కార్తీక పురాణము 5వ రోజు

వనభోజన మహిమ 

5వ అధ్యాయము 

         జనక మహారాజ! కార్తీకమాసములో  పెద్ద ఉసిరికాయలతో నిండిఉన్న ఉసిరి చెట్టు కింద సాలగ్రామమును పూజించి, విష్ణుమూర్తిని ధ్యానించి, శ్రీమధ్భగవద్గితా పారాయణము చేయాలి.  అందులో ఒక శ్లోకం అయినా కంఠస్తం చేసిన విష్ణుసాన్నిధ్యం పొందుతారు. ఉసిరి చెట్టునీడనే బ్రాహ్మణులకు భోజనం పెట్టి వారికీ దక్షిణతాంబులాలతో సత్కరించి నమస్కరించవలెను.  తరువాత ఉసిరి చెట్టునీడలో అందరు భోజనము చేయాలి.  

         వేలునిబట్టి ఉసిరిచెట్టుకింద పురాణ పారాయణము చేయాలి. ఈ విధముగా పురాణము విన ప్రమాణపుత్రునకు మూషిక జన్మము నుంచి విముక్తి లభించినది. అది విన జనకమహారాజు "మునివర్యా! ఈ బ్రాహ్మణ యువకుడిని మూషిక జన్మము ఎలావచ్చింది. దానికి కారణం ఏమిటి? అని అడిగారు. వశిష్ఠులవారు ఈ విధిముగా చెప్పసాగారు.

కిరాతగాకుడు, మూషికములు జ్ఞానము కలుగుట 

         రాజా! కావేరి నది తీరామున చిన్న గ్రామములో దేశశర్మయను బ్రాహ్మణుడు ఉన్నాడు. అతనికి ఒక కుమారుడు ఉన్నాడు. అతని పేరు శివశర్మ. శివశర్మ చిన్న తనము తనము నుంచి భయభక్తులు లేక అతిగారాబముగా పెరుగుటవలన చెడు సావాసములు సావాసములు చేసి దురాచారపరుడైనాడు. అతని ప్రవర్తన చూసి అతని తండ్రి చాల బాధపడేవాడు. ఒకరోజు తండ్రి తన కొడుకుని పిలిచి "శివశర్మ!నీప్రవర్తన అసలుబాగోలేదు. నీగురించి అందరూ నన్ను నిలదీస్తున్నారు. అందుకే నీవు కార్తీక మాసములో నది స్నానము చేసి శివకేశవులను ఆరాధించు సాయంకాల సమయంలో దేవాలయంలో దీపారాధన చేస్తే, నీవు చేసినపాపములు పోయి నీకు మోక్షప్రాప్తి కలుగుతుంది" నేను చేపినటు చేయి అని చెప్పారు. దానికి అతని కుమారుడు "నాన్న! స్నానము చేయుట చేయుట వలన ఒంటి మురికి మాత్రమే పోతుంది.స్నానము చేసి పూజలుచేసినంత మాత్రము చేత భగవంతుడు కనిపిస్తాడా! దేవాలయములో దీపాలు వెలిగిస్తే లాభం ఏమి ఉంటుంది వాటిని ఇంటిలో వెలిగిస్తే మంచిదికాద" అన్నాడు. కుమారుడిని సమాధానం విని అతని తండ్రి "ఓరి మందబుద్ధి! కార్తీక మాసా ఫలితమును చులకనగా చుస్తున్నావుకదా, నీవు అడవిలో రావిచెట్టు తొర్రలో ఎలుకవై బ్రతుకుతావు" అన్ని శపించాడు. ఆ శాపముతో కుమారుడికి జ్ఞానోదయం అయి "నాన్న! నన్ను క్షమించు. దైవాన్ని దైవకార్యములను చులకన చేశాను. ఇప్పుడు నాకు పశ్చాత్తాపము పశ్చాత్తాపము కలిగినది. నామీద దయవుంచి నాకు శాపవిమోచనం ఎపుడు కలుగుతుందో చెప్పండి" అన్ని ప్రాధేయపడదు. అందుకు అతని తండ్రి "శివశర్మ! నా శాపము అనుభవించుచు ఎలుకగా ఉండగా నీవు ఎపుడు ఎప్పుడు అయితే కార్తీక మాస మహత్యం వింటావో అపుడు నీకు శాపవిమోచనం కలుగుతుంది. వెంటనే శివశర్మ ఎలుక రూపము ధరించి కావేరినది తీరమున అడవిలో రావిచెట్టు తీరంలో నివసిస్తున్నాడు. 

       కొంత కాలానికి కావేరినది తీరమున విశ్వమిత్ర మహర్షి తన శిష్యసమేతంగా అక్కడికి వచ్చారు. మూషికమున్న వృక్షం దగరకు వచ్చి ఆగారు. అక్కడ ఒక కిరాతకుడు వీరి దగర ఏమైనా ఉంటె దోగిలించాలి అన్ని ఆ చెట్టు దగరకు వచ్చి వారి తేజస్సుని చూసి ఆ కిరాతకుని మనస్సు మారి వారి దగరకు వెళ్లి "స్వామి తమరు ఎవరు మిమ్మలిని చూసినంత మాత్రమే నా మనస్సు ఆనందముతో తేలియాడుతుంది. అప్పుడే చెట్టు తొర్రలో ఉన్న మూషికము కూడా తిను బండారాలకోసం అక్కడకు అక్కడకు వచ్చి దాకుంది. కిరాతకుని మాటలు విన్న విశ్వమిత్రులవారు " ఓ కిరాతక! మేము కావేరి నది స్నానార్ధమై ఎక్కడకు వచ్చాము. కార్తీక స్నానము ఆచరించి కార్తీక పురాణము పాటిస్తునావు. నీవు ఇక్కడ కూర్చొని విను".అని చెప్పారు. కారతకుడికి కార్తీక పురాణ మహత్యం వలన అతనికి పూర్వజన్మ జ్ఞానము కలిగి అతనిలో పరివర్తన కలిగి ఇకనుంచి దొంగతనము చేయనని మంచిగా కార్తీక మాసా వ్రతమును ఆచరిస్తాను అని వారికీ నమస్కరించి తన ఉరికి వెళ్లిపోతాడు.  

         చెట్టు మొదలులో దాగిఉన్న మూషకమునకు కూడా శాపవిమోచనం కలిగి బ్రాహ్మణా రూపము వచ్చి "మునివర్యా! ధన్యోస్మి. తమ దయవల్ల నేను కూడా ఈ మూషిక రూపము నుంచి విముక్తుడినైనను"అని తన వృత్తంతం చెప్పి మహర్షికి నమస్కరించి వెళిపోయాడు. 

       కనుక ఓ జనకమహారాజా!ఇహములో సిరిసంపదలు, పర లోకమున మోక్షము కోరువారు తప్పక ఈ కార్తీక పురాణమును చదివి, ఇతరులకు వినిపించాలి.



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...