ధృవచరిత్ర

పార్ట్ 1
           
   పూర్వం ఉత్తానపాదుడు అను రాజు ఉండేవారు. ఆయనకి ఇద్దరు భార్యలు. వారు సునీతి, సురుచి. వారికీ ఇద్దరు కుమారులు. సునీతి కుమారుడు ధ్రువుడు. సురుచి కుమారుడు ఉత్తముడు. ఉత్తానపాదుడు సునీతిని నిర్లక్ష్యం చేసి సురుచి మాటే వినేవారు. ఒక రోజు ఉత్తానపాదుడు అంతఃపురంలో ఉండగా సురుచి కుమారుడు ఉత్తముడిని తన తొడపైన కూర్చోబెట్టుకున్నాడు . అపుడే అక్కడికి వచ్చిన ధ్రువుడుకి కూడా తన తండ్రి తొడపైన కూర్చోవాలి అనిపించింది. వచ్చి తన తండ్రి తొడపైన కూర్చుదాము అనుకుంటుండగా సురుచి వచ్చి నీవు నీ తండ్రి తొడమీద కుంచుంటానికి విలేదు. నీవు నా కడుపునా పుట్టివుంటే నీవు కూర్చోవచ్చు. నీవు సునీతి కడుపునా పుట్టావు. నీకు శ్రీ మహా విష్ణువు అనుగ్రహము లేదు. అందుకే నీవు నా కడుపునా పుట్టలేదు అని ధ్రువుడిని తిడుతుండగా  అతనికి అర్ధంకాలేదు.



          అపుడు అతని వయసు ఐదు సంవత్సరములు. తనకు అర్ధం కాకా ఏడుస్తూ తన తల్లీ ఐనా సునీతి దగరకు వేళాడు. సునీతి ఏడుస్తున్న తన బిడను చూసి ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగింది. ధ్రువుడు ఏమి చెప్పాలో అర్ధం కాకా ఏడుస్తున్నాడు అపుడు అనంతపురంలో ఉన్న చెలికతేలు జరిగిన విషయం చెప్పారు. సునీతి ధ్రువుడితో మీ చిన్న తల్లీ చెప్పిన మాట నిజమే నీవు ఈ దురదృష్టవంతురాలి కడుపునా పుట్టావు కనుకనే నీకు ఇలా జరిగింది. నీకు శ్రీమహా విష్ణువు అనుగ్రహం కలిగితే అని నీకు సిద్ధిస్తాయి. నీవు వెంటనే అరణ్యంలో తపస్సుకు వేళ్ళు శ్రీ మహా విష్ణువు అనుగ్రహం దొరికినాకే నీవు ఇంటికి తిరిగిరా అని పంపించింది. వెంటనే ధ్రువుడు అరణ్యానికి బయలుదేరివెళ్లడు. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...