కార్తీక పురాణము 11వ రోజు

మంధరుడు - పురాణమహిమ

11వ అధ్యాయము


 

             ఓ జనక మహారాజా! ఈ కార్తీకమాసమందు విష్ణుమూర్తిని అవిసె పూలతో పూజించిన చాంద్రాయణ వ్రతము చేసినంత ఫలితం దక్కుతుంది.  కృష్ణ పూజ అయిన తర్వాత పురాణపఠనం చేసినా, చేయించినా, విన్నా, వినిపించినా అటువంటివారు తప్పనిసరిగా వైకుంఠమును పొందుతారు.  దీనిని గురించి ఒక ఇతిహాసము ఉన్నది శ్రద్ధగా ఆలకించు అని  వశిష్టుల వారు ఇలా చెప్పసాగారు. 

                పూర్వకాలములో కళింగ దేశమందు ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు.  అతని పేరు మంధరుడు.  అతడు ఇతరుల ఇండ్లలో వంటలు చేస్తూ అక్కడే భుజించేవాడు. మద్యం సేవించుట, దుష్టసాంగత్యం వలన స్నాన జప దీపారాధన ఆచారాలను పాటించడం మానేసి తిరిగేవాడు. అతని భార్య మహాసాధ్వి, గుణవంతురాలు, భర్త ఎంత దుర్మార్గుడైన  విసుగు చెందకుండా సకల ఉపచారాలు  చేసేది. పతివ్రతాధర్మాలను నిర్వర్తించేది. మంధరుడు ఇతరుల ఇళ్లల్లో వంటవాడిగా పని చేసిన ఇల్లు గడవక  చిన్న వర్తకం కూడా చేశాడు.  ఆఖరికి దాని వలన కూడా పోట్టగడవక దొంగతనాలు చేశాడు. దారి కాచి బాటసారులను బాధించి వారి వద్ద ఉన్న ధనమును వస్తువులను దొంగతనం చేసి జీవించేవాడు.  అడవి దారిన వెళ్తున్నా ఒక బ్రాహ్మణుడిని భయపెట్టి ధనమును దొంగతనం చేస్తూ ఉండగా అక్కడికి ఇంకొక కిరాతకుడు  వచ్చి ధనమును అపహరించి ఇద్దరిని చంపి వెళుతుండగా దగరలో దగరలో ఉన్న గుహనుండి సింహము బయటకు వచ్చి కిరాతకునిపై పడింది.  కిరాతకుడు దానినికూడా చంపాడు.  కానీ ఆ పులి కూడా తన పంజాతో కిరాతకుని కొట్టటంవల్ల అతనుకూడా చనిపోయాడు.  ఆ విధముగా ఒకే కాలములో నలుగురు చనిపోయారు.  ఆ నలుగురు కూడా యమలోకంలో అనేక శిక్షలు అనుభవిస్తున్నారు.  

        మంధరుడు చనిపోయిన దగ్గర నుంచి అతని భార్య నిత్యం హరినామస్మరణ చేస్తూ  సదా చారిని భర్తను తెలుసుకునేది చేస్తూ కాలం గడిపేస్తుంది.  కొన్నాళ్ళకు ఆమె ఇంటికి ఒక ఋషి పుంగవులు వచ్చారు.   ఆ ఋషిని గౌరవంగా ఆహ్వానించి అర్ఘపాద్యాదులచే పూజించి "స్వామి! నేను దీనురాలను,  నాకు భర్త గానీ, పిల్లలు గానీ లేరు.  నేను సదా హరినామస్మరణ చేస్తూ జీవిస్తున్నాను.  నాకు మోక్షమార్గము ప్రసాదించండి"  అని ప్రార్థించింది.  ఆమె వినయమునకు, ఆచారానికి ఆఋషి సంతసించి "అమ్మ! ఈ రోజు కార్తీక పౌర్ణమి. చాలా పవిత్రమైన రోజు. ఈ రోజుని వృధాగా పాడు చేసుకోవద్దు.  ఈ రాత్రి దేవాలయములో పురాణము చదువుతారు.  నేను నూనెను తీసుకు వస్తాను.  నీవు ప్రమిదను వత్తిని తీసుకుని రావాలి. దేవాలయంలో ఆ వత్తిని తెచ్చిన ఫలితము నీకు కలుగుతుంది. అని చేపి వెళ్లరు.  అందుకు ఆమె సంతోషించి వెంటనే దేవలయానికి వెళ్లి  శుభ్రం చేసి గోమయంతో అలికి ముగ్గులు పెట్టి తానే స్వయముగా వత్తిని చేసి రెండు వత్తులు వేసి ఋషి తెచ్చిన  నూనె ప్రమిదలలో పోసి దీపారాధన చేసింది.  తరువాత ఇంటికి వెళుతూ తనకు కనిపించిన వారికలా "ఈరోజు రాత్రి ఆలయంలో జాగరణ పురాణకాలక్షేపం జరుగుతుంది రండి" అని చెప్పింది.  ఆమె కూడా రాత్రి అంతా పురాణము విన్నది.  ఆ నాటి నుండి ఆమె విష్ణు చింతనతో కాలం గడుపుతూ కొంతకాలానికి మరణించింది.  ఆమె పుణ్యాత్మురాలు అవటం వలన విష్ణుదూతలు వచ్చి విమానమెక్కించి వైకుంఠమునకు తీసుకొని పోయారు.  కానీ ఆమెకు పాపాత్ముడైన భర్తతో సహవాసం వల్ల కొంచెం దోషం ఉండటం చేత మార్గమధ్యంలో యమలోకానికి   తీసుకొని పోయారు.  అక్కడ నరకములో ఆ ముగ్గురితో బాధపడుతున్న తన భర్తను చూసి "ఓ విష్ణు దూతలారా! నా భర్త ఆ ముగ్గురు నరక బాధలు పడుతున్నారు.  కనుక నాయందు దయ ఉంచి వాడని ఉదహరించండి" అని ప్రాధేయపడింది.  అందుకు విష్ణుదూతలు "అమ్మ! నీ భర్త బ్రాహ్మణుడే ఉండి కూడా స్నాన సంధ్యాదులు మాని పాపాత్ముడు అయ్యాడు.  రెండోవవాడు బ్రాహ్మణుడైన అతను కూడా తన ప్రాణ స్నేహితుడు చంపి ధనం అపహరించాడు.  మూడోవాడు సింహము.  నాలుగో వాడు పూర్వము ద్రావిడ దేశమున బ్రాహ్మణుడై జన్మించిన అనేక అత్యాచారాలు చేసి ద్వాదశి రోజున కూడా తైల లేపనము,  మద్యమాంసం సేవించి  పాపాత్ముడు అయ్యాడు.  అందుకే ఆ నలుగురు నరక బాధలు పడుతున్నారు"  అన్ని వారి చరిత్రలు చెప్పారు. అందుకు ఆమె విచారించి "ఓ  పుణ్యాత్ములారా!  నా భర్తతో పాటు మిగిలిన ముగ్గురిని కూడా ఉద్ధరించండి" అని ప్రార్థించగా,  అందుకు విష్ణుదూతలు "అమ్మ ! కార్తీక పౌర్ణమి రోజు నీవు చేసిన  వచ్చి ఫలితము సింహానికి,  ప్రమిద ఫలితము కిరాతకునికి, పురాణా ఫలితము బ్రాహ్మణులకు ధారపోసిన వారికీ మోక్షం కలుగుతుంది" అని చెప్పారు. ఆమె అలాగే ధారపోసింది. నలుగురు ఆమెతో విమానము ఎక్కి వైకుంఠానికి వెళ్లారు.  కనుక ఓ రాజా!  కార్తీక పురాణం వినటం వలన, దీపం వెలిగించడం వలన ఎటువంటి ఫలితం కలుగుతుంది విన్నావా? అని వశిష్ఠులవారు చెప్పారు. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...