సర్వస్య శరణాగతి గురించి చూపిన కథ ?


క్షిరసాగరం మధ్యలో  ఉన్న ద్విపంలో అనేక అరణ్యాలతో కూడుకున్న త్రికూట పర్వతం దగ్గర కొన్ని కోట్ల ఏనుగులు జీవించేవి. వీటి అన్నిటికి రాజు గజేంద్రుడు. ఈ గజేంద్రుడికి అనేక మంది భార్యలు ఉన్నారు.ఆ అడవి అంత చందం చెట్లతో నింది ఉన్నది. ఒక రోజు గజేంద్రుడు తన పరివారముతో కలిసి వన విహారానికి వేలాడు. మార్గం మధ్య లో ఏనుగులకు దాహం తీర్చుకోవటానికి అక్కడే ఉన్న సరస్సులోకి వెళ్లి నీళ్లు తాగి రాకుండా ఆ సరస్సు లోని నీటితో ఆడుకోవటం మొదలుపెట్టాయి. వీటి ఆటలకి సరస్సు చెల్లచెదురు అయింది. సరస్సులో ఉన్న కమలాలు అని పోయాయి. ఈ సరస్సులో ఉన్న మొసలి ఏనుగుల రాజు అయినా గజేంద్రుడి కాళ్ళని పట్టుకుంది. 

ఈ గజేంద్రుడు తన బలాన్ని అంతటిని ఉపయోగించి మొసలితో యుద్ధం చేసింది. ఈ యుద్ధం లో రాను రాను గజేంద్రుడి బలం తగిపోయి తాను చనిపోయే స్థితికి వచ్చింది. అపుడు గజేంద్రుడు చుట్టు చూసాడు తన పరివారం అంత తనకు సహాయం చేయకుండా సరస్సు నుంచి పారిపోయే చూస్తున్నాయి. తనకు సహాయం ఆ సర్వేశ్వరుడే తప్ప ఇంకా ఎవరు చేయలేరు అని గజేంద్రుడికి అర్ధం అయింది.

ఓ సర్వేశ్వరా! నాకు నీవు తప్ప వేరే దిక్కు లేదు. నీవే నను రక్షించే నాధుడవు. నీవే సృష్టిని సృష్టించి నడిపించి లయం చేసే వాడివి నీవే. నన్ను నీవు పరిపూర్ణ పురుషుడవు. నను రక్షించు స్వామి అని గజేంద్రుడు ప్రాదించాడు. ఇంకా గజేంద్రుడు నేను ఎలాగో చనిపోతాను నన్ను రక్షించి నాకు మోక్షాన్ని ప్రసాదించు స్వామి అని వేడుకున్నాడు. 

ఈ ప్రార్ధనలు విన్న శ్రీమహావిష్ణువు గజేంద్రుడిని రక్షించడానికి పరుగు పరుగునా బయలుదేరాడు స్వామి. తన చెంతనే ఉన్న శ్రీ లక్ష్మికి కూడా చెప్పకుండా శంఖు చక్రాలు ధరించకుండ గరుడ వాహనము తీసుకోకుండ స్వామి పరుగు పరుగునా వస్తుంటే వెనక శ్రీ మహా లక్ష్మి, శంఖు చక్రాలు, గరుడుడు, వైకుంఠ వాసులు అందరూ స్వామి తో భయాలు దేరివచ్చారు. విష్ణుమూర్తి రాగానే గజేంద్రుడు మనసులో తలచుకుంటున విరాట స్వరూపం కళ్లముందు వచ్చేసరికి పక్కనే ఉన్న కమలంను స్వామికి ప్రసాదించాడు. స్వామి తన చేతిలో ఉన్న కమలంను పక్కన పెట్టి గజేంద్రుడు ప్రసాదించిన కమలంను తీసుకున్నారు. అదే చేతితో స్వామి గజేంద్రుడి తల నిమిరారు. వెంటనే సుదర్శన చక్రంతో మొసలిని చంపేశారు స్వామి. 

ఈ కధలో పరమాత్మనిన్నమి నీవే దిక్కు అని తలచిన వారికీ నీవే సత్యం మిగిలిన జగతి అంత అసత్యం అని తలచిన వారికీ తపకుండ కాపాడతారు అని వివరించిన కథ.




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...