కేదారేశ్వర వ్రత కథ

హిందువులు ఆచరించే ఉత్తమమైన వ్రతం కేదారేశ్వరవ్రతం. ఈ వ్రతం కార్తీక మాసంలో పౌర్ణమి రోజున చేస్తారు. ఈ రోజు ఇంటిల్లపాది కఠోర ఉపవాసం ఉండి ఈ వ్రతమును ఆచరిస్తారు. 

          పూర్వం ఒకరోజు కైలాసంలో పార్వతి పరమేశ్వరులు ఆసీనులైవుండగా వారిని సేవించటానికి దేవగణములు, నందీశ్వరుడు, నారద తుంబురులు శివపార్వతులను స్తుతిస్తున్నారు. సప్తఋషులు ఆసీనులైయున్నారు. వినాయకుడు, కుమారస్వామి వీరభద్రుడు ఉన్నారు.  

        అందులో శివభక్త శ్రేష్ఠుడు అయినా బృంగురిటి అను అతను శివపార్వతుల ముందుకు వచ్చి హాస్యాస్పదముగా అందరిని నవిస్తూ కోలాహలం చేసాడు.  అతని క్రియకి మెచ్చు శివుడు కిందకి దిగివచ్చి అతనిని ఆశీర్వదించారు.  అదే అదునుగా భావించి అతను శివునికి మాత్రమే ప్రదక్షిణలు చేసాడు.  అందుకు పార్వతి మాతకు కోపం వచ్చి శివుని వద్దకు వచ్చి స్వామి వీళ్ళు మిమ్మలిని మాత్రమే ఎందుకు పూజిస్తున్నారు, నమస్కరిస్తున్నారు. నేను మీ అర్ధాంగిని కదా నాకు ఎందుకు మీతో సమానంగా పూజించి నమస్కరించటం లేదు.  అందుకు శివుడు దేవి వీరు విరాగులు, వైరాగ్యము కలవారు.  వీరు నా భక్తులు మాత్రమే అందుకే నాకు మాత్రమే నమస్కరించారు అని అన్నారు.  అందుకు కోపంతో పార్వతీదేవి కైలాసం నుంచి వెళ్లిపోతుంది. 

         పార్వతీదేవి గౌతమముని ఆశ్రమానికి వస్తుంది.  గౌతమముని పార్వతీదేవిని చూసి మాత తమరు ఎవరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అని అడిగారు.  అందుకు పార్వతీదేవి మునివర్యా నేను హిమవంతుని పుత్రికను, శివుని భార్యని పార్వతీదేవిని అనితెలిపింది.  నేను ఇక్కడికి తపస్సు చేయటానికి వచ్చాను.  నా భర్త శరీరంలో సగభాగం అవ్వాలనే సంకల్పంతో ఇక్కడికి వచ్చాను.  నా సంకల్పం నెరవేరడానికి నాకు మార్గం చెప్పండి అని అడిగారు. అందుకు గౌతమముని మాత నేను మీకు చెప్పగలిగేవాడిన నా ధ్వారా ఈ విషయం లోకానికి తెలియాలని మీసంకల్పం అయితే చెపుతాను వినండి మాత. కేదారేశ్వర వ్రతం ఈ వ్రతం ఆచరించేవారికి సకల కోరికలు, సకల సంపదలు కలిగి సుఖసంతోషాలతో జీవిస్తారు. శివుని కేదారేశ్వరునిగా భావించి పూజించాలి. ఆ రోజున శుచిగా స్నానాదులు ఆచరించి నిర్మలమైన మనస్సుతో మంగళకరములగు ఏకవింశతి దారముతో చేతికి తోరముని ధరించి షోడశోపచార విధులతో పూజను నిర్వహించి ఆ రోజున ఉపవాసముండవలెను. మర్నాడు బ్రాహ్మణులకి భోజనం పెట్టి ఆ తరువాత ఆహారమును తీసుకోవలెను. ధాన్యరాశిని పోసి అందు పూర్ణకుంభము నుంచి ఇరువది యొక్క పర్యాయములు సూత్రమును చుట్టి పట్టువస్త్రముతో దానిని కప్పియుంచి నవరత్నములు గాని సువర్ణమును గాని ఉంచి గంధ పుష్పాక్షలతో పూజించాలి. మాత ఇరవై ఒక్కమంది బ్రాహ్మణులను రప్పించి వారి పాదములను కడిగి కూర్చండబెట్టి యధావిధిగా ధూప దీప గంధ పుష్పాక్షతలతో పూజించి భక్ష్య - భోజ్య, నైవేద్యాదులు కదళీఫలాలు పనసలు ఆరగింపచేసి తాంబూల దక్షిణలిచ్చి వారలను తృప్తి పరచవలెను. ఈ తీరున వ్రతమాచరించిన వారిని శివుడు అనుగ్రహించి మనోభీష్టసిద్ధిని కలుగచేయునని గౌతముడు పార్వతికి వివరించాడు. పార్వతీదేవి అలాగే వ్రతము అచరించినది. శివుడి పార్వతీదేవి భక్తికి మెచ్చి ఆమె అభిష్టం మేరకు శివుని శరీరంలో సగభాగం ఇచ్చారు. అప్పటి నుండి పార్వతి పరమేశ్వరులు అర్ధనారీశ్వరులు అయ్యారు. 

      ఈ వ్రతమును భూలోకములో తేలియాలి అని చిత్రగదుడు అనే గంధర్వుడు నందీశ్వరుడి ద్వారా వ్రత విధానం తెలుసుకొని భూలోకములో ఉజాయిమి సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న వజ్రదంతుడు అనే రాజుకు వివరించాడు.  అతనుకూడా ఈ వ్రతమును ఆచరించి సార్వభౌముడు అయ్యాడు. అదే రాజ్యములో ఒక వైశ్యునికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారు ఒకరోజు తమ తండ్రి వద్దకు వచ్చి ఇలా అన్నారు తండ్రి మాకు కూడా కేదారేశ్వర వ్రతం చేయాలనీ ఆశగా ఉంది అని అడిగారు. అందుకు ఆ తండ్రి నాకు అంతస్తొమత లేదు అని చెప్పారు. అందుకు వారు ఒక చెట్టు కింద కూర్చొని వ్రత తోరములు కట్టుకొని శివుడిని ప్రాదించారు. శివుడు వారికీ వ్రతానికి కావలసినవన్నీ ఇచ్చారు. వాళ్ళు భక్తితో ఆ వ్రతం ఆచరించారు. శివుడు వారిని అనుగ్రహించారు. వారిని సౌందర్యవంతులుగా ఆశీర్వదించారు. కొంతగా కాలానికి వాళ్ళు యువతులు అయ్యారు. అందులో పెద్ద అమ్మాయిని ఉజాయిని రాజు వివాహం చేసుకున్నారు. చిన్న అమ్మాయిని చోళరాజు వివాహం చేసుకున్నారు. వారి తండ్రికి సకల ఐశ్వర్యాలు కలిగాయి. ఇలా ఉండగా అందుకు చిన్న అమ్మాయి కేదారేశ్వర వ్రతం మెచ్చిపోయేది. అందువలన ఆమె, ఆమెకుమారుడి రాజ్యమునుంచి పంపించివేశారు. ఆమె అడవిలో ఒక బోయవాని ఇంట్లోతల దాచుకుంది. ఆమె తన కుమారుడిని పిలిచి మీ పెద్దతల్లి దగరకు వెళ్లి పరిస్థితి వివరించి కొంత ధనము తీసుకురమ్మని పంపించింది. ఆ కుమారుడు ఉజాయిని వెళ్లి పేదతల్లికి చెప్పగా ఆమె కొంతధనము ఇచ్చింది. ఆ ధనము తీసుకొని వస్తుండగా శివుడు మార్గ మధ్యములో ఆ ధనాన్ని మాయం చేసారు. మళ్లీ వెనక్కి తిరిగి వెళ్లి అతని పెద్దమ్మకి చేపగా మళ్లీ కొంత ధనాన్ని ఇస్తుంది. మళ్లీ అదికూడా మాయమవుతుంది. మళ్లీ వాళ్ళ పెద్దమ్మ దగ్గరకి వెళుతుండగా ఆకాశవాణి ఇలా వినిపిస్తుంది. కుమార మీ తల్లి కేదారేశ్వర వ్రతమును మరచిన కారణంగా నీకు ఈ ధనము దక్కదు అని వినిపిస్తుంది. ఆ కుమారుడికి అర్ధం కాక వాళ్ళ పెద్దమ్మ దగరకు వెళ్లి విషయం చెపుతాడు. అందుకు వాళ్ళ పెద్దమ్మ అక్కడే ఆ కుమారుడి చేత వ్రతం చేయించి కొంత ధనాన్ని ఇచ్చి పంపిస్తుంది. ఆ కుమారుడు ఆ ధనాన్ని తీసుకొని వచ్చి తల్లికి జరిగిన విషయం చేపగా ఆమె తప్పు తెలుసుకొని ఆమెకూడా ఈ వ్రతాన్ని ఆచరిస్తుంది. చోళరాజు సపరివారంగా వెతుకుంటూవచ్చి ఆమెను ఆమె కుమారుడిని తీసుకొని వెళతాడు. అప్పటినుండి కేదారేశ్వర వ్రతం విడవకుండా చేస్తు సుఖ సంతోషాలతో జీవించింది.

 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...