నాగుల చవితి సందర్భముగా మనసా దేవి విశిష్టత
తరువాత మానస దేవి ఆదేశానుసారం భూమిపై విచ్చలవిడిగా సంచరిస్తున్న వేలది నాగులు నాగలోకానికి తిరిగి వచ్చేశాయి.
ఆమె పుటిన కొన్నాళ్లకి తల్లితండ్రులకి నమస్కరించి శివుని కోసం తపస్సుకి వెళ్లిపోతుంది. ఆమె తపస్సుకి మెచ్చి శంకరుడు ప్రత్యక్షమయ్యాడు. ఆమె తపస్సుకి మెచ్చిన శివుడు ఆమె కొరినవిధంగా నాగులను అభరనాలుగా ధరించి నాగాజాతికి సముచిత గౌరవం కల్పిస్తానని వరమిచాడు. తపస్సు వాళ్ళ దేహం నిరసించడంతో ఆమెని జరత్కారువు అని పిలిచారు. శివుడు మానస దేవితో కొన్నాళ్లకి నీకు జరత్కారువుతో వివాహం జరుగుతుంది. నీకు అస్తుకుడు అనే కుమారుడు పుడతారు. లోక కళ్యాణం జరిగినతరువాత నీవు మరల ఎక్కడికి వచ్చి మానస దేవిగా వెలిసి భక్తుల కోరికలు నెరవేరుస్తావు అని వరం ఇచ్చి అదృశ్యమవుతారు. (మనసా దేవి తపస్సు చేసిన ప్రదేశం హరిద్వార్లో ఉంది అక్కడే మనసా దేవి గుడి ఉంది.)
మానసా దేవి తరువాత జరత్కారుడు అనే మహామునిని వివాహం చేసుకొని గృహిణిగా తన ధర్మాన్ని నిర్వర్తిస్తుంది. కొంత కాలం గడిచాక వీరికి ఒక కుమారుడు జన్మించెను. ఆతని పేరు ఆస్తీకుడు. ఇతడు శివుని కోసం తపస్సును చేసి శివనుగ్రహము చేత సర్వశస్త్ర విశారదుడు అయేను.
తరువాతి కాలంలో జనమేజయుడు చేస్తున్నా సర్పయాగాని ఆస్తీకుడు నిలిపి వేసాను. ఇతని వల్ల నాగజాతి రక్షించబడింది. తన కుమారుడు వలన మానసా దేవి జన్మధన్యమైంది.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి