కన్యాదానఫలము
13వ అధ్యాయము
ఓ జనకమహారాజా! కార్తీకమాసములో ఆచరించవలసిన ధర్మాలు చాలఉన్నాయి.
కార్తీకమాసములో నదీస్నానము ముఖ్యమైనది. దానికంటే ఒక పేద బ్రాహ్మణ కుమారునికి ఉపనయనం చేయించుట ముఖ్యము. ఒకవేళ ఉపనయమునకు అగు ఖర్చులు భరించాలేనివారు మంత్రాక్షతలు, దక్షిణ తాంబూలాది సంభవనాలతో తృప్తి పరచునను ఫలము కలుగును. ఈ విధముగా ఒక పేద బ్రాహ్మణ బాలునికి ఉపనయనము చేసిన యెడల ఎంతటి మహాపాపములు అయినా నశిస్తాయి. అంతకన్నా ముఖ్యమైనది కన్యాదానము. కార్తీక మాసమందు భక్తిశ్రద్ధలతో కన్యాదానము చేసిన తాను తరించుటమే కాక తన పితృదేవతలు కూడా తరింపజేసినవారవుతారు. ఇందుకు ఒక ఇతిహాసము ఉన్నది.
సువీర చరిత్రము
ద్వాపరయుగములో వంగదేశములో గొసువీర చరిత్రము ప్ప పరాక్రమవంతుడు, సురుడు అయినా సువిరుడు అను ఒక రాజు ఉండేవాడు. అతనికి రూపవతి అను భార్య ఉన్నది. ఒకసారి సువీరుడు శత్రురాజులచే ఓడించబడినవాడయి, భార్యతో అరణ్యమునకు పారిపోయి ధనహీనుడయి నర్మదా నదీతీరమున ఒక పర్ణశాలను నిర్మించుకొని కందమూల ఫలాదులను భుజిస్తూ కాలము గడుపుతున్నారు. కొన్ని రోజులకు వారికీ ఒక బాలిక జన్మించింది. ఆ బిడ్డను అతి గారాబముతో పెంచారు. కొంతకాలానికి ఆమెకు వివాహ వయస్సు వచ్చింది. ఒకరోజు వానప్రస్థుని కుమారుడు ఆమెను వివాహం చేసుకోవాలని ఆ రాజుని కోరతాడు. అందుకు ఆ రాజు "ఓ మునిపుత్ర! ప్రస్తుతము మేము బీదస్థితిలోఉన్నాము. అష్టదరిద్రములు అనుభవిస్తున్నాము. మా కష్టములు పోవటానికి కొంతధనము ఇచ్చిన నా కుమార్తెను ఇచ్చి వివాహం చేస్తాను" అని చెప్పాడు. ఆ ముని కుమారుని దగ్గర ధనము లేకపోయేసరికి నర్మదా తీరమున కుబేరుని గురించి ఘోర తపస్సు ఆచరించి కుబేరుని మెప్పించి సంపాదించారు. రాజు ఆ పాత్రను తీసుకొని సంతోషించి తన కుమార్తెను ఇచ్చి వివాహం చేసి నవ దంపతులను అత్తవారింటికి పంపించారు.
ముని కుమారుడు భార్యను వెంటబెట్టుకొని వెళ్లి తల్లిదండ్రులకు నమస్కరించి అంతవరకు జరిగినదంతా చెప్పి తన భార్యతో సుఖంగా జీవిస్తున్నారు. వీరుడు మన కుమార్ రెడ్డి జన తన పాత్రను తీసుకుని స్వేచ్ఛగా ఖర్చు పెడుతూ భార్యతో సుఖముగా జీవించారు. అలా కొంతకాలం జరిగిన తర్వాత ఆ రాజు భార్య మరొక బాలికకు జన్మనిచ్చింది. నా బిడ్డకు కూడా యుక్త వయస్సు రాగానే మళ్ళీ ధనానికి అమ్మాలని ఎదురుచూస్తున్నారు.
ఒకరోజు ఒక సాధు పుంగవుడు తపతీ నది తీరం నుండి నర్మదా నది తీరాన స్నానార్ధమై వచ్చి దారిలో ఉన్న సువీరుడిని కలుసుకొని "నువ్వు ఎవరు? నీ మొఖవర్చస్సు చూస్తే రాజు అంశమున జన్మించినవాడై ఉన్నావు. నువ్వు ఈ అరణ్యంలో ఏం చేస్తున్నావు?" అని ప్రశ్నించగా, సువీరుడు "మహానుభావా! నేను వంగదేశంను ఏలు సువీరుడు అను రాజును. నా రాజ్యమును శత్రురాజులు ఆక్రమించుటవలన భార్యాసమేతముగా ఈ అరణ్యములో జీవిస్తున్నాను. నాకు ఇద్దరు కుమార్తెలు. మొదటికుమార్తెను ఒక మునికుమారునికిఛ్చి వానివద్ద కొంత ధనమును తీసుకొని వారికీ వివాహం చేశాను. ఇప్పటివరకు ఆ ధనముతోనే కాలక్షేపము చేస్తున్నాను" అని చెప్పాడు. అందుకు ఆ మునిపుంగవుడు "ఓ రాజా! నీవు ఎంత దరిద్రుడైన ధర్మసూక్ష్మములు ఆలోచించకుండా కన్యను అముకొన్నావా. కన్య అమ్ముకుంటూ మహాపాపం. కన్యను అమ్మినవారు "అసిపత్రవన" అను నారకము అనుభవిస్తారు. ఆ ధనముతో దేవునికి గాని పితృదేవతలకు గాని వ్రతము చేసిన వారు నశిస్తారు. కన్యను అమ్మినవారికి పితృదేవతలు పుత్రసంతతి లేకుండా శపిస్తారు. కన్యను కొన్న వారికి కూడ గృహస్థ ధర్మాలు వ్యర్ధము అయి నరకము అనుభవిస్తారు. కనుక రాబోయే కార్తీకమాసంలో నీ రెండవ కుమార్తెను నీ శక్తి కొలదీ బంగారు ఆభరణములతో అలంకరించి ధర్మబుద్ధి కలవానికి సదాచార సంపన్న కన్యను దానం చేయి. అలా చేస్తే గంగాస్నానం చేసినంత ఫలము అశ్వమేధయాగం చేసినంత ఫలము పొందుతావు. మొదటి కన్యను అమ్మిన పాపము పోతుంది" అన్ని రాజకీయ హితబోధ చేశారు. అందుకు రాజు చిరునవ్వు నవ్వి "ఓ మునివర్యా! దేహ సుఖము వాళ్ళకంటే దానధర్మాలు వలన వచ్చిన ఫలములు ఎక్కువ? తాను బ్రతికిఉండగా భార్యాపిల్లలతో దాన ధర్మాలతో సిరిసంపదలతో తను సుఖంగా ఉండక చనిపోయిన తర్వాత వచ్చే మోక్షము కొరకు ప్రస్తుతం అవకాశం జారవిడుచుకుంటారా? ధనము బంగారము కలవారు ప్రస్తుతం ఈ లోకంలో రాణించగలరు గుర్తింపును పొందగలరు. నా రెండవ కుమార్తెను కూడా నేను అడిగిన అంత ధనం ఇచ్చిన వారికి వివాహం చేస్తాను కానీ నేను మాత్రం కన్యను దానం చేయను" అని నిక్కచ్చిగా చెప్పేను. ఆ మాటలకు సన్యాసి ఆశ్చర్యపడి తన దారిన తాను వెళ్ళిపోయాడు.
కొన్ని రోజులకు సువీరుడు మరణించాడు. వెంటనే యమభటులు వచ్చి వానిని తీసుకుపోయి యమలోకంలో అసిపత్రవనమును నరక భాగమున పడవేశారు. అక్కడ అనేక రకాలుగా నరక బాధలు అనుభవస్తునాడు. సువురుడి పూర్వికులు అయిన శ్రుతకీర్తి అని రాజు ధర్మమును ఆచరిస్తూ ప్రజలను పాలించి ధర్మాత్ముడైన మరణించిన తరువాత స్వర్గములో సర్వ సుఖాలు అనుభవిస్తున్నారు. సువీరుడు చేసిన కన్య విక్రయం వలన శ్రుతకీర్తి నీక్కూడా బంధించి యమకింకరులు స్వర్గం నుంచి నరకానికి తీసుకువచ్చారు.
అప్పుడు శృతకీర్తి యమధర్మరాజుకి నమస్కరించి "ప్రభు! మీరు సర్వజ్ఞుడవు, ధర్మమూర్తివి, బుద్ధిశాలివి, ప్రాణులను సమానంగా చూస్తున్నావు. నేను ఏ పాపం చేయలేదు. నన్ను స్వర్గలోకము నుండి నరకానికి ఎందుకు తీసుకు వచ్చారు. కారణం చెప్పండి స్వామి" అని ప్రదించాడు. యమధర్మరాజు శృతకీర్తి తో "రాజా! నువ్వు న్యాయమూర్తవి, ధర్మాత్ముడివి. నీవు ఎటువంటి పాపములు చేయలేదు. నీ వంశమున సువీరుడు అను రాజు తన మొదటి కుమార్తెను ధనముపై ఆశతో అముకొన్నాడు.కన్యను అమ్ముకొనా వారి పూర్వికులు ఇటు మూడు తారలు అటు మూడు తారలు వారు ఎంత పుణ్యపురుషులు అయినా నరకమున బాధలు అనుభవిస్తారు. నువ్వు ధర్మమూర్తి కనుక నీకు నేను ఒక ఉపాయం చెప్తాను. నీ వంశమున సువీరుడికి ఇంకొక కుమార్తె ఉన్నది. ఆమె నర్మదా నది తీరంలో తన తల్లి వద్ద పెరుగుతుంది. నా ఆశీర్వాదంతో నువ్వు మానవ శరీరం ధరించి ఆమె తల్లి వద్దకు వెళ్లి ఆ కన్యను వేద పండితుడు శీలవంతుడైన ఒక బ్రాహ్మణునకు కార్తీకమాసమున సాలంకృత కన్యాదానం చేయించు. అలా చేస్తే నువ్వు నీ పూర్వికులు సువీరుడు కూడా స్వర్గలోకానికి వెళ్తారు. కార్తీక మాసంలో సాలంకృత కన్యాదానం చేసినవారు మహా పుణ్యాత్ములు అవుతారు. నువ్వు వెంటనే భూలోకానికి వెళ్ళి నేను చెప్పిన విధంగానే ధర్మకార్యములు చేశారా" అని పలికాడు.
శృతకీర్తి యమధర్మ రాజుకు నమస్కరించి సెలవు తీసుకుని నర్మదా నది తీరం అన్నపూర్ణ కుటీరంలో నివసిస్తున్న సువీరుని భార్యను కుమార్తెను చూసి సంతోషపడి అతను వచ్చిన విషయం చెప్పి కార్తీక మాసంలో సువీరుని రెండవ కుమార్తెను చతుర్వేదాలు చదివిన ఒక బ్రాహ్మణ యువకునికి కన్యాదానము చేసారు. అలా కన్యాదానం చేయటం వలన సువీరుడు కూడా పాపము పోయి స్వర్గమునకు వెళ్ళాడు.
కన్యాదానం వలన మహా పాపములు పోతాయి. వివాహ విషయంలో వారికి మాట సాయం చేసిన పుణ్యం కలుగుతుంది. కార్తీకమాసంలో కన్యాదానము చేయాలని దీక్షగా పెట్టుకొని ఆచరించే వారు విష్ణు సాన్నిధ్యం పొందుతారు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి