నిర్జల ఏకాదశి వ్రతకథ

సంవత్సరానికి మొత్తం 24 ఏకాదశులు. రేపు అనగా 02.06.2020న వచ్చే ఏకాదశి 11 వ ఏకాదశి నిర్జల ఏకాదశి. 
జ్యేష్ఠ , శుక్ల  ఏకాదశి. 
ప్రారంభం - 02:57 PM, జూన్  01
ముగింపు - 12:04 PM, జూన్ 02



నిర్జల ఏకాదశి వ్రతకథ :-

పూర్వము మహాభారత కాలంలో వనవాస సమయంలో ఒక రోజు పాండవుల దగ్గరకి శ్రీ కృష్ణుడు వచ్చారు. అపుడు ధర్మరాజు శ్రీ కృష్ణుడుతో మా దోషాలు పోవటానికి ఏ వ్రతం ఆచరిస్తే మంచిది అని అడిగారు. అపుడు శ్రీ కృష్ణుడు ధర్మరాజుతో అన్ని వ్రతాలలో విశిష్టమైనది ఏకాదశి వ్రతం. అది ఆచరించండి. దానికి ధర్మరాజు ఆ వ్రతం ఎలా ఆచరించాలి అని అడిగారు. శ్రీ కృష్ణుడు వివరిస్తూ సంవత్సరానికి మొత్తం 24 ఏకాదశులు ఉంటాయి. ఏకాదశి వ్రతం అనగా దశమి రోజు రాత్రి ఉపవాసం ఉండి మరునాడు ఏకాదశి రోజు పగలు, రాత్రి ఉపవాసం చేసి మరునాడు అనగా ద్వాదశి రోజునా  బ్రాహ్మణులతో సహపంక్తి భోజనం చేసి  బ్రాహ్మణులతో వేదపారాయణం, శాస్త్రవచనం, విష్ణు సహస్త్రనామ పారాయణము, ఇష్టదేవతారాధన చేయాలి. ఆ రోజు రాత్రి ఉపవాసం ఉండాలి అని చెప్పారు. అందుకు పాండవులు వ్రతం ఆచరిస్తాము అన్నారు. కానీ భీముడు మాత్రం ఉపవాసమా అన్నారు. భీముడు భోజనప్రియుడు. ఉపవాసం చేయలేను అని శ్రీ కృష్ణుడితో చెప్పేను. అందుకు శ్రీకృష్ణుడు అని ఏకాదశులు వ్రతం చేయకపోయినా జ్యేష్ఠమాసంలో శుక్లపక్షంలో వచ్చే నిర్జల ఏకాదశి ఒకటి మాత్రం చేయమన్నారు. నిర్జల ఏకాదశి అంటే నీరుకూడా తీసుకోకుండా చేసే ఏకాదశి అన్ని అర్ధం . అందుకు భీముడు సంతోషించి ఏకాదశి వ్రతం చేసారు.    

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...