గంగావతరణం

భగీరథుని తపఃఫలితంగా గంగమ్మ అవతరించిన తిథి, జ్యేష్ఠ మాసం, శుక్ల ద్వాదశి(రామ లక్ష్మణ ద్వాదశి).


రామాయణంలో రామలక్ష్మణులు విశ్వామిత్రునితో అరణ్య మార్గంగుండా  విశ్వామిత్రుని ఆశ్రమానికి వెళుతుండగా తాటక సంహారం తరువాత గంగనది చెంతకు వెళతారు. అపుడు రాముడు విశ్వామిత్రుని గంగ నది గురించి అడుగగా విశ్వామిత్రుడు ఇలా వివరిస్తారు.     

సగరులు
ఇక్షుకు వంశపు రాజైన సగరునకు మహర్షుల వర ప్రభావం వలన మొదటి భార్య కేశినికి మహాతేజోవంతుడైన అసమంజసుడు, రెండవ భార్య సుమతికి చిన్న చిన్న తిత్తులతో కూడిన పిండం ప్ర్రసవింపబడింది, ఆ పిండానికి వున్న తిత్తులను దాదులు 60 వేల నేతికుండలలో భద్రపరచగా 60 వేల మంది కుమారులు కలిగిరి వీరు ప్రత్యేక నామాలతో కాక సగరులుగా ప్రసిద్ధి చెందారు. కాని పెద్దవాడైన అసమంజశుడు తనతోపాటు ఆడుకోవడానికి వచ్చె పిల్లలను సరయు నదిలో తోసివేసి వారు తమ ప్రాణాల కోసం పడే నరకయాతనను చూసి సంతోషపడే వాడు ఇది తెలిసిన ప్రజానీకం రాజుగారి కుమారుడు  అనే ఉద్దేశంతో రాజుగారికి చెప్పటానికి భయపడేవారు కానీ ఎంత వయసు వచ్చిన అసమంజసుడు ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాకపోయేసరికి భరించలేని ప్రజలు అసమంజసుడి  ఆగడాల గురించి మహారాజుకు తెలియజేయడంతో రాజు తన కుమారుడికి రాజ్య బహిష్కారం శిక్ష విధించి నిష్పక్షపాతమైన, ప్రజారంజకంగా పరిపాలన చేస్తున్నారు.


సగరుని అశ్వమేధ యాగం

ఆ తరువాత కాలంలో మహారాజు తన రాజ్యా విస్తరణ కొరకు తన అశేష సేనా వహిని కాక తన 60 వేల మంది పుత్రులే తనకు ఒక సేనలా కనిపించగా తాను మహర్షుల అనుమతి తీసుకొని అశ్వమేధ యాగాన్ని ఆర్యవర్తంలో చేయాలనీ సంకల్పించి యాగాశ్వమును విడిచిపెట్టెను యాగాశ్వ రక్షణకు తన కుమారులను పంపి తాను యాగ కంకణధారి అయి వుండెను. కాని మహారాజు ఈ అశ్వమేధ యాగాల పుణ్యఫలంతో తన ఇంద్రపదవికి పోటీ వస్తాడేమోనని భయపడిన ఇంద్రుడు యాగం భగ్నం చేయడానికి యాగాశ్వమును పాతాళం లోని కపిల మహర్షి ఆశ్రంమంలో దాచాడు. ఆ అశ్వానికి రక్షణగా వెళ్ళిన సగరుని 60 వేల మంది పుత్రులు భూ మండలమంతా గాలించిననూ యాగాశ్వపు ఆచూకి దొరక లేదు. తండ్రి సగర చక్రవర్తి ఆదేశాల మేరకు వారు పాతాళంలో వెతికేందుకు భూమిపై అనేక గుంతలను తీసి పాతాళ ప్రవేశం చేశారు. వీరి అత్యుత్సాహం భూదేవికి విపరీతమైన భాద కలిగింది. పాతాళంలో వెతుకుతున్న సగరులకు కపిల మహర్షి ఆశ్రమంలో యాగాశ్వం కనిపించడంతో ఇతనెవరో మాయోపాయంతో తమ యాగాశ్వమును తస్కరించి వుంటాడని భావించి, కోపోద్రికులై కపిల మహర్షి పైకి లంఘించారు. ఈ అలజడికి ధ్యాన సమాధి నుండి మేల్కొన్న మహర్షి తనపైకి వస్తున్న సగరుల వంక చూసి ఒక్క హుంకారం చేసాడు. మహర్షి కోపాగ్నికి 60 వేలమంది సగర పుత్రులు భస్మమై 60 వేల బూడిదకుప్పలై పోయారు.


భగీరథుని తపస్సు

యాగాశ్వము కొరకు వెళ్ళిన తన పుత్రులు ఎంతకీ తిరిగి రాకపోవడంతో యాగ పరిసమాప్తి కాక మథనపడుతున్న సగరుడు  అసమంజసుని కుమారుడు ఆంశుమంతుని పిలిచి ఈసారి నువ్వు పాతాళానికి వేళ్ళు అని చెప్పారు. అంశుమంతుడు యాగాశ్వమును వెతుకుతూ పాతాళానికి వెళ్ళాడు. పాతాళంలోని కపిల మహర్షి ఆశ్రమం చేరి అచ్చట గల యాగాశ్వమును గుర్తించి, కపిల మహర్షికి నమస్కరించి ఆయన అనుమతితో యాగాశ్వమును తీసుకొన్నాడు. అక్కడ పడివున్న బూడిద కుప్పలు తన తండ్రులవని మహర్షి కోపానికి బలియైనందున, వారికి ఉత్తమగతులు కలుగక ప్రేతములై అకలి దప్పులచే పీడింపబడుచున్నారని తెలుసుకున్నాడు. వారికీ తర్పణాలు ఇద్దామని నీటికోసం బయలుదేరారు. అపుడు ఆంశుమంతుని మేనమామ అయినా గరుత్మంతుడు ఇలా అన్నారు. వీరు మరణించినది. కపిల మహర్షి కోపాగ్నితో వీరికి ఉత్తమగతులు కలగాలి అంటే  దివిలో ఉండే సురగంగను పాతాళానికి తెచ్చి సగరుల బూడిద కుప్పలపై ప్రవహింపజేసినట్లయితే వారు ఉత్తమగతులను పొందుతారని చెప్పారు. తన తండ్రులకు జలతర్పణలు విడిచి యాగాశ్వముతో రాజ్యము చేరి యాగము పూర్తి చేయించాడు. సగర చెక్రవర్తి విశ్వ ప్రయత్నం చేసారు తన కుమారులకి ఉత్తమగతులు కల్పిదామని కుదరలేదు. తరువాత సగరుడు స్వర్గస్తుడైనాడు.



అయన తరువాత అంశుమంతుడు రాజు అయ్యాడు. తన తండ్రులకి ఉత్తమగతులు కలుగలేదనే చింత ఆంశుమంతునికి వీడలేదు ఆయనకి కుదరలేదు. ఆంశుమంతుని తరువాత దిలీపుడు రాజు అయ్యాడు. అయన తన పూర్వుకులకు ఉత్తమగతులు కల్పించాలని పరితపించారు. దిలీపుడు వల్లకూడా అవలేదు. దిలీపుడు తరువాత భగీరధుడు రాజు అయ్యాడు. అయన రాజు అవుతూనే తపస్సుకు వెళ్లరు. రాజ్య పరిపాలనా బాధ్యతలను చేపట్టిన  తన వంశజులకు అప్పగించి తాను సురగంగను భువికి తెచ్చుటకు గాను 10,000 సంవత్సరాలు బ్రహ్మ గురించి ఘోర తపస్సు చేసాడు. అతని తపస్సుకు మెచ్చిన బ్రహ్మ భగీరధునికీ ప్రత్యక్షమయ్యారు. పాతాళలోకంలో వున్న తన పూర్వీకుల ప్రేతత్వం తొలగి అమరలోకం చేరేందుకు గాను, అమరలోకవాసిని అయిన సురగంగను భూలోకానికి అనుమతించమని ప్రార్థించాడు. అందుకు సృష్టికర్త గంగ భువికేగే వరమిచ్చాడు. కానీ గంగ దేవి ఉధృతని భూమి తట్టుకోలేదు. అందుకు నీవు పరమేశ్వరుని గురించి తపస్సు చేయమన్నారు. భగీరధుడు  సంతోషించి పట్టువిడవక ఇనుమడించిన దీక్షతో కాలి బోటనవేలుపై మరియొక సంవత్సరం పరమేశ్వరుని గూర్చి ఘోర తపస్సు చేసాడు. భగీరధుని తపస్సుకు మెచ్చినా మహేశ్వరుడు దర్శనమిచ్చి, అతని ప్రార్థనను మన్నించి గంగ తన తలపైకి దూకవచ్చని చెప్పాడు. చంద్రశేఖరుడు హిమత్ పర్వతాగ్రమున నిలచి తన ముడివేసి వున్న తన జటాజుటమును విదల్చి, ఓరకంట దివి నుండి భువిని బ్రద్దలుచేయగలనన్న అహముతో వున్న గంగను చూచి చిరుమందహాసం చేసాడు. తన నడుముపై చేతులను వుంచి నిలచిన శంకరుని పరిహాస దృష్టితో చూచిన గంగ, ఉత్తుంగ తరంగాలతో, వడితిరుగుతున్న సుడులతో, మహోగ్రధృతితో తనలోని మకరాలు, మీనాలు, కూర్మాలతో జలచరములన్నింటితో సహా పరమేశ్వరుని పాతాళానికి తొక్కాలన్న తన అహంతో ఆకాశమంతా పరుచుకున్న తన జలాలతో మహావేగంతో శివుని పైకి దూకింది. అంతట పరమేశ్వరుడు గంగాదేవి అహంకారం గ్రహించి చాపిన తన జటలను చుట్టి ఇంతటి గంగను తన జటలలో బంధించివేసాడు. గంగ ఆకాశం నుండి పడుతునే ఉంది శివుని జటలో తిరుగుతూనే వుంది సంవత్సరాలు గడుస్తున్నాయి కానీ కనీసం ఒక్క చుక్క గంగాజలమైనా భూమిపై పడలేదు.


ఇంతటి తన శ్రమ తరువాత, భువికి చేరిన గంగ శివుని జటలలో బందీ అవడాన్ని చూచిన భగీరధుడు, గంగను విడుచి, కరుణించమని శివుడిని ప్రార్థించాడు. భక్తవరదుడైన శివుడు గంగను ఒక సన్నని పాయగా తన జటాజూటము నుండి విడువగా గంగ ధరిత్రిని చేరింది. గంగను చూచి సంతోషించిన భగీరధుడు గంగను అనేక విధాల స్తుతించాడు. అతంట మహదానందముతో భగీరధుడు ముందుకు సాగాడు. గంగ అతణ్ణి అనుసరించుచూ తన మార్గంలోని వాటిని తనలో కలుపుకుంటూ అంతకంతకు తనవేగాన్ని, పరిమాణాన్ని విస్తరింపజేస్తూ భగీరధుని వెంట సాగింది. 

ఈ క్రమంలో తన మార్గంలో వున్న జహ్ను మహర్షి ఆశ్రమమును తన ప్రవాహంతో ముంచెత్తింది. జహ్నుమహర్షి కుపితుడై తన ఆశ్రమమును ధ్వంసము చేసిన గంగానదిని తన యోగశక్తితో బంధించాడు. ఒక్కసారిగా తనను ఆనుసరిస్తున్న జలధారల గలగల సవ్వడులు వినపడకపోయేసరికి వెనుతిరిగి చూచిన భగీరధుడు నిశ్చేష్టుడయ్యాడు. మహర్షి ద్వారా జరిగినది తెలుసుకున్న భగీరథుడు గంగను విడువమని మహర్షిని పరిపరి విధముల స్తుతించగా మహర్షి గంగను తన కుడిచెవి నుండి విడిచిపెట్టెను. జహ్ను మహర్షి నుండి ఉద్భవించినది కాబట్టి గంగ జాహ్నవి అయింది. గంగ భగీరథుని అనుసరించి పాతాళలోకం చేరి అతని పూర్వీకుల బూడిదపై ప్రవహించి వారికి ఉత్తమగతులను ప్రసాదించింది. ఆలా గంగదేవి జ్యేష్ఠ మాసంలో శుక్ల ద్వాదశి అనగా రామలక్ష్మణ ద్వాదశి రోజున భూమి మీదకు వచ్చింది. 


             

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...