కార్తీక పురాణము 8వ రోజు

శ్రీహరినామస్మరణ సర్వఫలప్రదము

8వ అధ్యాయము



వసిష్ఠుడు చేపినదంతా విని "మహానుభావా! తమరు చెప్పిన ధర్మములన్నింటినీ శ్రద్ధగా విన్నాను.  అందు ధర్మము బహు సూక్ష్మమైనది అని పుణ్యము సులభంగా కలుగుతుంది అని, అది నాదీ స్నానము, దీపదానము, ఫలదానము, అన్నదానము, వస్త్రధానము వలన కలుగుతుంది అని చెప్పారు. ఇటువంటి స్వల్పధర్మాల వల్లనే మోక్షం కలిగితే వేదముల పఠనము, యజ్ఞయాగాదులు చేసినగాని పాపములు పోవని మీవంటి మునిశ్రేష్టులే చెప్పుతున్నారు కదా! మరి తమరు ఇది సూక్ష్మములో మోక్షముగా కనబరచినందులకు నాకు ఆశ్చర్యము కలుగుతుంది. దుర్మార్గులు కొందరు సదాచారములు పాటించక, వర్ణసంకరులై రౌరవాది నరకహేతువులగు మహాపాపములను చేయువారు ఇంత తేలికగా మోక్షం పొందుట వజ్రపు కొండను గోటితో పెకలించుట వంటిది.  కావున దీని మర్మమును విడమర్చి చెప్పండి అని ప్రార్ధిస్తున్నాను.

            అప్పుడు విశిష్టులవారు చిరునవ్వు నవ్వి "ఓ జనకమహారాజా! నీవు వేసిన ప్రశ్న సహేతుకమైనదే, నేను వేదవేదాంగాలు కూడా పటించాను.వాటిలో కూడా సూక్ష్మమార్గాలున్నాయి. అవి ఏమిటంటే సాత్త్విక, రాజస,తామసములు అను మూడు రకాలధర్మాలు ఉన్నాయి.

          సాత్త్వికం అనగా దేశకాల పరిస్థితులు మూడు సమకూడిన సమయమున సత్త్వక గుణము జన్మించి ఫలితమంతా పరమేశ్వరార్పణం అనుకోని మనోవాక్కాయ కర్మలచే ఆచరించే ధర్మము.  ఈ ధర్మము అత్యంత ప్రాముఖ్యము కలిగినది. సాత్త్విక ధర్మము సమస్త పాపములను నశించేలాచేసి మానవులను పవిత్రులను చేసి దేవలోక, భూలోక సుఖములు చేకూరుస్తుంది. ఉదాహరణకు తామ్రపర్ణానది సముద్రములో కలినటే, స్వాతికార్తెలో ముత్యపు చిప్పలో చిప్పలో వర్షబిందువు పడి ధగధగ మెరిసి, ముత్యముగా మరీనా విధముగా సాత్వికత విహించి సాత్త్వికధర్మం ఆచరిస్తే గంగ, యమునా, గోదావరి, కృష్ణ నదులు పుష్కరాలు మొదలగు పుణ్యకాలముల యందు దేవాలయములయందు వేదములు పఠించి, సదాచారుడై, కుటుంబికుడైన బ్రాహ్మణునకు యంత స్వల్పదానము చేసిన, లేక ఆ నదీతీరాలలోని దేవాలయాలలో జపము, తపస్సు చేసిన విశేషఫలితము పొందుతారు. 

             రాజస ధర్మము అనగా ఫలాపేక్ష కలిగి శాస్త్రోక్తవిధులను విడిచి చేసిన ధర్మము. ఈ ధర్మము పునర్జన్మానికి కారణమై కష్టసుఖాలను కలిగిస్తుంది.

            తామస ధర్మము అనగా  శాస్త్రపరంగా విధులను విడిచి డాంబికాచరణార్ధము చేయు ధర్మము. ఆ ధర్మము ఫలితము ఇవ్వదు. 

         దేశకాల పరిస్థితులు సమకూడినపుడు తెలిసి కానీ తెలియక కానీ ఏ స్వల్పధర్మమును చేసిన గొప్ప ఫలితము వస్తుంది.  అనగా పెద్ద కట్టెల గుట్ట చిన్న అగ్నికణములతో భస్మమగునట్లు శ్రీమన్నారాయణుని నామము, తెలిసికాని, తెలియకగాని స్మరించిన వారి సకల పాపములు పోయి ముక్తిని పొందుతారు. దానికి ఒక ఇతిహాసము ఉంది విను మహారాజ. 

 అజామీళుని కథ 

           పూర్వకాలమున కన్యాకుబ్జమను నగరములో నాలుగువేదాలు చదివిన ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు. అతని పేరు సత్యవ్రతుడు.  అతనికి సకల సద్గుణరాశియగు హేమావతి అను భార్య కలదు. వారు అన్యోన్యదాంపతులు. వారికీ చాలాకాలానికి ఒక కుమారుడు జన్మించాడు. అతని పేరు అజామిళుడు. అతనిని వారు అతిగారాబముగా పెంచారు. ఆ బాలుడు పెరుగుతున్న కొద్దీ  అతిగారాబము వలన పెద్దలను కూడా కూడా నిర్లక్షంగా చూస్తూ, దుష్టసహవాసము వలన విద్యను అభ్యాసము చేయకుండా,బ్రాహ్మణధర్మాలు పాటించకుండా సంచరింస్తునాడు. కొంతకాలానికి యవ్వనంలోకి అడుగుపెట్టగానే కామాంధుడై వావివరసలు మరచి తిరుగుతూ మద్యమాంసాలు సేవిస్తూ ఉండెను. ఒక ఎరుకలజాతికి చెందిన స్త్రీని వివాహము చేసుకొని ఆమె ఇంటివద్దనే ఉంటూ తల్లితండ్రులను పాటించుకోకుండా ఉన్నాడు.  పిల్లలను అతిగారాబముగా పెంచటం వలన కలిగిన ఫలితము చూసావా రాజా! పిల్లలమీద ఎంత ప్రేమ ఉన్న వారిని అదుపుఆజ్ఞలలో పెంచాకపోతే ఇలాంటి పరిణామాలే వస్తాయి. అజామిళుడు కులభ్రష్టుడు అయి, Kఅతని బంధువులు విడిచిపెట్టారు. అందుకు అజామిళుడు రెచ్చిపోయి వేటవలన పక్షులు, జంతువులను చంపి, వాటిని తిని కిరాతక వృత్తిలో జీవిస్తున్నాడు. ఒక రోజు ఆ ఇద్దరు వేటకు వెల్లారు. ఆ స్త్రీ తేనె పటునుండి తేనె తీయటానికి చెట్టుకొమ్మ ఎక్కి కొమ్మ విరిగి కింద పడి చనిపోయింది. అజామిళుడు ఆ స్త్రీపై పడి కొంతసేపు ఏడ్చి ఆమెను ఆ అడవిలోనే దహనం చేసి ఇంటికి వచ్చాడు. వారికీ ఒక కూతురు ఉన్నది. కొంతకాలానికి ఆ బాలికకు యుక్తవయస్సు రాగానే వావివరుసలు మరచి అజామిళుడు ఆమెను వివాహం చేసుకున్నాడు. వారికీ ఇద్దరు మొగపిల్లలు పుట్టి చనిపోయారు. కొంతకాలానికి వారికీ ఒక కుమారుడు జన్మించాడు. అతనికి నారాయణ అని పేరు పెట్టి అతి గారాబముగా పెంచుతున్నాడు. అతనిని క్షణం అయినా విడిచి పెట్టకుండా 'నారాయణ నారాయణ' అని అతని వెంట తిరిగేవాడు. కొంతా కాలానికి అజామిళుడు శరీరపటుత్వం తగ్గి రోగం వచ్చి మంచాన పాడాడు. మరణించు సమయంలో భయంకర ఆకారములో యమభటులు కనిపించగానే అజామిళుడు భయంతో కుమారుడిపై ప్రేమతో 'నారాయణ నారాయణ' అంటూ ప్రాణము విడిచాడు. నారాయణ అను శబ్దం వినగానే యమభటులు గజగజ వినికిపోయారు. అదేవేలకు వేలకు దివ్యమంగళ కారులు, శంఖ చక్ర గదాధారులు అయినా శ్రీమన్నారాయుని దూతలు విమానంలో అక్కడికి వచ్చి  "ఓ యమభటులరా! వీడు మావాడు. మేము వీనిని వైకుంఠమునకు తీసుకువెళతాము" అని చేపి అజామీళుడిని విమానం ఏక్కించి తీసుకొని వెళుతుండగా యమదూతలు "అయ్యా!తమరు ఏవరు? వీడు అతి దుర్మార్గుడు. వీడిని నరకమునకు తీసుకొని పోవుటకు మేము ఇక్కడికి వచ్చాము. అతనిని మాకు అప్పగించండి" అని కోరగా విష్ణుదూతలు ఇలా చెప్పసాగారు.......... 

         ఇంకాఉంది................... 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...