dhruva cherithra లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
dhruva cherithra లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

ధృవచరిత్ర

పార్ట్ 3


శ్రీమహావిష్ణువు శ్రీమహాలక్ష్మి సహితముగా బయలుదేరి ధ్రువుడు ఉన్న చోటికి వచ్చారు. ధ్రువుడు కళ్ళు తెరిచి స్వామిని చూసి ఏమి మాట్లాడాలో తెలియక అలాగా స్వామిని చూస్తూ ఉండిపోయాడు. అపుడు స్వామి నాలుగు అడుగులు ముందుకు వేసి ధ్రువుడు దగ్గరకి వచ్చి స్వామి చేతిలో ఉన్న శంఖంను ధ్రువుడు తలపై పెట్టారు. శంఖం తలపై పెట్టగానే ధ్రువుడికి సకల విద్యలు, సకల వేదాలు, జ్ఞానం వచ్చాయి. అపుడు ధ్రువుడు స్వామి నీవు ఎవరివో నాకు తెలుసు. సమస్త బ్రమండములు సృష్టి అందు లేవు ఇవి అని మాయ కేవలం త్రిగుణాత్మకంగా ఏర్పడ్డాయి. సృష్టి అది, అంతము, నడుస్తున్నపుడు ఉన్న వాడివి నీవే . నీవు పురాణ పురుషుడవు. నిన్ను మరచిన వాడు జీవం మరణ చక్రంలోనే తిరుగుతూనే ఉంటాడు. నిన్ను శేరాను వేడిన వాడు ముక్తిని పొందుతాడు. అని స్తోత్రం చేసాడు ధ్రువుడు. 




శ్రీ మహా విష్ణువు విని సంతోషించి ధ్రువుడికి వరం ఇవ్వాలి అనుకున్నారు. ధ్రువా ! నీవు దేనికోసం తపస్సు చేసావో నాకు తెలుసు. నీ తండ్రి తొడపై నీ చిన్న తల్లి కుర్చోనివ్వలేదు అని అందరి కన్నా పెద్ద పదవి కావాలి అని తపస్సు చేసావు ఆ పదవి ఏమిటో కూడా నీకు తెలియదు. నీకు అది నేను ప్రసాదిస్తాను.  సామాన్యంగా ఆ పదవి ఎవరికీ ఇవ్వరు కానీ నీవు ఇంత చిన్న వయస్సులో చేసిన తపస్సు వలన నీకు అది ఇచ్చేస్తున్నాను. ధర్మమూ, అగ్ని, సూర్యుడు, నక్షత్రాలు, కశ్యపుడు, సప్తఋషులు, కాలము, రుతువులు, చంద్రులు అది కదలకపోతే దాన్ని ఆధారం చేసుకొని తిరుగుతాయో అటువంటి ధ్రువమండలంగా నిను మార్చేస్తున్నాను. నిను ఆధారం చేసుకొని సమస్త జ్యోతి చక్రం తిరుగుతుంది. అటువంటి పదవిని నీకు అనుగ్రహిస్తునాను అన్నారు స్వామి. కానీ ఇపుడే కాదు నీవు ముందు ఇంటికి వేలు నీకు రాజ్యాభిషేకం జరుగుతున్నది. నీకు భవిషత్తు చెపుతున్నాను. నీ తమ్ముడు మరణిస్తాడు. నీ చిన్న తల్లి కూడా మరణిస్తుంది. అని భోగాలు అనుభవించిన తరువాత నీకు వైరాగ్యము సిద్ధిస్తుంది. నీవు మళ్ళి తపస్సు చేస్తావు. నిన్ను అటువంటి ధ్రువమండలానికి తీసుకెళ్లి తరువాత నిన్ను నాలో ఐక్యం చేసుకుంటాను ఇదే నీకు చిట్టచివరి జన్మ అని చేపి స్వామి వెళ్లిపోయారు. 

ధృవచరిత్ర

పార్ట్ 2



ఇది గమనించిన నారదుడు ధ్రువుడు వద్దకు వచ్చి అతనిని పరీక్షించతలచి నీవు ఎక్కడికి వెళుతున్నావు అని అడిగాడు. అపుడు ధ్రువుడు నేను శ్రీ మహా విష్ణువు కోసం తపస్సు చేయటానికి వెళుతున్నాను అని చెప్పాడు. నారదుడు ఆడుకోవలసిన వయసులో తపస్సు ఎందుకు చెప్పు హాయిగా ఇంటికి వేలు. ఇంట్లో అమ్మ నాన్న ఎదురుచూస్తుంటారు అని చెప్పాడు. అందుకు ధ్రువుడు నేను ఇంటికి వేళ్లను అని జరిగినదంతా వివరించి చెప్పాడు. నారదుడు చిరునవ్వునవీ నీవు మీ చిన్న తల్లీ మీద కోపంతో తపస్సుకు వెళతాను అంటున్నావు కానీ నీ కోపాన్ని విడి ఆ పరమాత్మా పైన భక్తితో ధాన్యం చేస్తే స్వామి తప్పకుంటా కరుణిస్తాడు. కేవలం శ్రీ మహా విష్ణువుని మాత్రమే ధ్యానం చేయి వేరే ఆలోచన కూడా నీ మస్తిష్కములోనికి రానివ్వకు. స్వామి కి అర్చన చేయి ప్రతిరోజు నీకు ఏది దొరికితే దానినే నివేదించు . పండు, పూవులు, ఆకులూ ముఖ్యంగా తులసి దొరికితే అవి నివేదించు. ఆహారం మితంగా తీసుకో. నేను నీకు చెప్పే మంత్రాన్ని అనుక్షణం ధ్యానం చేయి అని ధ్రువుడి చెవి దగ్గర 'ఓం నమో భగవతే వాసుదేవాయ' అను మంత్రనీ ఉపదేశించి నారదుడు ధ్రువుడితో నీవు యమునా నది ఒడ్డున మధువనం ఉన్నది అది నిరంతరం శ్రీ మహా విష్ణువు పాదస్పర్శతో పావనమౌతుంది నీవు అక్కడికి వేళ్ళు అని నారదుడు దీవించి వేళాడు.




వెంటనే ధ్రువుడు యమునా నది ఒడ్డుకు వేళాడు. అక్కడ స్నానం చేసి శ్రీ మహా విష్ణువును నారదుడు చేపినట్టుగానే ఆరాధించాడు. పద్మాసనం వేసుకొని మనసును లగ్నం చేసి స్వామిని ధాన్యం చేయటం మొదలు పెట్టాడు. మొదటి నెలలో మూడు రోజులకు ఒకసరి వెలగ పండు, రేగిపండు తినేవాడు. రెండొవ నెలలో ఆరు రోజులకు పూర్తి అయినా తరువాత కొంచం గడ్డి, ఆకులూ తినేవాడు. మూడవ నెలలో తొమ్మిది రోజులకు ఒకసారి కొంచం నీళ్లు తాగేవాడు. నాలుగోవ నెలలో పనేండు రోజులకు ఒక సారి గాలి పీల్చి వదిలేవాడు. అయిదోవ నెలలో బోటనవేలు మీద నిలబడి స్వామిని ధాన్యం చేసేవాడు. ధ్రువుడు తపస్సు తీవ్రమై అతను బొటనవేలు మార్చినపుడు అలా భూమి అటువయపుకి ఒరిగిపోయేది. దేవతలకు భయం వేసింది. వారందరు వెళ్లి శ్రీ మహా విష్ణువుని వేడుకున్నారు. 


           

ధృవచరిత్ర

పార్ట్ 1
           
   పూర్వం ఉత్తానపాదుడు అను రాజు ఉండేవారు. ఆయనకి ఇద్దరు భార్యలు. వారు సునీతి, సురుచి. వారికీ ఇద్దరు కుమారులు. సునీతి కుమారుడు ధ్రువుడు. సురుచి కుమారుడు ఉత్తముడు. ఉత్తానపాదుడు సునీతిని నిర్లక్ష్యం చేసి సురుచి మాటే వినేవారు. ఒక రోజు ఉత్తానపాదుడు అంతఃపురంలో ఉండగా సురుచి కుమారుడు ఉత్తముడిని తన తొడపైన కూర్చోబెట్టుకున్నాడు . అపుడే అక్కడికి వచ్చిన ధ్రువుడుకి కూడా తన తండ్రి తొడపైన కూర్చోవాలి అనిపించింది. వచ్చి తన తండ్రి తొడపైన కూర్చుదాము అనుకుంటుండగా సురుచి వచ్చి నీవు నీ తండ్రి తొడమీద కుంచుంటానికి విలేదు. నీవు నా కడుపునా పుట్టివుంటే నీవు కూర్చోవచ్చు. నీవు సునీతి కడుపునా పుట్టావు. నీకు శ్రీ మహా విష్ణువు అనుగ్రహము లేదు. అందుకే నీవు నా కడుపునా పుట్టలేదు అని ధ్రువుడిని తిడుతుండగా  అతనికి అర్ధంకాలేదు.



          అపుడు అతని వయసు ఐదు సంవత్సరములు. తనకు అర్ధం కాకా ఏడుస్తూ తన తల్లీ ఐనా సునీతి దగరకు వేళాడు. సునీతి ఏడుస్తున్న తన బిడను చూసి ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగింది. ధ్రువుడు ఏమి చెప్పాలో అర్ధం కాకా ఏడుస్తున్నాడు అపుడు అనంతపురంలో ఉన్న చెలికతేలు జరిగిన విషయం చెప్పారు. సునీతి ధ్రువుడితో మీ చిన్న తల్లీ చెప్పిన మాట నిజమే నీవు ఈ దురదృష్టవంతురాలి కడుపునా పుట్టావు కనుకనే నీకు ఇలా జరిగింది. నీకు శ్రీమహా విష్ణువు అనుగ్రహం కలిగితే అని నీకు సిద్ధిస్తాయి. నీవు వెంటనే అరణ్యంలో తపస్సుకు వేళ్ళు శ్రీ మహా విష్ణువు అనుగ్రహం దొరికినాకే నీవు ఇంటికి తిరిగిరా అని పంపించింది. వెంటనే ధ్రువుడు అరణ్యానికి బయలుదేరివెళ్లడు. 

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...