కార్తీక పురాణము 16వ రోజు

దీప స్థంభం ప్రశంస 


ఓ జనకమహారాజా! కార్తీకమాసం దామోదరునికి అత్యంత ప్రీతికరమైన మాసం.  ఈ మాసంలో ధ్వజస్తంభమునందు ఆకాశదీపము ఉంచిన వారు వైకుంఠములో సకల భోగాలు అనుభవిస్తారు. కార్తీకమాసం అంత స్త్రీ పురుషులు ఆకాశ దీపముగాని, స్థంభ దీపము గాని ఉంచి నమస్కరించిన స్త్రీ పురుషులకు సకలైశ్వర్యములు కలిగి, వారి జీవితం ఆనందదాయకం అవుతుంది. దీప స్థంబ ప్రాముఖ్యం గురించి ఒక కథ ఉంది చెపుతాను విను.....

దీపస్తంభము మానవుడు అవటం.............. 

ఋషులలో అగ్రగణ్యుడు అయినా మతంగ మహాముని ఒకచోట ఆశ్రమాన్ని ఏర్పరుచుకొని, దానికి దగరలో ఒక విష్ణు మందిరాన్ని కూడా నిర్మించుకొని, నిత్యము పూజలు చేస్తుండేవారు. కార్తీక మాసంలో ఆ ఆశ్రమము చుటుపక్కల ఉన్న మునులు అందరూ స్వామిని పూజించేవారు. ఒకరోజు ఆశ్రమములో మతంగ మహర్షి  అక్కడ ఉన్న మునులతో "ఓ మునీశ్వరులారా! కార్తీకమాసంలో హరిహరుల ప్రీతి కోసం దీపస్థంబము నుంచి వైకుంఠ ప్రాప్తికలుగుతుందని మనందరికీ తెలిసిన విషయమే కదా! కార్తీక పౌర్ణమి కనుక మనం అడవికి వెళ్లి పెచ్చులు, పేళ్ళులులేని ఒక స్తంభాన్ని తీసుకువచ్చి దానిని విష్ణు మందిరము ముందు పాతి ఆవునేయితో దీపాన్ని వెలిగిద్దాము" అన్నారు. అందుకు మునీశ్వరులు సరే అని అడవికి వెళ్లి మునీశ్వరుడు చేపినవిధంగా ఒక స్తంభాన్ని తీసుకువచ్చారు. దానిని విష్ణుమూర్తి మందిరం ముందు పాతి ఆవునెయ్యితో ఒక దీపాన్ని వెలిగించి దానిని స్తంభము చివర ఆకాశం వైపు ఉంచి పురాణ పాటిస్తున్నారు. ఇంతలో ఆ దీపస్థంభం పెళపెళమని విరిగి అందులోనుంచి ఒక పురుషుడు బయటకు వచ్చాడు. అతనిని చుసిన మునులందరూ ఇలా అడిగారు. "నువ్వు ఎవరు? నువ్వు ఈ దీపస్థంబము నుంచి ఎలా వచ్చావు?" అని అడిగారు. అందుకు ఆ పురుషుడు " మునీశ్వరులారా! నా పేరు ధనలోభుడు. కిందటి జన్మలో ఒక బ్రాహ్మణజమిందారుని. ఐశ్వర్యవంతుడిని అనే గర్వముతో ఎవరిని లెక్కచేయక పాపకార్యములు చేసేవాడిని. న్యాయాన్యాయవిచక్షణ లేకుండా అందరిని దుర్భాషలాడుతూ ఆడవారిని, పిల్లలను హింసిస్తూ సాటి బ్రాహ్మణులను గౌరవించకుండా ఉండేవాడిని. నాకు దానధర్మాలు తెలియవు. మరణించిన తరువాత గోరనరకము అనుభవించి లక్ష జన్మలు కుక్కనై, పదివేల జన్మలు కాకినై, ఐదువేల జన్మలు తొండనై, ఐదువేలజన్మలు పెడపురుగునై, తరువాత వృక్షజన్మమెత్తి కీకారణ్యమునుండి కూడా నేను పాపములను పోగొట్టుకొనలేకపోయాను. ఇన్నాళ్లకు మీ దయవలన స్థంబముగా ఉన్న నేను మానవజన్మ ఎత్తాను. నాకు పూర్వజన్మ జ్ఞానము లభించింది. మునీశ్వరులారా నాకు ముక్తిని పొందే మార్గము ఏదయినా ఉంటె ప్రసాదించండి స్వామి" అని వేడుకున్నాడు. అందుకు ఆ మునీశ్వరులలో ఉన్న అగిరస మహర్షి ఇలా చెప్పసాగారు కార్తీక మహత్యం ఎంతగొప్పది అని చెప్పసాగారు........... 

 ఇంకా ఉంది................









1 కామెంట్‌:

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...