కార్తీక పురాణము 12వ రోజు

                                              ద్వాదశీ ప్రశంస

12వ అధ్యాయము

               "మహారాజా! కార్తీకమాసమున కార్తీక సోమవారం, కార్తీక ద్వాదశి వ్రతము గురించి సాలగ్రామ మహిమల గురించి వివరిస్తాను విను"  వశిష్ట మహాముని ఈ విధంగా వివరిస్తున్నారు. 

               కార్తీక శుద్ధ ద్వాదశి నాడు పూర్ణ ఉపవాసం ఉండి ఆ రాత్రి విష్ణు ఆలయానికి వెళ్లి శ్రీహరిని మనసారా ధ్యానించి శ్రీహరి సన్నిధిలో పురాణ కాలక్షేపం చేసి మరునాడు బ్రాహ్మణ సమారాధన చేసిన  కోటి యజ్ఞముల ఫలితము కలుగుతుంది.  కార్తీక శుద్ధ ద్వాదశి నాడు శ్రీమన్నారాయణ శేష పానుపు నుండి లెగుస్తాడు గనుక కార్తీక శుద్ధ ద్వాదశి వ్రతం  శ్రీమన్నారాయణునికి ఇష్టం.  ఆ రోజున శ్రీమంతులెవరైనా ఆవు కొమ్ములకు బంగారు తొడుగులు తగిలించి ఆవు కాళ్ళకు వెండి డెక్కలు తగిలించి దూడతో సహా బ్రాహ్మణునకు దానమిచ్చి ఆ అవుకు ఎన్ని రోమాలు ఉన్నాయో అన్ని సంవత్సరాలు  ఇంద్రలోకంలో స్వర్గసుఖాలను అనుభవిస్తారు. కార్తీక మాసంలో వస్త్రదానం గొప్ప ఫలితాన్ని ఇస్తుంది.  కార్తీక శుద్ధ  పాడ్యమి రోజున, కార్తీక పౌర్ణమి రోజున కంచుపాత్రలో ఆవునెయ్యి పోసి దీపం ఉంచిన వారి పూర్వజన్మలో చేసిన పాపాలు హరిస్తాయి.  కార్తీక ద్వాదశినాడు యజ్ఞోపవీతమును దక్షిణతో బ్రాహ్మణులకు దానమిచ్చి పొందగలుగుతారు. కార్తీక ద్వాదశి రోజున బంగారు తులసి చెట్టును గాని సాలగ్రామములను ఒక బ్రాహ్మణునకు దానమిచ్చిన నాలుగు సముద్రాల మధ్య నున్న భూమిని దానమిచ్చిన ఫలితము కలుగుతుంది. దీనికి ఉదాహరణగా ఒక కథ ఉంది శ్రద్ధగా ఆలకించి మహారాజా.

సాలగ్రామ దాన మహిమ



              పూర్వ అఖండ గోదావరి నదితీరమునా ఒక పల్లెటూరిలో ఒక వైశ్యుడు నివసిస్తుండేవాడు.  అతను అత్యంత దురాశా పరుడై  నిత్యం ధనమును కూడా పెడుతూ తాను అనుభవించకుండా, ఇతరులకు పెట్టకుండా,  పేదవాళ్లకు దానధర్మాలు చేయకుండా, ఏప్పుడు పరులను నిందిస్తూ తానే గొప్ప శ్రీమంతుడుగా విర్రవీగుతూ  పరుల ధన్నాని ఎలా అపహరించాలి అనే ఆలోచనతో కాలం గడుపుతూ ఉండేవాడు.

            అతడు ఒకనాడు తన గ్రామమునకు సమీపంలో ఉన్న పల్లెలో నివసిస్తున్న ఒక బ్రాహ్మణునకు తన వద్ద ఉన్న ధనమును పెద్ద వడ్డీకి అప్పు ఇచ్చాడు. మరికొంత కాలానికి  సొమ్మును తనకిమ్మని అప్పుడు ఆ బ్రాహ్మణుడు " అయ్యా!  చేయవలసిన ధన్నాని నెల రోజుల గడువులో ఇస్తాను. నీ రుణము ఉంచుకోను.  ఆ మాటలకు వైశ్యునికి కోపం వచ్చి " అలా వీలు లేదు. నా సొమ్ము నాకు ఇప్పుడే ఇవ్వాలి. లేకపోతే నీ కంఠమును నరికి వేస్తాను" అని ఆవేశముతో ముందువెనుక ఆలోచించకుండా తన మొలకి ఉన్న కత్తితో ఆ బ్రాహ్మణుని కంఠమును నరికేశాడు. వెంటనే ఆ బ్రాహ్మణుడు మరణించాడు. ఆ వైశ్యుడు భయపడి అక్కడే ఉంటే రాజభటులు బంధిస్తారో అని తన గ్రామానికి పారిపోయాడు. బ్రాహ్మణుడిని హత్యా చేయటం వలన బ్రహ్మహత్య మహాపాపం చుట్టుకొని కుష్టివ్యాధి వచ్చి నానా భాదలు అనుభవిస్తూ కొన్నాళ్ళకు మరణించాడు. వెంటనే యమాదూతలు అతనిని తీసుకొని పోయి రౌరవాది నరక కూపముల పడవేశారు.

           ఆ వైశ్యునికి ఒక కుమారుడు ఉన్నాడు. అతని పేరు ధర్మవీరుడు.  ఆ పేరుకు తగినట్లుగానే తండ్రి సంపాదించిన ధనమును దానధర్మాలు చేస్తూ పుణ్యకార్యాలు ఆచరిస్తూ  మంచి కీర్తి సంపాదించాడు. కొంతకాలానికి త్రిలోకసంచారి అయినా నారదులవారు యమలోకమును దర్శించి భూలోకానికి వచ్చి, దారిలో ధర్మవీరుని ఇంటికి వెళ్లరు. ధర్మవీరుడు నారదులవారికి సాష్టాగానమస్కరం చేసి విష్ణుదేవునిగా భావించి ఆర్ఘ్యపాద్యములు చేత సత్కరించి, చేతులు జోడించి "మహానుభావా! నా పుణ్యము వలన నేడు తమ దర్శనం లభించింది. నేను ధన్యుడను. నా జన్మతరించింది. శక్తీ కొద్దీ నేను చేసే సత్కార్యమును స్వీకరించి తమరు వచ్చిన కార్యమును వివరించండి" అని వేడుకొన్నాడు. నారదులవారు చిరునవ్వు నవ్వి " ధర్మవీరా! నేను నీకొక హితవు చెప్పాలని వచ్చాను.  శ్రీమహావిష్ణువునకు కార్తీక మాసంలో శుద్ధద్వాదశి మహా ప్రీతికరమైన రోజు.  ఆరోజు స్నాన దాన జపాలు చేసిన అత్యంత ఫలితం కలుగుతుంది.  కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సూర్యుడు తులారాశి యందు వుండగా నిష్టగా ఉపవాసం ఉండి సాలగ్రామ దానము చేసిన  పూర్వ జన్మల యందు ఈ జన్మలలో చేసిన పాపములు పోతాయి. నీ తండ్రి యమలోకములో మహా నరకం అనుభవిస్తున్నాడు. నీ తండ్రిని ఉద్ధరించటానికి నువ్వు సాలగ్రామ దానం చేయక తప్పదు.  అలా చేసి నీ తండ్రి రుణం తీర్చుకో" అని చెప్పారు. ధర్మవీరుడు " నారద మునివర్యా!  నేను గోదానము, భూదానము, హిరణ్యదానము  మొదలగు  మహా దానములు చేశాను.  అటువంటి దానాలు చేసినా నా తండ్రికి మోక్షం కలగలేదు కానీ సాలగ్రామ దానం చేసినంత మాత్రాన ఆయనకు ఎలా ఉద్దరించబడతారు" అని సంశయం కలిగింది. నేను ఎందుకు దానం చేయాలి. నేను సాలగ్రామ దానం మాత్రం చేయను అని నిష్కర్షగా మాట్లాడాడు.

                  ధర్మ వీరుని అవివేకానికి విచారించిన నారదులవారు "వైశ్యుడు! సాలగ్రామము శిల అనే ఆలోచిస్తున్నావు. కానీ అది శిలా కాదు. శ్రీహరి యొక్క రూపము.  అన్ని దానాల కంటే సాలగ్రామ దానము చేస్తే గొప్ప ఫలితం దక్కుతుంది.  మీ తండ్రి నరక బాధల నుండి విముక్తి కలిగించడానికి ఈ దానం తప్ప వేరొక మార్గము లేదు అని చెప్పి నారదుల వారు వెళ్ళిపోయారు.

                  ధర్మవీరుడు ధనబలం కలవాడై ఉండీ దాన సామర్థ్యం కలిగి ఉండి కూడా సాలగ్రామ దానం చేయలేదు.  కొంత కాలమునకు అతడు చనిపోయాడు.  నారదుడు చెప్పిన హితబోధను పక్కన పెట్టినందుకు మరణానంతరము అతను మళ్ళి జన్మలో పులియై పుట్టి, ఇంకో మూడు జన్మలు కోతి అయి పుట్టి,  ఐదు జన్మలు ఎద్దులాగా పుట్టి, ప్రతి జన్మలో మానవ స్త్రీగా పుట్టి, ఇంకో పది జన్మలు పందిగా జన్మించి చివరకి పదకొండోవ జన్మలో ఒక  పేద బ్రాహ్మణుడి ఇంట్లో స్త్రీగా పుట్టగా  ఆమెకు యవ్వన కాలం రాగానే ఆ పేద బ్రాహ్మణుడు ఒక విద్వాంసునికి ఇచ్చి పెండ్లి చేశాడు. పెళ్లి అయిన కొంతకాలానికి ఆమె భర్త చనిపోయాడు.

         చిన్నతనమందే ఆమె అష్టకష్టాలు అనుభవిస్తునందుకు తల్లిదండ్రులు బంధువులు మిత్రులు చాలా దుఃఖించారు. తండ్రి ఆమెకు ఎందువలన ఇలాంటి కష్టం కలిగిందో  దివ్యదృష్టితో గ్రహించి వెంటనే ఆమె చేత సాలగ్రామ దానం చేయించి "నాకు  బాల వైధవ్యమునుకు కారణమైన పూర్వజన్మ పాపమూ నశించుగాక "అని చేపించి సాలగ్రామ దానఫలితము ధారపోయించారు. ఆ రోజు కార్తీక సోమవారం అవటం వలన ఆ సాలగ్రామ దాన ఫలితముతో ఆమె భర్త జీవించాడు. తరువాత ఆ దంపతులు చిరకాలము సకల సౌఖ్యములతో జీవించి జన్మతారము స్వర్గమునకు వెళ్లారు. మరికొంత కాలానికి బ్రాహ్మణ స్త్రీ మరొక బ్రాహ్మణుని ఇంట కుమారునిగా పుట్టి నిత్యము సాలగ్రామము దానము చేస్తూ ముక్తినిపొందెను

       కనుక జనకమహారాజా! కార్తీకశుద్ధ ద్వాదశీ రోజునా సాలగ్రామ దానము చేసిన దానిఫలితము చెప్పలేము. ఎంతో గొప్పది. కనుక నువ్వు ఆ సాలగ్రామ దానము చేయి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...