ధృవచరిత్ర

పార్ట్ 3


శ్రీమహావిష్ణువు శ్రీమహాలక్ష్మి సహితముగా బయలుదేరి ధ్రువుడు ఉన్న చోటికి వచ్చారు. ధ్రువుడు కళ్ళు తెరిచి స్వామిని చూసి ఏమి మాట్లాడాలో తెలియక అలాగా స్వామిని చూస్తూ ఉండిపోయాడు. అపుడు స్వామి నాలుగు అడుగులు ముందుకు వేసి ధ్రువుడు దగ్గరకి వచ్చి స్వామి చేతిలో ఉన్న శంఖంను ధ్రువుడు తలపై పెట్టారు. శంఖం తలపై పెట్టగానే ధ్రువుడికి సకల విద్యలు, సకల వేదాలు, జ్ఞానం వచ్చాయి. అపుడు ధ్రువుడు స్వామి నీవు ఎవరివో నాకు తెలుసు. సమస్త బ్రమండములు సృష్టి అందు లేవు ఇవి అని మాయ కేవలం త్రిగుణాత్మకంగా ఏర్పడ్డాయి. సృష్టి అది, అంతము, నడుస్తున్నపుడు ఉన్న వాడివి నీవే . నీవు పురాణ పురుషుడవు. నిన్ను మరచిన వాడు జీవం మరణ చక్రంలోనే తిరుగుతూనే ఉంటాడు. నిన్ను శేరాను వేడిన వాడు ముక్తిని పొందుతాడు. అని స్తోత్రం చేసాడు ధ్రువుడు. 




శ్రీ మహా విష్ణువు విని సంతోషించి ధ్రువుడికి వరం ఇవ్వాలి అనుకున్నారు. ధ్రువా ! నీవు దేనికోసం తపస్సు చేసావో నాకు తెలుసు. నీ తండ్రి తొడపై నీ చిన్న తల్లి కుర్చోనివ్వలేదు అని అందరి కన్నా పెద్ద పదవి కావాలి అని తపస్సు చేసావు ఆ పదవి ఏమిటో కూడా నీకు తెలియదు. నీకు అది నేను ప్రసాదిస్తాను.  సామాన్యంగా ఆ పదవి ఎవరికీ ఇవ్వరు కానీ నీవు ఇంత చిన్న వయస్సులో చేసిన తపస్సు వలన నీకు అది ఇచ్చేస్తున్నాను. ధర్మమూ, అగ్ని, సూర్యుడు, నక్షత్రాలు, కశ్యపుడు, సప్తఋషులు, కాలము, రుతువులు, చంద్రులు అది కదలకపోతే దాన్ని ఆధారం చేసుకొని తిరుగుతాయో అటువంటి ధ్రువమండలంగా నిను మార్చేస్తున్నాను. నిను ఆధారం చేసుకొని సమస్త జ్యోతి చక్రం తిరుగుతుంది. అటువంటి పదవిని నీకు అనుగ్రహిస్తునాను అన్నారు స్వామి. కానీ ఇపుడే కాదు నీవు ముందు ఇంటికి వేలు నీకు రాజ్యాభిషేకం జరుగుతున్నది. నీకు భవిషత్తు చెపుతున్నాను. నీ తమ్ముడు మరణిస్తాడు. నీ చిన్న తల్లి కూడా మరణిస్తుంది. అని భోగాలు అనుభవించిన తరువాత నీకు వైరాగ్యము సిద్ధిస్తుంది. నీవు మళ్ళి తపస్సు చేస్తావు. నిన్ను అటువంటి ధ్రువమండలానికి తీసుకెళ్లి తరువాత నిన్ను నాలో ఐక్యం చేసుకుంటాను ఇదే నీకు చిట్టచివరి జన్మ అని చేపి స్వామి వెళ్లిపోయారు. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...