ధృవచరిత్ర

పార్ట్ 2



ఇది గమనించిన నారదుడు ధ్రువుడు వద్దకు వచ్చి అతనిని పరీక్షించతలచి నీవు ఎక్కడికి వెళుతున్నావు అని అడిగాడు. అపుడు ధ్రువుడు నేను శ్రీ మహా విష్ణువు కోసం తపస్సు చేయటానికి వెళుతున్నాను అని చెప్పాడు. నారదుడు ఆడుకోవలసిన వయసులో తపస్సు ఎందుకు చెప్పు హాయిగా ఇంటికి వేలు. ఇంట్లో అమ్మ నాన్న ఎదురుచూస్తుంటారు అని చెప్పాడు. అందుకు ధ్రువుడు నేను ఇంటికి వేళ్లను అని జరిగినదంతా వివరించి చెప్పాడు. నారదుడు చిరునవ్వునవీ నీవు మీ చిన్న తల్లీ మీద కోపంతో తపస్సుకు వెళతాను అంటున్నావు కానీ నీ కోపాన్ని విడి ఆ పరమాత్మా పైన భక్తితో ధాన్యం చేస్తే స్వామి తప్పకుంటా కరుణిస్తాడు. కేవలం శ్రీ మహా విష్ణువుని మాత్రమే ధ్యానం చేయి వేరే ఆలోచన కూడా నీ మస్తిష్కములోనికి రానివ్వకు. స్వామి కి అర్చన చేయి ప్రతిరోజు నీకు ఏది దొరికితే దానినే నివేదించు . పండు, పూవులు, ఆకులూ ముఖ్యంగా తులసి దొరికితే అవి నివేదించు. ఆహారం మితంగా తీసుకో. నేను నీకు చెప్పే మంత్రాన్ని అనుక్షణం ధ్యానం చేయి అని ధ్రువుడి చెవి దగ్గర 'ఓం నమో భగవతే వాసుదేవాయ' అను మంత్రనీ ఉపదేశించి నారదుడు ధ్రువుడితో నీవు యమునా నది ఒడ్డున మధువనం ఉన్నది అది నిరంతరం శ్రీ మహా విష్ణువు పాదస్పర్శతో పావనమౌతుంది నీవు అక్కడికి వేళ్ళు అని నారదుడు దీవించి వేళాడు.




వెంటనే ధ్రువుడు యమునా నది ఒడ్డుకు వేళాడు. అక్కడ స్నానం చేసి శ్రీ మహా విష్ణువును నారదుడు చేపినట్టుగానే ఆరాధించాడు. పద్మాసనం వేసుకొని మనసును లగ్నం చేసి స్వామిని ధాన్యం చేయటం మొదలు పెట్టాడు. మొదటి నెలలో మూడు రోజులకు ఒకసరి వెలగ పండు, రేగిపండు తినేవాడు. రెండొవ నెలలో ఆరు రోజులకు పూర్తి అయినా తరువాత కొంచం గడ్డి, ఆకులూ తినేవాడు. మూడవ నెలలో తొమ్మిది రోజులకు ఒకసారి కొంచం నీళ్లు తాగేవాడు. నాలుగోవ నెలలో పనేండు రోజులకు ఒక సారి గాలి పీల్చి వదిలేవాడు. అయిదోవ నెలలో బోటనవేలు మీద నిలబడి స్వామిని ధాన్యం చేసేవాడు. ధ్రువుడు తపస్సు తీవ్రమై అతను బొటనవేలు మార్చినపుడు అలా భూమి అటువయపుకి ఒరిగిపోయేది. దేవతలకు భయం వేసింది. వారందరు వెళ్లి శ్రీ మహా విష్ణువుని వేడుకున్నారు. 


           

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...