కార్తీక పురాణము 14వ రోజు

కార్తీకమాసంలో చేయకూడనివి

14వ అధ్యాయము



         ఈ మాసములో నీరుల్లిపాయ తినకూడదు. ఇతరుల ఎంగిలి తినరాదు. శ్రధ్ధాభోజనము తినరాదు. తిలదానము చేయకూడదు. శివార్చన, సంధ్యావందనం చేయనివారు వండిన వంటలు తినకూడదు. పౌర్ణమి, అమావాస్య, సోమవారములనాడు సూర్యచంద్ర గ్రహణపు రోజులయందున భోజనము చేయరాదు. కార్తీకమాసములో నెలరోజులు కూడా రాత్రులు భోజనము చేయకూడదు. ఏకాదశి,ద్వాదశీ వ్రతములు చేసేవారు ఆ రెండు రాత్రులు తప్పనిసరిగా జాగారము ఉండాలి. ఒక్కపూట మాత్రమే భోజనము చేయాలి. కార్తీకమాసములో నూనెరాసుకొని స్నానము చేయకూడదు. పురాణాలను విమర్శించకూడదు. కార్తీకమాసములో వేడినీటితో స్నానము  చేయకూడదు. ఒకవేళ అనారోగ్యముగా ఉండి ఎలాగైనా కార్తీకమాసా వ్రతం చేయాలి అనే కుతూహలం ఉన్నవారు మాత్రమే వేడినీటిస్నానము చేయవచ్చు. ఆలా చేసేవారు గంగ, యమునా, గోదావరి, సరస్వతి, సింధు, నర్మదా నదుల పేరులు మనసులో స్మరించి స్నానము చేయాలి. ఏదయినా నదీ దగరలో ఉంటే ఆ నదిలో ప్రాతఃకాలములో స్నానము చేయవచ్చు. ఒకవేళ నదులు అందుబాటులో లేనివారు నూతివద్దగాని, చెరువువద్దగాని స్నానము చేయవచ్చు. కార్తీకమాసా వ్రతము చేసేవారు పగలు పురాణపఠనము శ్రవణము, హరికథ కాలక్షేపములతో కాలము గడిపేవారు. సాయంత్రం సంధ్యావందనములు ముగించుకొని పూజామందిరంలో శివకేశవులను పూజించాలి. కార్తీక మాసములో తనశక్తిని భక్తి బ్రాహ్మణసమారాధన చేయాలి. ఈ కార్తీకమాసం నెల రోజులు బ్రాహ్మణ సమారాధన శివకేశవుల సన్నిధిని నిత్యదీపారాధన, తులసికోటవద్ద నిత్యదీపారాధన చేసిన వారికీ, వారి వంశస్థులు, పితృదేవతలకు మోక్షము కలుగుతుంది. ఈ వ్రతమును శాస్త్రోక్తముగా ఆచరించిన వారికీ, పురాణము చదివినను సకలైశ్వర్యములు కలిగి మోక్షప్రాప్తి కలుగును. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...