనుక, భక్తిభావంతో ఉచ్చరించడం వల్లమేలు జరుగుతుంది.

ఇక ఉద్ధరణితో తిన్నగా ఎందుకు తాగకూడదు, చేతిలో వేసుకునే ఎందుకు తాగాలి అంటే, మన చేతుల్లో కొంతవిద్యుత్తు ప్రవహిస్తూ ఉంటుంది. 

చేతిలో నీళ్ళు వేసుకుని తాగడం వల్ల ఆ నీరు విద్యుత్తును పీల్చుకుని నోటి ద్వారా శరీరంలోనికి ప్రవేశిస్తుంది. అక్కడ ఉన్న విద్యుత్తుతో కలిసిశరీరం అంతా సమానత్వం ఉండేలా, సమ ధాతువుగా ఉండేలా చేస్తుంది.

ఒక ఉద్ధరణి చొప్పున కొద్దికొద్దిగా నీరు సేవించడం వల్ల ఆకొద్దిపాటి విద్యుత్తు పెదాలు మొదలు నాలుక, గొంతు, ప్రేగుల వరకూ ఉన్న సున్నితమైన అవయవాలను ఉత్తేజ పరుస్తాయి.

ఈ ప్రయోజనాలే కాకుండా ఒక పవిత్ర ఆచారంగా భావిస్తూ రోజులో అనేకసార్లు పాటించడం వల్ల మనసు దానిమీద కేంద్రీకృతమై,లేనిపోని బాధలు, భయాలు తొలగుతాయి.

ఏదో అలవాటుగా పాటించే ఆచారాల వెనుక ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. శాస్త్రీయత ఉంది.



భగవద్గీత














అధ్యాయం 6

శ్లోకం 23

తం విద్యాద్దుఃఖసంయోగవియోగం యోగసంజ్ఞిత|
స నిశ్చయేన యోక్తవ్యో యొకయ నిర్విణ్ణచేతసా||

అర్ధం :-

దుఃఖరూపసంసారబంధముల  నుండి విముక్తిని కలిగించు ఈ స్థితిని (భగవత్సాక్షాత్కారరూపస్థితిని) యోగము అని తెలియవలెను. అట్టి యోగమును ధృడమైన, ఉత్సాహపూరితమైన అనిర్విణ్ణ (విసుగులేని) చిత్తముతో నిశ్చయముగా సాధన చేయవలెను. 
        

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...