కార్తీక పౌర్ణమి

                

                ఈ కార్తీక పౌర్ణిమికి త్రిపుర పౌర్ణమి అని పేరు కూడా ఉంది. పూర్వం తరకాసురుడికి ముగ్గురు కుమారులు ఉండేవారు.  తారకాసుర సంహారం తరువాత అతని ముగ్గురు కుమారులు బ్రహ్మ కోసం తపస్సు చేస్తారు. వారి తపస్సుకి మెచ్చి బ్రహ్మ ప్రత్యక్షమై మీకు ఏమి వరం కావాలి అంటారు.  అందుకు ఆ ముగ్గురు మాకు మరణం లేకుండా వరం కావాలి అంటారు.  అందుకు బ్రహ్మదేవుడు ఇది సాధ్యం కాదు.  ఇంకా వేరే వరం ఏదయినా కోరుకోండి అంటారు. అందుకు వారు అయితే మాకు ఒకొకరికి ఓకో ఎగిరే నగరామును ప్రసాదించిండి అవి కేవలం 1000సంవత్సరాలకు ఒకసారి మాత్రమే రావాలి. మామాలిని చంపాలియాంటే రథంకాని రథంలో, విల్లుకాని విల్లుతో,అల్లు కానీ అల్లుతో,  బాణం కానీ బాణంతో మేము ముగ్గురము ఒకే సరళ రేఖపైన వచ్చినపుడు మాత్రమే మా ముగ్గురిని ఒకే బాణంతో చంపాలి. అందుకు బ్రహ్మ ఆ వరం ఇచ్చి అదృశ్యం అయిపోతారు. 

                 ఆ వర గర్వంతో మూడు లోకాలను ఆక్రమించి ఒకోకరు ఒకో లోకాని పాలిస్తూ అక్కడి లోకవాసులను నరక యాతనలు పెడుతూ ఎగిరే నగరాలలో సంచరిస్తున్నారు. వారు పెట్టే బాధలను తట్టుకోలేక వివిధ లోక వాసులు బ్రహ్మదేవుని వద్దకు వచ్చి మొరపెట్టున్నారు. అందుకు బ్రహ్మదేవుడు నా వరాలను నేను వెనక్కి తీసుకోలేను. మనం వెళ్లి విష్ణుమూర్తిని శరణు విడుదాము. అందరూ విష్ణుమూర్తి దగ్గరకు వెళతారు.  అప్పుడు విష్ణుమూర్తి ఆ ముగ్గురు అసురుల సంహారం శివకేశవుల వల్లనే జరుగుతుంది. మనం శివుని వద్దకు వెళదాము. అందరూ శివుని దగ్గరకు వెళతారు. శివునికి విషయం మొత్తం చేపి ఆ ముగ్గురు అసురుల సంహారం జరగటానికి సమయం వచ్చింది. రథంకాని రధం కోసం భూమి రధం అవుతుంది. విల్లు కానీ విల్లు కోసం మేరుపర్వతం విల్లు అవుతుంది. అల్లు కానీ అల్లు కోసం ఆదిశేషుడు అల్లు అవుతాడు. శివుడు యుద్ధనికి బయలుదేరుతారు. శివుడు ఆ ముగ్గురు అసురులతో యుద్ధం చేస్తుండగా విష్ణుమూర్తి సమయం కోసం ఎదురుచూస్తున్నారు. ఎలా కొంతకాలం కాగా అసురులు ముగ్గురు ఒకే సరళరేఖపైన రాగానే విష్ణుమూర్తి బాణం కానీ బాణం కోసం విష్ణుమూర్తి బాణం అయి శివుని చేతిలోకి వెళతారు. శివుడు వెంటనే ఆ బాణాన్ని వదిలి ఆ అసురుల సంహారం చేస్తారు. ఈ విధంగా శివకేశవుల చేతిలో ఆ అసురుల సంహారం జరుగుతుంది. ఆ రోజు కార్తీక పౌర్ణమి పౌర్ణమి అవటం చేత ఆ రోజుని త్రిపుర పూర్ణిమ అని పేరు వచ్చింది.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...