కార్తీక పురాణము 2వ రోజు

సోమవార వ్రత మహిమ 

            జనకమహారాజా! ఇప్పటివరకు నీకు కార్తీకమాసంలో ఆచారించవలసిన విధివిధానాలను తెలియజేశాను. ఇపుడు కార్తీక సోమవార వ్రతము ప్రాముఖ్యాన్ని తెలియజేస్తాను.  

     కార్తీక మాసములో సోమవారం శివునికి అత్యంత ప్రీతికరమైన రోజు.  ఆ రోజున స్త్రీ, పురుష భేదము లేకుండా ఆ రోజు అంత ఉపవాసం వుండి శక్తికొద్దీ దానధర్మాలు చేసి నిష్టతో శివునికి బిల్వపత్రాలతో పూజ అభిషేకం చేసి సాయంత్రం నక్షత్ర దర్శనం చేసి తరువాత భోజనము చేయాలి.  ఆ రాత్రు అంతా జగరాన చేసి పురాణపఠనము చేసి తెల్లవారిన తరువాత నదికి వెళ్లి స్నానం చేసి,  తిలాదానం,  తమశక్తి కొలది పేదలకు అన్నధానమును చేయాలి. కార్తీక మాసములో నిష్ఠతో సోమవార వ్రతము చేసిన వారికీ శివుని అనుగ్రహముతో కైలాసప్రాప్తి, విష్ణు పూజ చేసిన వారికి వైకుంఠ ప్రాప్తి లభిస్తుంది. జనకమహారాజా దీనికి ఉదాహరణగా ఒక కధ ఉంది. శ్రద్ధగా విను.

కార్తీక సోమవార ఫలముచే కుక్కకు కైలాసప్రాప్తి 

          పూర్వకాలములో కాశ్మీర దేశములో ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు. అతను పురోహిత వృత్తిని చేపట్టి తన కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అతనికి చాలాకాలానికి ఒక కుమార్తె జన్మించింది. ఆమె పేరు స్వాతంత్ర్య నిష్ఠురి. ఆమెకి వివాహ సమయం వచ్చిన తరువాత ఆమె తండ్రి ఆమెను సౌరాష్ట దేశములో ఉన్న మిత్రశర్మ అను 

         బ్రాహ్మణునికి ఇచ్చి వివాహం చేసారు. ఆ బ్రాహ్మణుడు నాలుగువేదాలు, సకల శాస్త్రాలు అభ్యసించాడు. అతను సదాచారుడు. భూతదయ కలిగినవాడు సత్యవాది. నిరంతరము భగవమమస్మరణం చేస్తాడు. అతనిని అందరూ అపరబ్రహ్మ అని పిలిచేవారు. ఇటువంటి ఉత్తమ పురుషునికి భార్య ఆయినా నిష్ఠురి యవ్వన గర్వముతో, కన్నుమినుగానక పెద్దలను ధూషించుచు, అత్తమామలను, భర్తను తిడుతూ కొడుతూ, వ్యభిచారిణి అయి తన వంశమునకు అప్రతిష్ట తెచ్చింది. అత్త మామలు తమ ఇంటినుండి వెళ్లగొట్టారు. కానీ ఆమె భర్త ఆమెయందు ప్రేమ పోక అమె తోనే కాపురము చేసెను.  అంతగా ప్రేమిస్తున్న భర్తను దయ అనేది అనేది లేకుండా భర్త నిద్రపోతున్నపుడు అతనిని బండరాయి వేసి చంపేసింది. ఒక్కర్తే ఊరిబయట ఉన్న బావిలో శవాన్ని పడేసింది. ఇంకా తనకు తనకు ఇటువంటి అడం లేదుఅని విచాలవిడిగా తిరిగింది. తాను పాపకృత్యాలు చేస్తున్నదే కాకుండా ఇతర పడుచు కన్యలను, ఆడపడుచులను కూడా చేరదీసి వారిని కూడా దుర్బుధ్ధులు నేర్పి పాడుచేసి విటులకు తార్చి ధనార్జన కూడా చేసేది. ఆమె పనులను చూసి లోకులు ఆమెను రక్కసి అని పిలిచేవాళ్లు.

      మహారాజ! యవ్వన బింకము ఎంతో కలం ఉండదు కదా! కాలం తన సమాధానం సమాధానం చెప్పే రోజు వచ్చింది. క్రమక్రమముగా ఆమెలోని యవ్వనము నశించింది. కుష్టివ్యాధి వచ్చి ఓలంతా కురుపులతో నరకయాతన పడి మరణించింది. ఆమె చనిపోయిన వెంటనే భయంకరమైన యమా భటులు వచ్చి తీసుకొని వెళ్లి యమధర్మ రాజు ముందు హాజరు పరిచారు. యమధర్మరాజు, చిత్రగుప్తులవారు ఆమె పాపా చరిత్రను చూసి ఈ శిక్షలు విధించారు. విటులతో సుఖించినదుకు గాను ఈమెను ఎర్రగా కాల్చిన ఇనుప స్తంబానికి కటండి. భర్తను చంపినందుకుగాను ఇనుపగదలతో కొట్టారు. పతివ్రతలు వ్యభిచారిణిలుగా మార్చినందుకు సలసలకేగిన నూనెలో వేశారు. పెద్దలను దూషించినందుకు ఇనుప కడ్డీలు కాల్చి వాతలు పెట్టారు. చెవిలో సీసము పోశారు. ఆమె చేసిన పాపములకు ఇటు ఏడూ తారలు అటు ఏడూ తారలు నరక భాధలు పడుతున్నారు. 

        మహారాజ ఆమె కొంత కాలానికి కళింగ దేశములో కుక్క జన్మమెత్తి ఆకలిబాధ తట్టుకోలేక తిరుగుతుండెను. కర్రలతో కోటేవారు కొడుతూ, తీటేవారు తిడుతూ ఉండేవారి. ఒక బ్రాహ్మణుడు కార్తీక సోమవార వ్రతము ఆచరించి ఉపవాసం ఉండి నక్షత్ర దర్శనం చేసినతరువాత బలిఅన్నము అరుగుపై పేటి కాలు చేతులు కడుకొనుటకు లోపలికి వేలాడు. అదే సమయంలో ఆకలి బాధతో తిరుగుతున్న కుక్క ఆ బలి అన్నము తిన్నది. ఆ బ్రాహ్మణుడు నిష్ఠతో వ్రతము చేసి వండిన అన్నము వలన ఆ కుక్కకు పూర్వ జన్మ జ్ఞానము వచ్చింది. వెంటనే ఆ కుక్క బ్రహ్మణోత్తమా నన్ను రక్షించు రక్షించు అని అరిచింది. ఆ అరుపులకు బయటకు వచ్చిన బ్రాహ్మణుడు అక్కడ కుక్క మాత్రమే ఉండటం చూసి మళ్ళి లోపలి వేలాడు. మళ్ళి రక్షిచమని అరుపులు వినిపించాయి. బ్రాహ్మణుడు బయటకు వచ్చి నువ్వు ఎవరు అని ప్రశ్నించెను. అపుడు కుక్క తన వృతాంతం మొత్తం చేపి తనని రక్షించమని వేడుకుంది. నేను ఏమిచేయగలను అని అడిగాడు. అందుకు కుక్క స్వామి మీరు నిష్ఠతోచేసిన ఒక కార్తీక సోమవార వ్రతఫలితమును నాకు దానంచేసి నాకు ఈ భాధలనుంచి విముక్తి ఇపించాడు అని వేడుకుంది. బ్రహ్మణోత్తముడు అలాగే ఒక కార్తీక సోమవార వ్రతము ఫలితాన్ని ఆ కుక్కకు ధనము చేసెను.  అందరూ చూస్తుండగా ఒక దివ్య విమానంవచింది. ఆమె అందరికి నమస్కరించి శివ సాన్నిధ్యం చేరుకుంది.

      వినవుకదా జనక మహారాజ! నీవు కూడా కార్తీక మాసా వ్రతమును ఆచరించి శివ సాన్నిధ్యం పొందు అని వశిష్ఠుడు హితబోధ చేసెను.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...