హిందూ సామ్రాజ్య దినోత్సవం

నేడు హిందూ సామ్రాజ్య దినోత్సవం




ఛత్రపతి శివాజీగా ఖ్యాతి పొందిన శివాజీ రాజే భోంస్లే పశ్చిమ భారతదేశాన మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించాడు.


 హిందూ ధర్మాన్ని, హిందూ సంస్కృతిని, హిందూ సమాజాన్ని సంరక్షించిన వారిలో అగ్రగణ్యుడుగా పేరుగాంచిన వీరుడు ఛత్రపతి శివాజీ. 1674 జూన్ 6న (జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి) రాయఘడ్ కోటలో వేద పఠనాల మధ్య శివాజీని క్షత్రియరాజులందరికీ అధిపతిగా కీర్తిస్తూ 'ఛత్రపతి' అని బిరుదును ప్రదానం చేసారు. ఛత్రపతి బిరుదుగాంచి హిందూ పదుపాదుషాహీ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసి చక్రవర్తి అయిన శివాజీ మహరాజ్ పట్టాభిషిక్తుడైన జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నాడు హిందూ సామ్రాజ్య దినోత్సవమును జరుపుకుంటారు.

శివాజీ క్రీ.శ. 1630 ఫిబ్రవరి 19వ సంవత్సరం వైశాఖమాసం శుక్లపక్ష తదియనాడు పూణే జిల్లాలోని జున్నార్ పట్టణం దగ్గర గల శివనేరి కోటలో షాహాజీ, జిజియాబాయి పుణ్యదంపతులకు జన్మించాడు. శివాజీ విద్య నలుగురు గురువుల మధ్య సాగింది. వీరందరి శిక్షణలో శివాజీ  రాజనీతి వ్యవహారాలు యుద్ధ తంత్రాలలో నిష్ణాతుడయ్యాడు. మొదటి గురువు తల్లి జిజియాభాయి, రెండవ గురువు దాదాజీకొండదేవ్, మూడవ గురువు తుకారాం, నాలుగోవ గురువు సమర్ధ రామదాసు వీరి దగ్గర శివాజీ సకల విద్యలు నేర్చుకున్నారు. 17 ఏళ్ళ వయసులో శివాజీ మొట్టమొదటి యుద్ధం చేసి బిజాపూర్ సామ్రాజ్యానికి చెందిన తోర్నా కోటను సొంతం చేసుకున్నాడు. హిందూ సామ్రాజ్య స్థాపనే లక్ష్యంగా శివాజీ ప్రయాణం జరిగింది. సుల్తానులతో యుద్ధాలు, కొల్హాపూర్ యుద్ధం, పవన్‌ఖిండ్ యుద్ధం, మొఘలులతో యుద్ధాలు, సూరత్ యుద్ధం, ఆగ్రా కుట్ర, సింహగఢ్ యుద్ధాలు చేసి హిందూ సామ్రాజ్య స్థాపన 1674 జూన్ 6 న శివాజీ ఛత్రపతి శివాజీగా పట్టాభిషిక్తుడైనాడు. శివాజీ మహిళల క్షేమం కోరిన మహానుభావుడు. సతి సహగమనాని నిషేదించారు . మహిళల చేత అన్నయ్య అని పిలిపించుకునే మహానుభావుడు. 
    


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...