karthika puranam లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
karthika puranam లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

పోలి స్వర్గం కథ, పోలి పాడ్యమి పూజ విశిష్టత

పోలి స్వర్గం కథ, పోలి పాడ్యమి పూజ విశిష్టత

పూజ విధానం

పోలి పాడ్యమి పూజ కార్తీక మాసం అమావాస్య పూర్తయి తెల్లవారుజామున పోలి పాడ్యమి  (మార్గశిర పాడ్యమి)పూజను నిర్వహిస్తారు. కార్తీక మాసం అంత పూజ చేయలేనివారు ఈ రోజునా ముపై వత్తులతో అరటి దోనెలలో ఆవునేతితో వెలిగించి నదిలో వదులుతారు. మార్గశిర పాడ్యమి రోజునా తెల్లవారుజామున నిద్ర లేచి నది స్నానానికి వెళ్లి స్నామమాచరించి అరటి దోనెలలో తిప్పలు వెలిగించి నదిలో వదలాలి. నదిలో దీపాలను శివుడు, విష్ణువు, గంగా, ,మహాలక్ష్మి దేవిగా భావిస్తారు. పూజ చేసి కార్తీక దామోదరుడిగా భావిస్తారు. దీపాన్ని వదిలేటపుడు పోలి స్వర్గం కథ చదువుకుంటారు. నదికి వెళ్లలేని వాళ్ళు చెరువుల దగ్గర కానీ, భావి దగ్గర కానీ లేక ఇంటిలోనే ఒక తోటేలో దీపాన్ని వదులుతారు.



పోలి స్వర్గం కథ

పూర్వం కృష్ణ తీరములో పోలమ్మ అనే ఒక మహిళా ఉంది. పోలమ్మ(పోలి) చిన్ననాటి నుంచి దైవ భక్తి ఎక్కువ. ఆమె ఊహ వచ్చినప్పటి నుంచి ప్రతి సంవత్సరం కార్తీక మాసం క్రమం తప్పకుండా చేసేది. ఆమెకు యుక్తి వయస్సు వచ్చిన తరువాత వివాహం జరిగింది. ఆమె అత్తగారి ఇంట్లో ఆమె ముగ్గురు తోడికోడళ్లు ఉండేవారు. ఆమె అత్త గారి మహా గయ్యాళి. పోలమ్మ భక్తి శ్రద్ధలను చూసి ఓర్వలేక పోయింది. పోలమ్మ వివాహం అయినా మొదటి సంవత్సరం కార్తీక మాసం వచ్చింది. ఆమె అత్తగారు ఆమెను పూజ చేసుకోనివ్వలేదు. ఆమె ఇంటిలోనే వదిలి పేటి మిగతా ముగ్గురు కొండలను తీసుకొని కృష్ణ నది స్నానానికి వేలాది. పోలమ్మను పూజ చేయనివ్వకూడదని ఆమెకు పూజ సామాను అందకుండా చేసేది అత్తగారు.  ఆమెకు సమయం ఉండకుండా ఇంటిపనులన్ని చెప్పేది. పోలమ్మ వాటినన్నిటిని ఓర్పుతో చేసి ప్రతి రోజు తెలవరకుండానే భావి దగర స్నానం చేసి పెరడులో పతిచెట్టు దగరకు వెళ్లి పతిని కోసి దానిని వతిగా చేసి ఇంటిలో ఉన్న వెన్నను పతికి రాసి కొబ్బరి చిప్పలో దీపాన్ని వెలిగించేది. దీపం ఎవరికీ కనపడకుండా బూటా బోర్లించేది. ఇలా నెల రోజులు చేసింది. ఆఖరి రోజు కార్తీక అమావాస్య వెళ్లి మార్గశిర పాడ్యమి రోజునా అలాగే చేసింది. ఆమె భక్తికి మెచ్చి శ్రీమహా విష్ణువు ఆమెను సశేరీరంగా వైకుంఠానికి తీసుకుంటామని విష్ణు దూతలను పంపించారు. విష్ణు దూతలు వెంటనే అక్కడికి వచ్చారు. పోలమ్మను వైకుంఠానికి తీసుకువెళతానికి విమానంలో ఏకించుకున్నారు. ఆ విమానాన్ని చుసిన పోలమ్మ అత్తగారు ఆ విమానం తమ కోసమే వచ్చింది అని అనుకోని దగరకు చెలగా అందులో పోలమ్మ కనిపించింది. మాకు దక్కనిది పోలమ్మకు ఎందుకు దక్కాలి అని ఆమె కళ్ళు పట్టుకొని లాగబోయారు. అప్పటికే విమానం పైకి వెళ్లిపోయింది. పోలమ్మ అత్తగారు పోలమ్మ కళ్ళు పట్టుకుంది. ఆ అత్తగారి వెనక ముగ్గురు కోడలు ఒకరికలు ఒకరు పట్టుకొని విమానంతో వెలసాగారు. కొంతదూరం వెళ్లిన తరువాత విష్ణు దూతలు పోలమ్మ అత్తగారి చేతులమీద కొట్టారు వాలు కిందపడి మరణించారు. అందరూ చూస్తుండగా పోలమ్మ సశరీరంగా వైకుంఠానికి వెళ్లిపోయింది. ఆమె అత్తగారు, ఆమె ముగ్గురు తోడికోడళ్లు యమభటులు వచ్చి తీసుకు వెళ్లరు. ఈ కథను దీపాన్ని వదిలేటపుడు చెప్పుకుంటారు. 


కార్తీక పురాణము 30వ రోజు

కార్తీకవ్రత మహిమ ఫలశ్రుతి 

నైమిశారణ్యములో ఆశ్రమములో శౌనకాది మహామునులకు సూతమహర్షి తెలియజేసిన కార్తీకమాస మహత్యం, విష్ణు మహిమలు, శివమహిమలు విన శౌనకాది మునులు సుతునితో ఇంకా కార్తీకమాస విశేషాలు తెలియజేయండి అని అడిగారు. అందుకు సుతుడు "మునీశ్వరులారా! కార్తీక మాస మహిమ ఎంతవిన తనివితీరదు. ఈ మాసములో ప్రతిరోజు సూర్యదయమునకు ముందే నిద్రలేచి దగ్గరలో ఉన్న నదిలో స్నానము చేసి దేవాలయమునకు వెళ్లి దపారాధలు, దానధర్మాలు, దీపధానములు చేయాలి.  ప్రతిరోజు సాయంత్రం పురాణపఠనం చేయాలి. ఇలా నెలరోజులు చేసినా సకల పాపములు పోతాయి. కార్తీక వ్రతాన్ని నిష్టతో చేస్తే చివరకు వైకుంఠప్రాప్తి కలుగుతుంది. ఈ కార్తీకమాసం లో సదా హరినామస్మరణ చేసినా సకల పాపాలు నశిస్తాయి. 

స్వస్తి.............. 



కార్తీక పురాణము 29వ రోజు

అంబరీషుడు దుర్వాసుని పూజించుట - ద్వాదశీ పారాయణము 

అత్రిమహాముని అగస్త్యుల వారితో ఈ విధముగా - సుదర్శన చక్రము అంబరీషునికి అభయమిచ్చి రక్షించి, భక్తికోటికి దర్శనమిచ్చి అంతర్ధానమైన విధానాన్ని చేపి ఇంకా ఇలా చెప్పసాగారు. 

ఆ తరువాత అంబరీషుడు దుర్వాసుని భోజనానికి ఆహ్వానించి అతనికి అతిధి మర్యాదలు చేసి అందరూ కలిసి శ్రీమహావిష్ణువుని పూజించి ద్వాదసిపారణము చేసారు. తరువాత అందరూ భోజనము చేసారు. తరువాత అంబరీషుడు దుర్వాసునితో "స్వామి! మీవంటి తాపశాలిని సేవించటం నా భాగ్యం నాయందు దయవుంచి నేను ఇపుడు సాధువులను, సన్యాసులను గౌరవించి, పూజించి ఇపుడు నా మనసులో హరినామస్మరణ విడవకుండా ఉండేలా నన్ను ఆశీర్వదించండి" అని దుర్వాసుడిని కోరాడు అందుకు దూర్వాసుడు "అంబరీషా! నువ్వు ధన్యుడవు. ప్రజా రంజకంగా పరిపాలిస్తున్నావు. నువ్వు శ్రీహరి భక్తులలో శ్రేష్ఠుడవు. నువ్వు అడిగిన ఈ చిన్న వరాన్ని నీకు ఇస్తున్నాను. ఇకనుంచి నీవు నాకు ఇష్టుడవు. ఎవరైతే ప్రతి ఏకాదశి నాడు కటిక ఉపవాసం చేసి ద్వాదశినాడు శ్రీమహావిష్ణువుని పూజించి శక్తికొలది దానధర్మలు చేసి బ్రాహ్మణులతో సహా ద్వాదశిఘడియలు దాటకుండా భోజనము చేస్తారో వారికీ వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. 



కార్తీక పురాణము 28వ రోజు

విష్ణు సుదర్శన చక్ర మహిమ

           అత్రి మహాముని అంబరీషునితో దూర్వాసుడు విష్ణుమూర్తి దగ్గర సెలవు తీసుకొని తనని తరుముకువస్తున సుదర్శన చెక్రనికి భయపడి అంబరీషుని వద్దకు వెళ్లి అతని పాదాలపై పడి వేడుకొన్నాడు. అంబరీషా నను క్షమించు. నేనే తాపశాలిని అనే గర్వముతో ముందు వెనక ఆలోచించకుండా నీ పట్ల అన్యాయం చేశాను.  ఇపుడు ఫలితం అనుభవిస్తున్నాను. నన్ను క్షమించు రక్షించు అని వేడుకొన్నాడు. అంబరీషుడు దుర్వాసుడిని లేవదీసి సుదర్శన చెక్రనికి నమస్కరించి కోరిన వాళ్లకి నా దగ్గర వున్నది లేకుండా యిచ్చిన వాడనయితే నేను ఎప్పుడూ ధర్మము తప్పకుండా ప్రవర్తించిన వాడనయితే నేను చేసిన పూజలకు శ్రీమన్నారాయణ సంతోషమును పొందిన వాడయితే నీవు ఈనాడు మహర్షిని సంహరించాలని ఉద్యుక్తతను పొందుతున్న దానివి ప్రశాంతతను పొంది, శాంతిని పొంది నీ యథాస్థానమునకు మరలి పొడువు గాక!” అన్నాడు. దుర్వాసుని రక్షించడానికి తాను చేసిన తపస్సునంతటిని ఒట్టు పెట్టాడు. ఉత్తర క్షణం ప్రశాంతతను పొంది సుదర్శన చక్రం వైకుంఠమునకు వెళ్ళిపోయింది.




కార్తీక పురాణము 27వ రోజు

దుర్వాసుడు అంబరీషుని ఆశ్రయించుట

         అత్రి మహాముని అగస్యునికి ఇలా చెప్పసాగారు. అగస్యా!  శ్రీ హరి దుర్వాసుని యెంతో ప్రేమతో చేరదీసి ఇలా చెప్పసాగారు. 

            ఓ దుర్వాసముని!  నువ్వు అంబరీషుని శపించినట్లు గానే  ఆపది జన్మలు నాకు సంతోషకరమైనవే.  నేను అవతారాలు ధరించడం కష్టం కాదు. నువ్వు తప్పసాలివి.  మీ మాటకు విలువ ఇవ్వాలి.  అందుకే నేను అంగీకరిస్తున్నాను.  బ్రాహ్మణుల మాట సత్యాలు అయితే వారికి గౌరవం ఉండదు.  ఇటు భక్తులను కాపాడటం అటు బ్రాహ్మణుల మాట తప్పకుండా ఉండటం నా కర్తవ్యం.  నువ్వు అంబరీషుని ఇంట్లో భుజించకుండా వచ్చావు.  అందుకే అతడు నా వలన దుర్వాసమహర్షి ప్రాణాలకు ముప్పు వచ్చింది అని ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధపడుతున్నాడు.  ఆ కారణం వల్లనే విష్ణుచక్రం నిన్ను బాధిస్తుంది.  వెంటనే నువ్వు అంబరీషుని దగ్గరకు వెళ్ళు. మీ ఇద్దరికి శాంతి శాంతి లభిస్తుంది.  విష్ణువు దుర్వాసునికి నచ్చజెప్పి అంబరీషుని దగ్గరకి పంపారు.  దూర్వాసుడు వెంటనే అంబరీషుని దగ్గరకు భయాలుదేరారు. 




కార్తీక పురాణము 26వ రోజు

దూర్వాసుడు శ్రీహరిని శరణువేడుట

ఈ విధంగా అత్రిమహాముని అగస్త్యునితో దుర్వాసుని కోపమువలన జరిగిన ప్రమాదం గురించి చేపి ఇంకా చెప్పసాగారు. దూర్వాసుడు అని లోకాలను తిరిగి తనని రక్షించేవాళ్ళు ఒక శ్రీహరి అని వైకుంఠానికి వెళ్లి శ్రీమన్నారాయణ నన్ను రక్షించండి. నీ భక్తుడైన అంబరీషుడికి కీడు చేయాలి అని చూసి నేను బ్రాహ్మణుడిని ముకోపినై ముందు వెనక చూడకుండా మహాపరాధము చేశాను. నీవు బ్రాహ్మణప్రియుడవు. నీ భక్తునికి శాపమిచ్చిన నేనుకూడా రక్షించండి. శ్రీహరి! నీ చక్రాయుధము నను తరుముకొస్తుంది. అని దూర్వాసుడు అహంకారాన్ని వదిలి అనేకవిధాలుగా వేడుకొన్నాడు. శ్రీహరి చిరునవ్వు నవ్వి దుర్వాస! బ్రాహ్మణా రూపములో పుటిన రుద్రుడవు. నీ వంటి తపోధనులు నాకు ఇష్టులు. ప్రతియుగములో గో, బ్రాహ్మణ, దేవా, సాదుజనులకు సంభవించే ఆపదలను పోగొట్టటానికి నేను అవతారాలు ధరిస్తాను. నీవు అకారణంగా అంబరీషుడిని శపించావు. నేను శత్రువుకైనను మనోవకాయకర్మలలో హాని తలపేటను. అంబరీషుడు ధర్మయుక్తంగా ప్రజాపాలన చేస్తున్నాడు. కానీ అటువంటి భక్తుడిని అనేక విధాలా ధూషించావు. నీ ఎడమ పాదముతో తన్నావు. అతని ఇంటికి నువ్వు అతిథివై వెళ్లి నీకు ఆలస్యం అయితే ద్వాదశి ఘడియలు ముగియక ముందే భోజన చేయమని చెప్పలేదు. అతడు వ్రతభంగానికి భయపడి నీళ్లు మాత్రమే తాగాడు. అంతకంటే అపరాధము ఏమి చేయలేదు. చాతుర్వర్ణాల వారికీ భోజన నిషిద్ధ సమయంలో కూడా దాహంతీర్చుకోవటానికి నీళ్లు త్రాగటం మంచిదే కదా. మంచి నీళ్లు తాగాడని నా భక్తుడిని తిట్టి శపించావు. అతడు వ్రతభంగానికి భయపడి నీళ్లు మాత్రమే తాగాడు కానీ నిన్ను అవమానించటానికి కాదు కదా. నువ్వు కోపంగా ఉన్న అతడు నిన్ను భ్రతిమి లాడాడు. ఎంత బ్రతిమిలాడినా నువ్వు శాంతించలేదు. అందుకే అతను నన్ను శరణు వేడాడు. నేనపుడు రాజు హృదయములో ప్రవేశించాను. నీ శాపము పది జన్మలలో అనుభవిస్తాను అని నేనే పలికాను. అతడు ని వల్ల భయముతో  శరణువేడుతున్నాడు.  తనని తాను తెలుసుకోలేని స్థితిలో ఉన్నాడు.  నీ శాపమును అతడు వినలేదు.  అంబరీషుడు నా భక్తులలో శ్రష్ఠుడు.  నిరపరాధి.  విచారించకు.  ఆ శాపాన్ని లోకోపకారంకై  నేనే అనుభవిస్తాను. 

            మీ శాపం లో మొదటి జన్మ ఈ కల్పాని  రక్షించటానికి మత్యవతారం గాను,  రెండొవ జన్మ క్షిరసాగరమధనంలో కూర్మావతారం గాను, మూడవ జన్మ భూమిని కాపాడటానికి వరాహ అవతారం గాను, నాలుగోవ అవతారం ప్రహ్లదుడిని కాపాడతానికి నరసింహావతారం గాను, ఐదొవ అవతారం బలిచేక్రవర్తిని పాతాళానికి వామామవతారం గాను, ఆరొవ అవతారం పరశురామ అవతారం గాను, ఎడొవ అవతారం రాముని గాను, ఎనిమిదోఅవతారం కృష్ణుడి గాను, తోమిదొవ అవతారం బుధ్ధుడిగాను, పదోవ అవతారం కల్కి గాను అవతరిస్తాను. ఈ పది అవతారములు ఎవరైనా నిత్యం స్మరించిన వారికీ వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. 



కార్తీక పురాణము 25వ రోజు

దూర్వాసుడు అంబరీషుని శపించుట 

అంబరీషా!పూర్వజన్మలో కొంత పాపవిశేషం వలన నికి యనర్ధము వచ్చింది. నీ బుద్ధిచే దీర్ఘముగా అలోచించి నీకెలా అనిపిస్తుందో అలానే చేయి. ఇక మాకు సెలవు ఇపించండి. అని పండితులు పలికారు. తరువాత అంబరీషుడు పండితులారా! నా అభిప్రాయును విని వెళ్ళండి. ద్వాదశీనిష్టను విడిచి పెట్టటం కన్నా, బ్రాహ్మణశాపమును పొందటం మేలు కొద్దిగా నీళ్లు తాగటం వలన బ్రాహ్మణుని అవమానించటం కాదు. ద్వాదశిని విడిచి పెట్టటం కాదు. అప్పుడు నన్ను ఎందుకు నిందిస్తాడు? నిందించడు. నా తొలి పుణ్యఫలమును నశించదు. కనుక జలపానమొనరించి ఉరుకుంటాను. అని వారి ఎదురుగానే నీళ్లు తాగుతాను. 

           అంబరీషుడు నీళ్లు తగిన వెంటనే దూర్వాసుడు స్నానజపాదులు పూర్తి చేసుకొని అక్కడకు వచ్చారు. వచ్చిన వెంటనే ఆ ముని కోపముతో అంబరీషుడిని నన్ను భోజనానికి రమ్మని, నేను రాకుండానే నీవేల భోజనము చేసావు. ఎంత దుర్మార్గము? ఎంత నిర్లక్ష్యము? ఎంతటి ధర్మ పరిత్యాగివి? అతిథికి అన్నము పెడతానని పెట్టకుండా నువ్వు తింటావా. అట్టి అధముడు మరుజన్మలో పురుగైపుట్టును. నీవు అతిధిని విడిచి భుజించినావు కాన, నీవు నమ్మకద్రోహివి హరిభక్తుడవు ఇలా అవుతావు? శ్రీహరి బ్రాహ్మణుడిని అవమానించటమే. నీవంటి హరినిందపరుడు వేరొకడు లేడు. నువ్వు మహా భక్తుడనని నీకు గర్వము కలవాడివై ఉన్నావు. ఆ గర్వముతో నీవు నన్ను భోజనానికి ఆహ్వానించి అవమానపరచి నిర్లక్ష్యముగా నీళ్లు పుచ్చుకున్నావు. అంబరీష నీవు ఎలా పవిత్రకుటుంబములో పుట్టావు. నీ వంశము కళంకం కాలేదా. అని కోపం నోటికివచ్చినటు తిట్టాడు. అంబరీషుడు మునికోపమునకు గడగడా వణుకుతూ నమస్కరించి మునివర్యా నను క్షమించండి. నేను ధర్మహీనుడిని. నా అజ్ఞానముతో ఈ పని చేశాను. నన్ను రక్షించండి. బ్రాహ్మణునకు శాంతియే ప్రధానము. మీరు తపోధనులు, దయాదాక్షణ్యాలు గలవారు. నను కాపాడండి. అని అతని పాదాలపై పడి, దయలేని వాడై దూర్వాసుడు అంబరీషుని తలను తన ఎడమకాలితో తని "నువ్వు దోషివి దోషికి శాపం ఇవ్వకుండా ఉండకూడదు. నువ్వు మొదటి జన్మలో చేపగాను, రెండొవజన్మలో తాబేలుగాను, మూడవజన్మలో పందిగాను, నాలుగోవజన్మలో సింహముగాను, ఐదొవజన్మలో వామనుడిగాను, ఆరొవజన్మలో క్రూరుడైన బ్రాహ్మణుడిగాను ఎడొవజన్మలో మూఢుడవైన రాజుగాను, ఎనిమిదొవ జన్మలో రాజ్యముగాని సింహాసనము లేనట్టి రాజుగాను, తొమ్మిదొవజన్మలో పాషండ మతస్థునిగాను, పదోవ జన్మలో పాపబుద్ధిగల దయలేని బ్రాహ్మణుడిగాను పుట్టాలి గాక "అని వెనక ముందు ఆలోచించకుండా శపించాడు. ఇంకా కోపం తగనందు వల్ల మళ్లి శపించటానికి చూస్తుండగా, శ్రీమహావిష్ణువు బ్రాహ్మణ శాపము వృధాకాకూడదు అని తన భక్తునికి ఈ అపాయము కలగకూడదని అంబరీషుని హృదయములో ప్రవేశించి "మునివర్యా అలాగే నీ శాపమును అనుభవిస్తాను అని ప్రాధేయపడాడు. కానీ దూర్వాసుడు ఇంకా కోపంపెంచుకొని మళ్లీ శపించబోగా, శ్రీమన్నారాయణుడు తన సుదర్శన చెక్రాని అడుపెట్టారు. సుదర్శన చెక్రము నిప్పులు కక్కుతూ దుర్వాసునిపై పడబోయింది. దూర్వాసుడు ఆ చెక్రము తనను మసిచేస్తుంది అని తలచి ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని అక్కడినుండి పరిగెత్తాడు. తనను కాపాడమని భూలోకంలో ఉన్న మహా మునులను దేవలోకంలో ఉన్న దేవేంద్రుడిని, బ్రహ్మలోకములో ఉన్న బ్రహ్మను, కైలాసమునకు వెళ్లి ఎంత ప్రదించిన వారు సైతము ఛేక్రాయుధము బారి నుంచి దుర్వాసుడిని కాపాడలేకపోయారు. 



కార్తీక పురాణము 24వ రోజు

 అంబరీషుని ద్వాదశీవ్రతము 

అత్రిమహాముని మళ్లీ అగస్త్యునితో "అగస్త్య మహర్షి! కార్తీకవ్రత ప్రభావము  వివరించిన తనివితీరదు. కార్తీక మాసములో శుద్ధ ద్వాదశిరోజునాడు చేసే వ్రతానికి అత్యంత ప్రాముఖ్యత ఉన్నది.  ఆ రోజు చేసే దాన ధర్మాలకు అధిక ప్రాముఖ్యత ఉన్నది. ఈ ద్వాదశీవ్రతము ఎలాచేయాలి వివరిస్తాను విను. 

        కార్తీక శుద్ధ దశమి రోజున పగటిపూట మాత్రమే భుజించి ఆ మరుసటిరోజు అనగా ఏకాదశిరోజు ఎటువంటి ఆహారము తీసుకోక కటిక ఉపవాసము చేసి ద్వాదశి గడియలు వచ్చిన తరువాత భోజనము చేయాలి. ఎందుకు ఒక ఇతిహాసము ఉన్నది. అదికూడా వివరిస్తాను. 

          పూర్వము అంబరీషుడను రాజు ఉన్నాడు. అతడు పరమ భాగవతోత్తముడు. ద్వాదశీవ్రత ప్రియుడు. అంబరీషుడు ప్రతి ద్వాదశినాడు తప్పకుండా వ్రతము చేస్తుండేవాడు. ఒక ద్వాదశినాడు ద్వాదశిఘడియలు స్వల్పంగా ఉన్నాయి. అందుకే ఆరోజు త్వరగా వ్రతమును ముగించి బ్రాహ్మణసమారాధన చేయదలచి సిధ్ధముగా ఉన్నాడు. అదే సమయానికి అక్కడికి కోపస్వభావము కలిగిన దుర్వాస మహర్షి వచ్చారు. అంబరీషుడు ఆమునిని గౌరవించి, ద్వాదశి ఘడియలలో పారాయణ చేయాలి కనుక తొందరగా స్నానమునకేగి రమ్మనమని కోరాడు. అందుకు దుర్వాసుడు అంగీకరించి దగ్గరలో ఉన్న నదికి వెళ్లారు. అంబరీషుడు ఎంతసేపు ఎదురుచూసిన దుర్వాస మహర్షి రాకపోయేసరికి తనలోతానుద్వాదశిఘడియాలి దాటిపోతున్నాయి. మహర్షి ఇంకారాలేదు. ఇపుడు ఏమిచేయాలి. అని తన రాజ్యములో ఉన్న పండితులను పిలిచి ఇలా చెప్పసాగారు. ఇంటివచ్చిన దుర్వాసమహర్షి భోజనానికి రమ్మన్నాను. మహర్షి స్నానానికి వెళ్లి ఇంకా రాలేదు. మహర్షిని భోజనానికి పిలిచి తాను ముందు భోజనము చేయటం ధర్మమూ కాదు. మహర్షి వచ్చేవరకు ఉంటే వ్రతభంగము అవుతుంది. ద్వాదశి వ్రతము విడిస్తే శ్రీహరి భక్తిని వదిలిన వాడిని అవుతాను. దుర్వాసమహర్షి మహా కోపము కలవాడు. అయన రాకుండా భోజనము చేస్తే మహర్షి శపిస్తారు. ద్వాదశి విడిచి భుచించిన భగవంతునికి, భోజముచేసిన దుర్వాసమహర్షికి కోపం వస్తుంది. ఈ రెండిటిలో ఏది ఉత్తమమైనది తెలియజేయండి. పండితులు అందరూ కలిసి మహారాజ! సమస్త ప్రాణకోటికి గర్భకుహరములో జఠరాగ్ని రూపములో రహస్యముగానున్న అగ్నిదేవుడు ఆకలిని పుటించి ప్రాణులు భుజించిన చాతురిధాన్నమును పచనముగావించి దేహేంద్రియాలకు శక్తిని ఇస్తున్నాడు. ప్రాణవాయువు సహాయముతో జఠరాగ్ని చెలరేగి ఆకలి దప్పికలి కలుగును. ఆ తాపముము చల్లార్చవలెనన్న అన్నము, నీరు పుచ్చూకొని శాంతపరచవలెను. శరీరమునకు శక్తి కలుగచేయువాడు అగ్నిదేవుడు, దేవతల అందరి కంటే అధికుడై దేవపూజ్యుడు. ఆ అగ్నిదేవుడిని అందరు సదాపూజించాలి.గృహస్థుడు, ఇంటికివచ్చిన అతిథి కడజాతివాడైన భోజనము పెడతాను అని చేపి వానికి పెట్టకుండా తినకూడదు. అందులోనూ వేదవేదంగావిద్యావిశారదుడు, మహాతాపశాలి, సదాచారసంపనుడు అయినా దుర్వాస మహర్షిని భోజనానికి పిలిచి అతనికి పెట్టకుండా తాను భుజించటం వలన మహాపాపము కలుగుతుంది. అందువలన ఆయుఃక్షిణము కలుగుతుంది. దుర్వాస మహాముని అంతటి వానిని అవమానమొనరించిన పాపము కలుగుతుంది అను వివరించారు............



కార్తీక పురాణము 23వ రోజు

శ్రీరంగక్షేత్రమున పురంజనుడు ముక్తిని పొందింది

          అగస్యుడు మళ్లీ అత్రిమహర్షిని చూసి "మునిపుంగవా! విజయముపొంచిన పురంజయుడు ఏమిచేసాడు నాకు వివరించండి". అందుకు అత్రిమహాముని ఇలా చెప్పారు. అగస్యమహర్షి! పురంజయుడు కార్తీక మాసవ్రతప్రభావము వలన అసమాన బలోపేతుడై తన శత్రురాజులను అందరిని ఓడించి నిరాటంకంగా తన రాజ్యమును ఏలుతున్నాడు. అతని విష్ణు భక్తి ప్రభావం వలన అధర్మ మార్గాన్ని విడి ధర్మ మార్గాన్ని ఆచరిస్తు రాజ్య ప్రజలను పాలిస్తున్నాడు. కొంతకాలానికి పురంజనుడికి అశరీరవాణి ఇలా వినిపించింది పురంజనా!కావేరి నదీతీరమున శ్రీరంగక్షేత్రముంది. దానిని రెండొవ వైకుంఠమని పిలుస్తారు. నువ్వు అక్కడికి వెళ్లి శ్రీరంగనాథస్వామిని అర్చింస్తే నువ్వు సంసాగరమును ధాటి మోక్షప్రాప్తి కలుగుతుంది అని వినిపించింది. 

     తరువాత పురంజయుడు రాజ్యమును మంత్రులకు అప్పగించి రాజ్య సపరివారంగా బయలుదేరి మార్గమధ్యంలో వస్తున్న పుణ్యక్షేత్రాలను దర్శించి, పుణ్య నదులలో స్నానమాచరించు శ్రీరంగానికి చేరుకున్నారు. అక్కడ కావేరి నది రెండు పాయలుగా ప్రవహిస్తుండగా మధ్యలో శ్రీరంగఆలయంలో శేషశయ్యపై పవ్వళించి ఉన్న శ్రీరంగ స్వామిని దర్శించుకున్నారు. కార్తీకమాసమంతా శ్రీరంగమునందే గడిపి తరువాత అయోధ్యకు బయలుదేరారు. కార్తీక మాస వ్రతప్రభావము వలన అతని రాజ్యములోని ప్రజలందరూ సిరిసంపదలతో, ఆయురారోగ్యాలతో ఉన్నారు. అతడు ధర్మాభిలాషుడై దైవభక్తిపరాయణుడై అరిషడ్వార్గాలను జయించి రాజ్యపాలన చేస్తున్నాడు. కొంతకాలానికి అతనికి వృధాప్యము రాగా అతని కుమారుడికి రాజ్యపాలనము అప్పగించి వాన ప్రస్థాశ్రమానికి స్వకరించి అరణ్యానికి వెళ్ళాడు. అతడు వానప్రస్థాశ్రమంలో కూడా ప్రతి సంవత్సరం కార్తీక మాసవ్రతమును ఆచరించి మరణించిన తరువాత వైకుంఠానికి వెళ్ళాడు. కనుక ఓ అగస్యమహర్షి కార్తీక మాసవ్రత మహత్యం ఫలప్రదమైనది. దానిని ప్రతివారు ఆచరించాలి. ఈ కథ విన్నవారికి చదివిన వారికీ కూడా వైకుంఠప్రాప్తి కలుగుతుంది. 



కార్తీక పురాణము 22వ రోజు

పురంజయుడు కార్తీక మాస వ్రతం చేయటం 

అత్రి మహాముని అగస్త్యునికి ఇలా చెప్పసాగారు. పురంజయుడు వశిష్ఠులవారు చెప్పిన ప్రకారం కార్తీక పౌర్ణమి రోజున శుచియై దేవాలయమునకు వెళ్లి శ్రీమన్నారాయణుని షోడశోపచారాలతో పూజించి, శ్రీహరిని ప్రార్ధించి, సాష్టాంగ నమస్కారం చేసి, సూర్యోదయము కాగానే నదికి వెళ్లి స్నానమాచరించి తన గృహానికి వెళ్ళాడు. అదే సమయిజంలో విష్ణుభక్తుడైన ఒక వృద్దబ్రాహ్మణుడు మెడనింద తులసీమాలలు ధరించి పురంజయుడి దగ్గరకు వచ్చి "రాజా! విచారించకు. నువ్వు వెంటనే చెల్లచెదురైనా సైన్యాన్ని కూడదీసుకుని నీ శత్రురాజులతో యుద్ధం చేయి. నీ రాజ్యము నీకు దక్కుతుంది" దీవించి వెళ్లారు. బ్రహ్మానుడి మాటలు నమ్మి పురంజయుడు శత్రురాజులతో ఘోరంగా యుద్ధం చేసాడు. శ్రీమన్నారాయుని ఆశీర్వాదముతో పురంజయుడు ముందు యుద్దములో నిలువలేక శత్రురాజులు పారిపోయారు. పురంజయుడు విజయం పొంది తన రాజ్యాని తాను తిరిగి సంపాదించాడు. శ్రీమన్నారాయుని కటాక్షం వలన భక్తులకు శత్రువుల భయం ఉండదు కదా!




కార్తీక పురాణము 20వ రోజు

 పురంజయుడు దురాచారుడగుట 

           జనకమహారాజు వసిష్ఠునితో "గురువర్యా! కార్తీక మహత్యం ఇంకా వినాలని ఉంది. ఈ వ్రతముము గురించి ఇంకా ఏమన్నా కథలు ఉన్నాయా వివరించండి."  వసిష్ఠులవారు విని మందహాసములో "ఓ రాజా! కార్తీక మాస మహత్యం గురించి అగస్త్యమాజమునికి, అత్రిమహామునికి జరిగిన ప్రసంగము ఒకటి ఉన్నది. దానిని వివరిస్తాను. శ్రద్ధగా విను". 

            పూర్వము ఒకపుడు అగస్యమహర్షి, అత్రిమహాముని దగరకు వచ్చి "ఓ అత్రిమహాముని! నీవు విష్ణుమూర్తి అంశతో జన్మించావు. కార్తీకమాస మహత్యం మీకు వివరంగా తెలుసు. దానిని నాకు వివరించండి" అని కోరెను. అందుకు అత్రిమహాముని "అగస్యమహర్షి! నీవు అడిగిన ప్రశ్న శ్రీమన్నారాయణుని ప్రీతికరమైనది. కార్తీకమాసంతో సమానమైన మాసం, వేదములతో సమానమైన శాస్త్రము, ఆరోగ్యముతో సమానమైన సంపద వేరొకటి లేదు. ఏ మానవుడైన కార్తీకమాసమున నదిలో స్నానము చేసినా, శివకేశవుల ఆలయములో దీపారాధన చేసినా, లేక దీపదానము చేసినా కలుగు ఫలితము అపారమైనది. దీనికి ఒక ఇతిహాసము ఉన్నది. 

               త్రేతాయుగములో పురంజయుడు సూర్యవంశపు రాజు అయోధ్య నగరమును రాజధానిగా చేసుకొని రాజ్యమేలుతున్నాడు. అతడు సకల శాస్త్రములు చదివారు. న్యాయముగా రాజ్యపాలన చేస్తున్నారు. ప్రజలకు ఇటువంటి ఆపదలు రాకుండా పాలిస్తున్నాడు. కొంతకాలానికి పురంజయుడు అమిత ధనాశ కలిగి, రాజ్యాధికార గర్వముతో జ్ఞానహీనుడై దయాదాక్షణ్యాలు లేక దేవబ్రాహ్మణ మాన్యములు లాగుకొని, పరమలోభియై, చోరులను చేరదీసి వీరిచే దొంగతనములు దోపిడీలు చేయించి దొంగలు తెచ్చిన ధనమును సగం వాటా లాకొని ప్రజలను భయభ్రాంతులను చేస్తుండేవాడు. కొంతకాలానికి అతని దౌర్జన్యం గురించి చుటుపక్కల రాజ్యాలైన కాంభోజ, టెంకణ, కొంకణ, కళింగాది రాజుల చెవులో పడింది. వారు తమలో తాము ఆలోచించుకొని కాంభోజరాజుని నాయకునిగా చేసుకొని రథ, గజ, తురగ, పదాతి సైన్య బలముతో రహస్య మార్గములో అయోధ్య నగరాన్ని ముట్టడించి, నలువైపులా శిభిరాలు నిర్మించి నగరాన్ని దిగ్భాధానం చేసి యుద్ధనికి సిద్దపడారు. 

             అయోధ్య నగరాన్ని ముట్టడించిన సంగతి చరుల ద్వారా తెలుసుకొన పురంజయుడు తనుకూడా సర్వసన్నధ్ధుడై వున్నాడు. అయినా ఎదుటి పక్షము బలముగా ఉన్న తాను బలహీనంగా ఉన్న ఏ మాత్రము భయంము చెందకుండా రధము ఎక్కి సైన్యాధిపతులను పురికొల్పి, చతురంగబల సమేతుమైన సైన్యముతో యుధ్ధాసన్నధ్ధుడై వారిని ఎదొర్కొనడానికి యుద్ధ భేరిని మోగించి, శత్రుసైన్యముతో యుద్ధం చేస్తున్నారు. 


 

కార్తీక పురాణము 19వ రోజు

 చాతుర్మాస్య వ్రత ప్రభావనిరూపణ

                ఈ విధంగా  నైమిశారణ్యంలో ఉన్న మహామునులు అందరూ కలిసి  శ్రీహరిని స్తోత్రం చేసిన తర్వాత  జ్ఞానసిద్దుడను మహాయోగి " దీనబంధువా! వేదవైద్యుడవని, వేదవ్యాసుడవని, అద్వితీయుడవని  సూర్యచంద్రులు నేత్రములుగా కలవాడని  సర్వాంతర్యామి అని,  సర్వేజనులచే స్తుతించబడుతున్న ఓ మాధవా!  మేము ఈ సంసారా బంధం నుండి బయటపడలేక పోతున్నాము.  మమ్మల్ని రక్షించు. మానవులు ఎన్ని పురాణాలు చదివినా ఎన్ని శాస్త్రములు విన్నా నీ దర్శన భాగ్యం కలుగదు.  నీ భక్తులకు మాత్రమే నీవు  కనిపిస్తావు.  రుషికేశా!  నన్ను కాపాడు" అని మైమరిచి స్తోత్రం చేయగా.  శ్రీహరి చిరునవ్వు నవ్వి  జ్ఞానసిద్ద! ఈ స్తోత్ర వచనములకు నేను సంతోషించాను. నీకు ఏం వరం కావాలో కోరుకో". అందుచేత జ్ఞాన సిద్ధుడు శ్రీహరి! నేను సంసారబంధమునుండి విముక్తుడిని కాలేకపోతున్నాను. నా ధ్యాస ఎపుడు నీ పాద పద్మములపై ఉండేటట్లు అనుగ్రహించు. మారేది అక్కరలేదు. అలాగే జ్ఞానసిదుడా! నీ కోరిక ప్రకారమే వరమిచ్చాను. మరొక వారము కూడా ప్రసాదిస్తాను అడుగు.  ఈ లోకంలో అనేక మంది దురాచారు  బలహీనుని అనేక పాపకార్యములు చేస్తున్నారు. ఇటువంటి వారు పాపాలు పోగొట్టడానికి ఒక వ్రతమును కల్పిస్తున్నాము. ఈ వ్రతమును సర్వ జనులు ఆచరించవచ్చును. 

       నేను ఆషాఢ శుద్ధ దశమి రోజున లక్ష్మీదేవి సహితముగా పాల సముద్రములో శేషశయ్యపై పావళిస్తాను. తిరిగి కార్తీక మాసంలో శుద్ధ ద్వాదశి రోజున  నిద్ర లేస్తాను. ఈ మధ్యలో వుండే కాలానికి చాతుర్మాస్యం అని పేరు. ఈ కాలంలో చేసే వ్రతము నాకు చాలా ఇష్టమైనది. ఈ వ్రతము చేసే వారికి సకల పాపాలు నశిస్తాయి. వారు నా సన్నిధికి వస్తురు.  ఈ వ్రత మహత్యం తెలుసుకొని ఇతరులచేత కూడా ఆచరింప చేసి చేసేవారికి జన్మ, జరా, వ్యాధుల వలన కలుగు బాధలు పోతాయి. దీని నిమిత్తం ఆషాఢ శుద్ధ దశమి మొదలు శాకములను,  శ్రావణమాసం దశ మొదలు పెరుగును, భాద్రపద మాసం ప్రసన్నమగును పాలను, ఆశ్వయుజ మాసం శుద్ధ దశమి మొదలు పప్పు దినుసులను విసర్జించాలి. నా భక్తులను పరీక్షించటానికి నేనెలా శయనిస్తాను.  ఇప్పుడు నీవు పట్టించిన స్తోత్రాన్ని మూడు సంధ్యలలో భక్తితో పటిస్తే నా సన్నిధికి వస్తారు.  అని శ్రీమన్నారాయణుడు మహామునులకు బోధించే శ్రీమహాలక్ష్మి తో సహా పాల సముద్రంలోకి వెళ్లి పవళించారు.

         వశిష్టుడు జనక మహారాజుతో రాజా! ఈవిధంగా విష్ణుమూర్తి, జ్ఞానసిద్ధి మొదలైన మునులకు చాతుర్మాస్య వ్రత మహత్యం ఉపదేశించారు. నేను నీకు వివరించాను  ఈ వ్రతమును ఆచరించుటకు స్త్రీ పురుష భేదం లేదు. అన్ని జాతుల వారు చేయవచ్చు. శ్రీమన్నారాయణుని ఉపదేశం ప్రకారం ముని పుంగవులు అందరూ ఈ చాతుర్మాస్య వ్రతాన్ని ఆచరించి వైకుంఠానికి వెళ్లారు.





కార్తీక పురాణము 18వ రోజు

సత్కర్మానుష్ఠాన ఫల ప్రభావము



          మునిచంద్ర! మీ దర్శనం వలన ధన్యుడనయను. సందేహాలు తీరేలా జ్ఞాన ఉపదేశం చేసారు. నేటి నుంచి నన్ను మీ శిష్యుడిగా స్వకరించండి. నాకు తల్లి, తండ్రి, గురువు, దైవము మీరే. నా పూర్వ జన్మ పుణ్యము వలన మీ సాంగత్యం లభించింది. లేకపోతే మహా పాపాత్ముడునై అడవిలో చెట్టు మోదుగా పడిఉన్న నేను మీ కరుణ వలనే నాకు మళ్లీ మానవ రూపం లభించింది.  నను మీ శిష్యుడిగా స్వీకరించి సత్కర్మలను మానవులు ఎలా అనుసరించాలి. దాని ఫలితము వివరించేంది అని అడిగారు.  

           ఓ ధనలోభా! నీవు అడిగిన ప్రశ్నలను ఉపయుగకరమైనవే వివరిస్తాను. శ్రద్ధగా విను. ప్రతి మానవుడు ఈ శరీరమే శాశ్వతమని నమ్మి జ్ఞానశూన్యుడవుతున్నాడు. ఈ భేదము శరీరానికే గాని ఆత్మకు లేదు. అట్టి ఆత్మజ్ఞానము కలుగుతానికై సత్కర్మలు చేయాలి అని సకల శాస్త్రాలు గోషిస్తున్నాయి. సత్కర్మలు ఆచరించి వాటి ఫలితములు పరమేశ్వరునికి అర్పించిన జ్ఞానము కలుగుతుంది. మానవుడు ఏ జాతివాడో, అటువంటి కర్మలు తెలుసుకొని ఆచరించాలి. బ్రాహ్మణుడు అరుణోదయ స్నానము చేయక, సత్కర్మలు ఆచారించిన అవి వ్యర్ధము అవుతాయి. అటులనే కార్తీకమాసమందు సూర్యభగవానుడు తులారాశిలో ప్రవేశించుచుండగాను, వైశాఖంలో సూర్యుడు మేషరాశిలో ప్రవేశించుచుండగాను, మాఘమాసములో సూర్యుడు మకరరాశిలో ప్రవేశించును. ఈ మూడు మాసములలో తప్పకుండా దగ్గరలో ఉన్న నదిలో ప్రాతఃకాలంలో స్నానము చేయాలి. అలాగా స్నానము అచరించి దేవతార్చన చేసిన తప్పకుండా వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. సూర్యచంద్ర గ్రహణ సమయములందు తదితర పుణ్యదినములయందు, ప్రాతఃకాలమున స్నానమాచరించి సంధ్యావందనము సూర్యనమస్కారాలు చేయాలి. కార్తీక మాసములో అరుణోదయ స్నానమాచరించిన వారికీ చతుర్వేద పురుషార్ధాలు సిద్ధిస్తాయి. కార్తీక మాసముతో సమానమైన మాసం, వేదములతో సరితూగు శాస్త్రము, గంగ గోదావరి నదులకి సమానమైన తీర్ధములు, ధర్మముతో సమానమైన మిత్రుడు లేదు అని తెలుసుకో. కార్తీక మాసంలో యధావిధిగా స్నానం ఆచరించిన వారు కోటి యాగములు చేసిన ఫలితము పొంది వైకుంఠానికి వెళతారు.  అని అంగీరసుడు చెప్పగా ధనలోభుడు ఇలా ప్రశ్నించారు. 

       ఓ ముని శ్రేష్టా! చాతుర్మాస వ్రతం అని చెప్పారు కదా? ఏ కారణం చేత దానిని ఆచరించాలి? ఇది వరకు ఎవరైనా ఈ వ్రతమును ఆచరించారా? ఆ వ్రతము చేయటం వలన ఫలితమేమి? వ్రత విధానం ఎలా చేయాలి? వివరంగా వివరించండి? అని కోరాడు. అంగీరసుడు ఇలా చెప్పసాగారు. 

         ధనలోభా! విను. చాతుర్మాస్య వ్రతం అనగా శ్రీ మహావిష్ణువు మహాలక్ష్మితో ఆషాడ మాసం శుద్ధ ఏకాదశి రోజునా  పాల సముద్రంలో శేషుని పాన్పు పై శయనించి కార్తీక శుద్ధ ఏకాదశినాడు నిద్ర లేస్తారు. ఈ నాలుగు మాసాలు చతుర్మాస్యమని పేరు. ఆషాడ శుద్ధ ఏకాదశిని శయన ఏకాదశి అని, కార్తీక శుద్ధ ఏకాదశి ఉత్థాన ఏకాదశి అని, ఈ వ్రతమునకు చాతుర్మాస్య వ్రతమని పేర్లు ఉన్నాయి.  ఈ నాలుగు మాసాలు శ్రీహరి ప్రీతికొరకు స్నాన, దాన, జప, తపాలు వంటి సత్కార్యాలు చేస్తే పూర్ణఫలము కలుగుతుంది.  ఈ విషయం శ్రీ మహా విష్ణువు వలన తెలుసుకున్నాను, ఆ విషయాలు నీకు తెలియజేస్తాను.

           తొలి కృతయుగంలో వైకుంఠం నందు గరుడ గంధర్వాది దేవతలచేత, వేదములచేత,  సేవించుచుతున్న శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి సమేతుడై సింహాసనమున కూర్చొని ఉండగా  ఆ సమయంలో నారదమహర్షి వచ్చి శ్రీమన్నారాయణ గారికి నమస్కరించి నిలబడి ఉన్నాడు. శ్రీహరి నారదునితో నారద!నీవు క్షేమమే కదా! త్రిలోక సంచారివైన నీకు తెలియని విషయములు లేవు. మహా మునుల సత్కర్మలు విజ్ఞములు లేకుండా సాగుతున్నాయి. మానవులందరూ వారికి విధించిన ధర్మాలను పాటిస్తున్నారా. ప్రపంచంలో అరిష్టాలు లేకుండా ఉన్నాయి కదా? అని కుశల ప్రశ్నలు అడిగారు. నారదుడు శ్రీహరికి ఆదిలక్ష్మికి నమస్కరించి "ఓ దేవా! ఈ జన్మలో నీకు తెలియని విషయాలు ఏమైనా ఉన్నాయా. ప్రపంచంలో కొందరు మనుషులు మునులు కూడా తమకు విధించిన కర్మలను నిర్వర్తించడం లేదు. వాళ్ళు ఎట్లా విముక్తులవుతారో తెలియట్లేదు. కొందరు భుజించ కోరండి పదార్థాలు పూజిస్తున్నారు. కొందరు పుణ్యవ్రతాలను ఆచరిస్తూ అవి పూర్తికాకుండానే మధ్యలో ఆపేస్తున్నారు. కొందరు సదాచారాలుగా, మరికొందరు అహంకారులుగా, పరనింద చేస్తూ జీవిస్తున్నారు. అట్టి వారిని సంతృప్తి పుణ్యాత్ములను చేసే రక్షించమని ప్రార్థించారు. శ్రీమన్నారాయణుడు కలవరపడి లక్ష్మీదేవితో పాటు గరుడ గంధర్వాది దేవతలతో వేలకొలది ఋషులతో భూలోకానికి వచ్చి బ్రాహ్మణ రూపంలో ఒంటరిగా తిరుగుతున్నారు.

           శ్రీమన్నారాయణుడు ముసలి బ్రాహ్మణ రూపంలో సమస్త ప్రాణులను పరీక్షిస్తూ  పుణ్యక్షేత్రాలు, పుణ్యనదులు, పుణ్యఆశ్రమాలు తిరుగుతున్నారు. ఈ విధంగా తిరుగుతున్న భగవంతుడిని చూసి కొందరు ముసలివాడు అని ఎగతాళి చేశారు. మరి కొందరు ఈ ముసలి వాని తో మనకేంటి పని ఊరుకున్నారు. కొందరు గర్వంతో ఉన్నారు. మరికొందరు శ్రీహరిని కనీసం కన్నెత్తి అయినా చూడలేదు. ఇది అంత చుసిన శ్రీ మహా విష్ణువు "వీళ్ళందరి ఎలా తరింపచేయాలి" అని ఆలోచిస్తున్నారు. శ్రీ మహావిష్ణువు ముసలి బ్రాహ్మణ రూపాన్ని వదలి తన నిజరూపం ధరించి శ్రీ మహాలక్ష్మితో భక్తులతో మునులకు ప్రీతికరమైన నైమిశారణ్యానికి వెళ్లారు.

         ఆ వనమందు తపస్సు చేసుకొంటున్న మునులు స్వయంగా తమ ఆశ్రమానికి శ్రీమన్నారాయణుడు వచ్చినందుకు భక్తి శ్రద్ధలతో నమస్కరించి ఇలా స్తోత్రం చేశారు. 

శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం!

విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం!

లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్ధ్యానగమ్యం!

వందే విష్ణుం భవ భయ హరం సర్వ లోకైక నాథం!

     ఇంకా ఉంది ………………

        

కార్తీక పురాణము 17వ రోజు

అంగీరసుడు ధనలోభునకు చేసిన తత్త్వపదేశము 

         ధనలోభి! నీకు కలిగిన సంశయములకు సమాధానం చెపుతాను విను. కర్మవలన ఆత్మ వివిధ శరీరాలను ధరించాల్సి వస్తుంది. కనుక శరీర ధారణకు కర్మ కారణమవుతుంది. శరీరాని ధరించటం వలన ఆత్మ కర్మను చేస్తుంది.  కనుక కర్మ చేయటానికి శరీరమే కారణమవుతుంది. స్థూల, సూక్ష్మ శరీర సంబంధం వలన ఆత్మకు కర్మ సంబంధం ఏర్పడుతుంది అని మాత పార్వతికి పరమేశ్వరుడు వివరించెను. దానిని మీకు నేను వివరిస్తాను. ఆత్మ అనగా ఈ శరీరాన్ని ధారణ చేసుకొని వ్యవహరించేది. అని అగిరసుడు చెప్పగా........ 

          ఓ మునిచంధ్రా! నేనింతవరకు ఈ శరీరమే ఆత్మ అని భావిస్తున్నాను. నాకు ఇంకా వివరంగా చెప్పబడిన వాక్యార్ధమునకు పాదార్థాజ్ఞానము కారణమవుతుంది. కనుక 'అహంబ్రహ్మ'యను వాక్యార్ధమును గురించి నాకు తెలియచేయండి అని ధనలోభుడు కోరుకున్నాడు. 

         ధనలోభా! ఈ శరీరము అంతఃకరణ వృత్తికి సాక్షి. 'నేను-నాది' అని చెప్పబడే జీవాత్మయే 'అహం' అను శబ్దము. సర్వాంర్యామియై పరమాత్మ 'నః'అను శబ్దము, ఆత్మ ఘటాదుల వాలె శరీరానికి అర్ధములేదు. ఆ ఆత్మ సచిదానందా స్వరూపము, బుద్ధి, సాక్షి జ్ఞానరూపమగు శరీర ఇంద్రియాలు మొదలగు వ్యాపకుమలయందు ప్రసరించేలాచేసి వాటి అన్నిటి కంటే వేరుగా ఉన్నదై ఎల్లపుడు ఒకే రీతిన ప్రకాశిస్తూ ఉండేది ఆత్మ. నేను అనేది శరీర ఇంద్రియాలలో ఒకటి కాదు అని తెలుసుకో. ఈ ఇంద్రియాలన్నిటిని ఏదీ ప్రకాశించేలా చేస్తుందో అదే 'నేను' అని తెలుసుకో. అందువలన అశాశ్వతమయిన శరీర ఇంద్రియాలు కూడా నామరూపము నశిస్తాయేగాని, ఇటువంటి దేహమునకు జాగ్రత్స్వప్న సుషుప్త్యవస్థలు స్థూల సూక్ష్మకార శరీరములను మూడింటిని "నేను" "నాది" అను వ్యవహరించేదే ఆత్మ అని గ్రహించు. 



             ఇనుము సూదంటు రాయిని అంటిపెట్టుకొని తిరుగునటే  శరీరం, ఇంద్రియాలు కూడా ఆత్మను అంటిపెట్టుకొని తిరుగుతాయి. అలాగే అవి ఆత్మవలన తమ పనిని చేస్తాయి. నిద్రలో శరీర ఇంద్రియాల సంబంధం లేక గాఢనిద్ర పోయి, నిద్రలేచిన తరువాత నేను సుఖముగా నిద్రపోయాను, సుఖముగా ఉన్నాను అని అనుకొనేదే ఆత్మ. 

         దీపము గాజుబుడ్డిలో ఉంది గాజును ఎలా ప్రకాశించేలా చేస్తుందో అలాగే ఆత్మ కూడా శరీర ఇంద్రయాలను ప్రశించేలాచేస్తుంది. ఆత్మ పరమాత్మ స్వరూపమవటం వలన దానికి ధారా పుత్రాదులు ఇష్టమవుతున్నాయి. అటువంటి విశేష ప్రేమస్పందన కలిగి ఉందొ అదే పరమాత్మ అని గ్రహించు. తత్త్వమసి అను పదము జీవాత్మ పరమాత్మ ఐక్యతను బోధిస్తుంది. ఈ విధముగా సర్వజ్ఞత్వాది ధర్మములను వదిలివేయగా పరమాత్మ స్వరూపము ఒకటే నిలుస్తుంది. శరీరము లక్షణములు-ఉండటం-జన్మించటం-పెరగటం-క్షిణించటం-చనిపోవటం మొదలగు ఆరు భాగాలూ శరీరానికే కానీ ఆత్మకు లేవు. పరమాత్మ స్వరూపమే పూర్ణత్వము గలది. వేదములలో దేనిని సర్వజ్ఞత్వము, ఉపదేశము, సంపూర్ణత్వము నిరూపించబడియున్నదో అదియే 'ఆత్మ'. ఒక కుండను చూసి ఏ విధముగా మట్టితో చేసింది అనుకుంటామో అదేవిధముగా శరీరములో ఉన్న ఆత్మ పరమాత్మ అని తెలుసుకో. 

          జీవుల కర్మఫలం అనుభావుంచేలా చేసేవాడు పరమేశ్వరుడు, జీవుల కర్మఫల అనుభవిస్తారో తెలుసుకో. అందువలన మానవుడు గుణసంపత్తుగలవాడై గురుశుశ్రూష చేసేవారు సంసార సంబంధములు ఆశలన్నీ విడచి విముక్తి కలుగుతుంది. మంచిపనులు తలచిన చిత్తశుద్దియు, దానివలన భక్తిజ్ఞాన వైరాగ్యములు కలిగి ముక్తి పొందుతారు. అందువలన సత్కర్మనుస్టనము చేయవలెను. మంచిపనులు చేసిన కానీ ముక్తి లభించదు. అని అంగీరసుడు చెప్పగా ధనలోభుడు నమస్కరించి ఇలా అన్నాడు. 

     ఇంకాఉంది...……………………

కార్తీక పురాణము 15వ రోజు

దీపం వెలిగించటం వలన ఎలుక పూర్వజన్మ స్మృతితో మానవరూపము పొందుట

15వ అధ్యాయము 

ఓ జనకమహారాజా!  కార్తీక మాసము నెలరోజులు చేయలేనివారు  కార్తీక శుద్ధ త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి రోజుల్లో అయినా నిష్టతో పూజలు చేసి ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి.  కార్తీక మాసంలో ఆవు పాలు పితికినంతసేపు మాత్రము దీపం ఉంచిన మరుజన్మలో బ్రాహ్మణుడిగా జన్మిస్తారు.  ఇతరలు ఉంచిన ఆరిపోతున్న దీపంని వృత్తి చేసినా,  ఆరిన దీపాన్ని మళ్ళీ వెలిగించిన పాపాలు హరిస్తాయి.  ఇందుకు ఒక ఇతిహాసం ఉంది  వినుమని  వశిష్ఠులవారు ఇలా చెప్పసాగారు. 



             పూర్వము సరస్వతి నది తీరమున  శిధిలమైన దేవాలయం ఒకటి ఉంది. కర్మనిష్ఠుడనే యోగి  ఆ దేవాలయం దగ్గరకు వచ్చి కార్తీకమాసం అంతా అక్కడే ఉండి పురాణపఠనము చేయాలని అనుకొని ఆపాడుబడిన దేవాలయాన్ని శుభ్రంగా ఊడ్చి నీళ్ళతో కడిగి బొట్లు పెట్టి పక్కన ఉన్న గ్రామంకి వెళ్లి ప్రమిదలు తెచ్చి దూదితో వత్తులు చేసి ఆవు నెయ్యితో దీపాలు వెలిగించి స్వామిని పూజించి పురాణపఠనము చేస్తున్నారు.  కార్తీకమాసం మొదలైనప్పటి నుంచి చేస్తున్నారు.  ఒకరోజు ఎలుక  దేవాలయం లోకి ప్రవేశించి నాలుగువైపులా తిరిగి ఏమీ దొరకక  అక్కడ ఆరిపోయిన వత్తిని తినాలని అనుకొని నోటికి కరచుకుని వెళుతుండగా అక్కడ పక్కన వెలుగుతున్న దీపానికి ఈ వత్తి కూడా అంటుకొని వెలిగింది. అది కార్తీక మాసం అవటం వలన అ ఎలుక పాపములు నశించి ఎలుక రూపము నుంచి మానవరూపానికి వచ్చింది.  ధ్యాననిష్ఠలో ఉన్న యోగిపుంగవుడు తన కళ్ళు తెరచి చూడగా అక్కడ నిలిబడిఉన్న మానవుడిని గమనించి "నువ్వు ఎవరు? ఎందుకు ఇక్కడ నుంచున్నావు? అని ప్రశ్నించగా "ఆర్య! మునివర్యా నేను ఒక ఎలుకను రాత్రి నేను ఆహారము వెదుకుకొంటూ ఈ దేవాలయాములోకి వచ్చి ఇక్కడ కూడా ఏమి దొరకక నెయ్యి వాసనా వస్తున్న వత్తిని తినటానికి తీసుకువెళుతుండగా నా అదృష్టం కొద్దీ ఆ వత్తి వెలగటం వలన నా పాపములు పోయి నాకు మానవరూపం వచ్చింది. ఓ మహానుభావా! నేను ఎందుకు ఈ ఎలుక జన్మమము ఎత్తవలసి వచ్చింది. దానికి గల కారణం ఏమిటో వివరించండి"  అని కోరాడు.  అపుడు ఆ ముని దివ్యదృష్టిచే సర్వస్వము తెలుసుకొని "ఓయి! నువ్వు పూర్యజన్మలో ఒక బ్రాహ్మణుడవు.  కానీ నిన్ను బాహ్లికుడు అని పిలిచేవారు.  నీ కుటుంబాన్ని పోషించటానికి వ్యవసాయము చేస్తూండేవాడివి.  ధనముపై ఆశతో దేవపూ,జలు నిత్యకర్మలు మరచి నీచుల సహవాసము వలన నిషిద్ధ పదార్ధములు తినటం వలన మంచివారాలను, యోగ్యులను నిందించుచు పరులచెంత స్వార్ధచింత గలవాడై ఆడపిల్లలను అమ్మువృతిని చేస్తూ, దాని వలన సంపాదించిన ధనాన్ని కూడబెట్టుకొని, సమస్థ తినుబండారాలను కారుచౌకగా కొని తిరిగి వాటిని ఎక్కువ ధనానికి నీవు అనుభవించక ఇతరులకు ఇవ్వక ఆ ధనమును భూస్థాపితం చేసి పిసినారివై జీవవించావు. మరణించిన తరువాత ఎలుక జన్మమెత్తి వెనుకటి జన్మ పాపములు అనుభవిస్తునావు. నేడు భగవంతుని దగర ఆరిన దీపాన్ని వెలిగించినందువలన పుణ్యాత్ముడవు అయ్యావు. దానివలన నీకు తిరిగి పూర్వజన్మ ప్రాప్తించింది. కనుక నువ్వు నీ గ్రామానికి వెళ్లి ని పెరడులో నువ్వు దాచిన ధనాన్ని త్రవ్వి, ఆ ధనంతో దానధర్మాలు చేసి భగవంతుని ప్రార్థించికొని మోక్షము పొందుతావు" అని అతనికి హితబోధ చేసారు.

కార్తీక పురాణము 13వ రోజు

కన్యాదానఫలము 

13వ అధ్యాయము 

          ఓ జనకమహారాజా! కార్తీకమాసములో ఆచరించవలసిన ధర్మాలు చాలఉన్నాయి. 

             కార్తీకమాసములో నదీస్నానము ముఖ్యమైనది.  దానికంటే ఒక పేద బ్రాహ్మణ కుమారునికి ఉపనయనం చేయించుట ముఖ్యము.  ఒకవేళ ఉపనయమునకు అగు ఖర్చులు భరించాలేనివారు మంత్రాక్షతలు, దక్షిణ తాంబూలాది సంభవనాలతో తృప్తి పరచునను ఫలము కలుగును.  ఈ విధముగా ఒక పేద బ్రాహ్మణ బాలునికి ఉపనయనము చేసిన యెడల ఎంతటి మహాపాపములు అయినా నశిస్తాయి. అంతకన్నా ముఖ్యమైనది కన్యాదానము.  కార్తీక మాసమందు భక్తిశ్రద్ధలతో కన్యాదానము చేసిన తాను తరించుటమే కాక తన పితృదేవతలు కూడా తరింపజేసినవారవుతారు. ఇందుకు ఒక ఇతిహాసము ఉన్నది. 



        సువీర చరిత్రము 

          ద్వాపరయుగములో వంగదేశములో గొసువీర చరిత్రము ప్ప పరాక్రమవంతుడు, సురుడు అయినా సువిరుడు అను ఒక రాజు ఉండేవాడు.  అతనికి రూపవతి అను భార్య ఉన్నది. ఒకసారి సువీరుడు శత్రురాజులచే ఓడించబడినవాడయి, భార్యతో అరణ్యమునకు పారిపోయి ధనహీనుడయి నర్మదా నదీతీరమున ఒక పర్ణశాలను నిర్మించుకొని కందమూల ఫలాదులను భుజిస్తూ కాలము గడుపుతున్నారు. కొన్ని రోజులకు వారికీ ఒక బాలిక జన్మించింది.  ఆ బిడ్డను అతి గారాబముతో పెంచారు. కొంతకాలానికి ఆమెకు వివాహ వయస్సు వచ్చింది. ఒకరోజు వానప్రస్థుని కుమారుడు ఆమెను వివాహం చేసుకోవాలని ఆ రాజుని కోరతాడు. అందుకు ఆ రాజు "ఓ మునిపుత్ర! ప్రస్తుతము మేము బీదస్థితిలోఉన్నాము. అష్టదరిద్రములు అనుభవిస్తున్నాము. మా కష్టములు పోవటానికి కొంతధనము ఇచ్చిన నా  కుమార్తెను ఇచ్చి వివాహం చేస్తాను"  అని చెప్పాడు.  ఆ ముని కుమారుని దగ్గర ధనము లేకపోయేసరికి  నర్మదా తీరమున కుబేరుని గురించి ఘోర తపస్సు ఆచరించి కుబేరుని మెప్పించి సంపాదించారు.  రాజు ఆ పాత్రను తీసుకొని సంతోషించి తన కుమార్తెను ఇచ్చి వివాహం చేసి నవ దంపతులను అత్తవారింటికి పంపించారు. 

             ముని కుమారుడు భార్యను వెంటబెట్టుకొని వెళ్లి తల్లిదండ్రులకు నమస్కరించి అంతవరకు జరిగినదంతా చెప్పి తన భార్యతో సుఖంగా జీవిస్తున్నారు.  వీరుడు మన కుమార్ రెడ్డి జన తన పాత్రను తీసుకుని స్వేచ్ఛగా ఖర్చు పెడుతూ భార్యతో సుఖముగా జీవించారు. అలా కొంతకాలం జరిగిన తర్వాత ఆ రాజు భార్య మరొక బాలికకు జన్మనిచ్చింది.  నా బిడ్డకు కూడా యుక్త వయస్సు  రాగానే మళ్ళీ ధనానికి అమ్మాలని ఎదురుచూస్తున్నారు. 

               ఒకరోజు ఒక సాధు పుంగవుడు తపతీ నది తీరం నుండి నర్మదా నది తీరాన స్నానార్ధమై వచ్చి దారిలో ఉన్న సువీరుడిని కలుసుకొని "నువ్వు ఎవరు? నీ మొఖవర్చస్సు  చూస్తే రాజు అంశమున జన్మించినవాడై ఉన్నావు.  నువ్వు ఈ అరణ్యంలో ఏం చేస్తున్నావు?" అని ప్రశ్నించగా, సువీరుడు "మహానుభావా! నేను వంగదేశంను ఏలు సువీరుడు అను రాజును.  నా రాజ్యమును శత్రురాజులు ఆక్రమించుటవలన భార్యాసమేతముగా ఈ అరణ్యములో జీవిస్తున్నాను.  నాకు ఇద్దరు కుమార్తెలు. మొదటికుమార్తెను ఒక మునికుమారునికిఛ్చి వానివద్ద కొంత ధనమును తీసుకొని వారికీ వివాహం చేశాను.  ఇప్పటివరకు ఆ ధనముతోనే కాలక్షేపము చేస్తున్నాను" అని చెప్పాడు. అందుకు ఆ మునిపుంగవుడు  "ఓ రాజా! నీవు ఎంత దరిద్రుడైన ధర్మసూక్ష్మములు ఆలోచించకుండా కన్యను అముకొన్నావా.   కన్య అమ్ముకుంటూ మహాపాపం.  కన్యను అమ్మినవారు "అసిపత్రవన" అను నారకము అనుభవిస్తారు.  ఆ ధనముతో దేవునికి గాని  పితృదేవతలకు గాని వ్రతము చేసిన వారు నశిస్తారు.  కన్యను అమ్మినవారికి పితృదేవతలు పుత్రసంతతి లేకుండా శపిస్తారు.  కన్యను కొన్న వారికి కూడ గృహస్థ ధర్మాలు వ్యర్ధము అయి నరకము అనుభవిస్తారు.  కనుక రాబోయే కార్తీకమాసంలో నీ రెండవ కుమార్తెను నీ శక్తి కొలదీ బంగారు ఆభరణములతో అలంకరించి ధర్మబుద్ధి కలవానికి సదాచార సంపన్న కన్యను దానం చేయి.  అలా చేస్తే గంగాస్నానం చేసినంత ఫలము అశ్వమేధయాగం చేసినంత ఫలము పొందుతావు. మొదటి కన్యను అమ్మిన పాపము పోతుంది"  అన్ని రాజకీయ హితబోధ చేశారు.  అందుకు రాజు చిరునవ్వు నవ్వి "ఓ  మునివర్యా!  దేహ సుఖము వాళ్ళకంటే దానధర్మాలు వలన వచ్చిన ఫలములు ఎక్కువ? తాను బ్రతికిఉండగా భార్యాపిల్లలతో  దాన ధర్మాలతో సిరిసంపదలతో తను సుఖంగా ఉండక చనిపోయిన తర్వాత వచ్చే మోక్షము కొరకు ప్రస్తుతం అవకాశం జారవిడుచుకుంటారా? ధనము బంగారము కలవారు ప్రస్తుతం ఈ లోకంలో రాణించగలరు గుర్తింపును పొందగలరు.  నా రెండవ కుమార్తెను కూడా నేను అడిగిన అంత ధనం ఇచ్చిన వారికి వివాహం చేస్తాను కానీ నేను మాత్రం కన్యను దానం చేయను" అని నిక్కచ్చిగా చెప్పేను.  ఆ మాటలకు సన్యాసి ఆశ్చర్యపడి తన దారిన తాను వెళ్ళిపోయాడు.

         కొన్ని రోజులకు సువీరుడు మరణించాడు. వెంటనే యమభటులు వచ్చి వానిని తీసుకుపోయి యమలోకంలో  అసిపత్రవనమును నరక భాగమున పడవేశారు. అక్కడ  అనేక రకాలుగా నరక బాధలు అనుభవస్తునాడు. సువురుడి పూర్వికులు అయిన శ్రుతకీర్తి అని రాజు  ధర్మమును ఆచరిస్తూ ప్రజలను పాలించి ధర్మాత్ముడైన మరణించిన తరువాత  స్వర్గములో సర్వ సుఖాలు అనుభవిస్తున్నారు. సువీరుడు చేసిన కన్య విక్రయం వలన శ్రుతకీర్తి నీక్కూడా బంధించి యమకింకరులు స్వర్గం నుంచి నరకానికి తీసుకువచ్చారు.

             అప్పుడు శృతకీర్తి యమధర్మరాజుకి నమస్కరించి "ప్రభు! మీరు సర్వజ్ఞుడవు, ధర్మమూర్తివి, బుద్ధిశాలివి, ప్రాణులను సమానంగా చూస్తున్నావు. నేను ఏ పాపం చేయలేదు. నన్ను స్వర్గలోకము నుండి నరకానికి ఎందుకు తీసుకు వచ్చారు. కారణం చెప్పండి స్వామి" అని ప్రదించాడు.  యమధర్మరాజు శృతకీర్తి తో "రాజా! నువ్వు న్యాయమూర్తవి, ధర్మాత్ముడివి. నీవు ఎటువంటి పాపములు చేయలేదు.  నీ వంశమున సువీరుడు అను రాజు తన మొదటి కుమార్తెను ధనముపై ఆశతో అముకొన్నాడు.కన్యను అమ్ముకొనా వారి పూర్వికులు ఇటు మూడు తారలు అటు మూడు తారలు వారు ఎంత పుణ్యపురుషులు అయినా నరకమున బాధలు అనుభవిస్తారు.  నువ్వు ధర్మమూర్తి కనుక నీకు నేను ఒక ఉపాయం చెప్తాను.  నీ వంశమున సువీరుడికి ఇంకొక కుమార్తె ఉన్నది. ఆమె నర్మదా నది తీరంలో తన తల్లి వద్ద పెరుగుతుంది. నా ఆశీర్వాదంతో నువ్వు మానవ శరీరం ధరించి ఆమె తల్లి వద్దకు వెళ్లి ఆ కన్యను వేద పండితుడు శీలవంతుడైన ఒక బ్రాహ్మణునకు కార్తీకమాసమున సాలంకృత కన్యాదానం చేయించు. అలా చేస్తే నువ్వు నీ పూర్వికులు సువీరుడు కూడా స్వర్గలోకానికి వెళ్తారు. కార్తీక మాసంలో సాలంకృత కన్యాదానం చేసినవారు మహా పుణ్యాత్ములు అవుతారు.  నువ్వు వెంటనే భూలోకానికి వెళ్ళి నేను చెప్పిన విధంగానే ధర్మకార్యములు చేశారా" అని పలికాడు.

                 శృతకీర్తి యమధర్మ రాజుకు నమస్కరించి సెలవు తీసుకుని నర్మదా నది తీరం అన్నపూర్ణ కుటీరంలో నివసిస్తున్న సువీరుని భార్యను కుమార్తెను చూసి సంతోషపడి  అతను వచ్చిన విషయం చెప్పి కార్తీక మాసంలో సువీరుని రెండవ కుమార్తెను చతుర్వేదాలు చదివిన ఒక బ్రాహ్మణ యువకునికి కన్యాదానము చేసారు. అలా కన్యాదానం చేయటం వలన సువీరుడు కూడా  పాపము పోయి స్వర్గమునకు వెళ్ళాడు.

          కన్యాదానం వలన మహా పాపములు పోతాయి. వివాహ విషయంలో వారికి మాట సాయం చేసిన పుణ్యం కలుగుతుంది. కార్తీకమాసంలో కన్యాదానము చేయాలని దీక్షగా పెట్టుకొని ఆచరించే వారు విష్ణు సాన్నిధ్యం పొందుతారు.

కార్తీక పురాణము 12వ రోజు

                                              ద్వాదశీ ప్రశంస

12వ అధ్యాయము

               "మహారాజా! కార్తీకమాసమున కార్తీక సోమవారం, కార్తీక ద్వాదశి వ్రతము గురించి సాలగ్రామ మహిమల గురించి వివరిస్తాను విను"  వశిష్ట మహాముని ఈ విధంగా వివరిస్తున్నారు. 

               కార్తీక శుద్ధ ద్వాదశి నాడు పూర్ణ ఉపవాసం ఉండి ఆ రాత్రి విష్ణు ఆలయానికి వెళ్లి శ్రీహరిని మనసారా ధ్యానించి శ్రీహరి సన్నిధిలో పురాణ కాలక్షేపం చేసి మరునాడు బ్రాహ్మణ సమారాధన చేసిన  కోటి యజ్ఞముల ఫలితము కలుగుతుంది.  కార్తీక శుద్ధ ద్వాదశి నాడు శ్రీమన్నారాయణ శేష పానుపు నుండి లెగుస్తాడు గనుక కార్తీక శుద్ధ ద్వాదశి వ్రతం  శ్రీమన్నారాయణునికి ఇష్టం.  ఆ రోజున శ్రీమంతులెవరైనా ఆవు కొమ్ములకు బంగారు తొడుగులు తగిలించి ఆవు కాళ్ళకు వెండి డెక్కలు తగిలించి దూడతో సహా బ్రాహ్మణునకు దానమిచ్చి ఆ అవుకు ఎన్ని రోమాలు ఉన్నాయో అన్ని సంవత్సరాలు  ఇంద్రలోకంలో స్వర్గసుఖాలను అనుభవిస్తారు. కార్తీక మాసంలో వస్త్రదానం గొప్ప ఫలితాన్ని ఇస్తుంది.  కార్తీక శుద్ధ  పాడ్యమి రోజున, కార్తీక పౌర్ణమి రోజున కంచుపాత్రలో ఆవునెయ్యి పోసి దీపం ఉంచిన వారి పూర్వజన్మలో చేసిన పాపాలు హరిస్తాయి.  కార్తీక ద్వాదశినాడు యజ్ఞోపవీతమును దక్షిణతో బ్రాహ్మణులకు దానమిచ్చి పొందగలుగుతారు. కార్తీక ద్వాదశి రోజున బంగారు తులసి చెట్టును గాని సాలగ్రామములను ఒక బ్రాహ్మణునకు దానమిచ్చిన నాలుగు సముద్రాల మధ్య నున్న భూమిని దానమిచ్చిన ఫలితము కలుగుతుంది. దీనికి ఉదాహరణగా ఒక కథ ఉంది శ్రద్ధగా ఆలకించి మహారాజా.

సాలగ్రామ దాన మహిమ



              పూర్వ అఖండ గోదావరి నదితీరమునా ఒక పల్లెటూరిలో ఒక వైశ్యుడు నివసిస్తుండేవాడు.  అతను అత్యంత దురాశా పరుడై  నిత్యం ధనమును కూడా పెడుతూ తాను అనుభవించకుండా, ఇతరులకు పెట్టకుండా,  పేదవాళ్లకు దానధర్మాలు చేయకుండా, ఏప్పుడు పరులను నిందిస్తూ తానే గొప్ప శ్రీమంతుడుగా విర్రవీగుతూ  పరుల ధన్నాని ఎలా అపహరించాలి అనే ఆలోచనతో కాలం గడుపుతూ ఉండేవాడు.

            అతడు ఒకనాడు తన గ్రామమునకు సమీపంలో ఉన్న పల్లెలో నివసిస్తున్న ఒక బ్రాహ్మణునకు తన వద్ద ఉన్న ధనమును పెద్ద వడ్డీకి అప్పు ఇచ్చాడు. మరికొంత కాలానికి  సొమ్మును తనకిమ్మని అప్పుడు ఆ బ్రాహ్మణుడు " అయ్యా!  చేయవలసిన ధన్నాని నెల రోజుల గడువులో ఇస్తాను. నీ రుణము ఉంచుకోను.  ఆ మాటలకు వైశ్యునికి కోపం వచ్చి " అలా వీలు లేదు. నా సొమ్ము నాకు ఇప్పుడే ఇవ్వాలి. లేకపోతే నీ కంఠమును నరికి వేస్తాను" అని ఆవేశముతో ముందువెనుక ఆలోచించకుండా తన మొలకి ఉన్న కత్తితో ఆ బ్రాహ్మణుని కంఠమును నరికేశాడు. వెంటనే ఆ బ్రాహ్మణుడు మరణించాడు. ఆ వైశ్యుడు భయపడి అక్కడే ఉంటే రాజభటులు బంధిస్తారో అని తన గ్రామానికి పారిపోయాడు. బ్రాహ్మణుడిని హత్యా చేయటం వలన బ్రహ్మహత్య మహాపాపం చుట్టుకొని కుష్టివ్యాధి వచ్చి నానా భాదలు అనుభవిస్తూ కొన్నాళ్ళకు మరణించాడు. వెంటనే యమాదూతలు అతనిని తీసుకొని పోయి రౌరవాది నరక కూపముల పడవేశారు.

           ఆ వైశ్యునికి ఒక కుమారుడు ఉన్నాడు. అతని పేరు ధర్మవీరుడు.  ఆ పేరుకు తగినట్లుగానే తండ్రి సంపాదించిన ధనమును దానధర్మాలు చేస్తూ పుణ్యకార్యాలు ఆచరిస్తూ  మంచి కీర్తి సంపాదించాడు. కొంతకాలానికి త్రిలోకసంచారి అయినా నారదులవారు యమలోకమును దర్శించి భూలోకానికి వచ్చి, దారిలో ధర్మవీరుని ఇంటికి వెళ్లరు. ధర్మవీరుడు నారదులవారికి సాష్టాగానమస్కరం చేసి విష్ణుదేవునిగా భావించి ఆర్ఘ్యపాద్యములు చేత సత్కరించి, చేతులు జోడించి "మహానుభావా! నా పుణ్యము వలన నేడు తమ దర్శనం లభించింది. నేను ధన్యుడను. నా జన్మతరించింది. శక్తీ కొద్దీ నేను చేసే సత్కార్యమును స్వీకరించి తమరు వచ్చిన కార్యమును వివరించండి" అని వేడుకొన్నాడు. నారదులవారు చిరునవ్వు నవ్వి " ధర్మవీరా! నేను నీకొక హితవు చెప్పాలని వచ్చాను.  శ్రీమహావిష్ణువునకు కార్తీక మాసంలో శుద్ధద్వాదశి మహా ప్రీతికరమైన రోజు.  ఆరోజు స్నాన దాన జపాలు చేసిన అత్యంత ఫలితం కలుగుతుంది.  కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సూర్యుడు తులారాశి యందు వుండగా నిష్టగా ఉపవాసం ఉండి సాలగ్రామ దానము చేసిన  పూర్వ జన్మల యందు ఈ జన్మలలో చేసిన పాపములు పోతాయి. నీ తండ్రి యమలోకములో మహా నరకం అనుభవిస్తున్నాడు. నీ తండ్రిని ఉద్ధరించటానికి నువ్వు సాలగ్రామ దానం చేయక తప్పదు.  అలా చేసి నీ తండ్రి రుణం తీర్చుకో" అని చెప్పారు. ధర్మవీరుడు " నారద మునివర్యా!  నేను గోదానము, భూదానము, హిరణ్యదానము  మొదలగు  మహా దానములు చేశాను.  అటువంటి దానాలు చేసినా నా తండ్రికి మోక్షం కలగలేదు కానీ సాలగ్రామ దానం చేసినంత మాత్రాన ఆయనకు ఎలా ఉద్దరించబడతారు" అని సంశయం కలిగింది. నేను ఎందుకు దానం చేయాలి. నేను సాలగ్రామ దానం మాత్రం చేయను అని నిష్కర్షగా మాట్లాడాడు.

                  ధర్మ వీరుని అవివేకానికి విచారించిన నారదులవారు "వైశ్యుడు! సాలగ్రామము శిల అనే ఆలోచిస్తున్నావు. కానీ అది శిలా కాదు. శ్రీహరి యొక్క రూపము.  అన్ని దానాల కంటే సాలగ్రామ దానము చేస్తే గొప్ప ఫలితం దక్కుతుంది.  మీ తండ్రి నరక బాధల నుండి విముక్తి కలిగించడానికి ఈ దానం తప్ప వేరొక మార్గము లేదు అని చెప్పి నారదుల వారు వెళ్ళిపోయారు.

                  ధర్మవీరుడు ధనబలం కలవాడై ఉండీ దాన సామర్థ్యం కలిగి ఉండి కూడా సాలగ్రామ దానం చేయలేదు.  కొంత కాలమునకు అతడు చనిపోయాడు.  నారదుడు చెప్పిన హితబోధను పక్కన పెట్టినందుకు మరణానంతరము అతను మళ్ళి జన్మలో పులియై పుట్టి, ఇంకో మూడు జన్మలు కోతి అయి పుట్టి,  ఐదు జన్మలు ఎద్దులాగా పుట్టి, ప్రతి జన్మలో మానవ స్త్రీగా పుట్టి, ఇంకో పది జన్మలు పందిగా జన్మించి చివరకి పదకొండోవ జన్మలో ఒక  పేద బ్రాహ్మణుడి ఇంట్లో స్త్రీగా పుట్టగా  ఆమెకు యవ్వన కాలం రాగానే ఆ పేద బ్రాహ్మణుడు ఒక విద్వాంసునికి ఇచ్చి పెండ్లి చేశాడు. పెళ్లి అయిన కొంతకాలానికి ఆమె భర్త చనిపోయాడు.

         చిన్నతనమందే ఆమె అష్టకష్టాలు అనుభవిస్తునందుకు తల్లిదండ్రులు బంధువులు మిత్రులు చాలా దుఃఖించారు. తండ్రి ఆమెకు ఎందువలన ఇలాంటి కష్టం కలిగిందో  దివ్యదృష్టితో గ్రహించి వెంటనే ఆమె చేత సాలగ్రామ దానం చేయించి "నాకు  బాల వైధవ్యమునుకు కారణమైన పూర్వజన్మ పాపమూ నశించుగాక "అని చేపించి సాలగ్రామ దానఫలితము ధారపోయించారు. ఆ రోజు కార్తీక సోమవారం అవటం వలన ఆ సాలగ్రామ దాన ఫలితముతో ఆమె భర్త జీవించాడు. తరువాత ఆ దంపతులు చిరకాలము సకల సౌఖ్యములతో జీవించి జన్మతారము స్వర్గమునకు వెళ్లారు. మరికొంత కాలానికి బ్రాహ్మణ స్త్రీ మరొక బ్రాహ్మణుని ఇంట కుమారునిగా పుట్టి నిత్యము సాలగ్రామము దానము చేస్తూ ముక్తినిపొందెను

       కనుక జనకమహారాజా! కార్తీకశుద్ధ ద్వాదశీ రోజునా సాలగ్రామ దానము చేసిన దానిఫలితము చెప్పలేము. ఎంతో గొప్పది. కనుక నువ్వు ఆ సాలగ్రామ దానము చేయి.

కార్తీక పురాణము 11వ రోజు

మంధరుడు - పురాణమహిమ

11వ అధ్యాయము


 

             ఓ జనక మహారాజా! ఈ కార్తీకమాసమందు విష్ణుమూర్తిని అవిసె పూలతో పూజించిన చాంద్రాయణ వ్రతము చేసినంత ఫలితం దక్కుతుంది.  కృష్ణ పూజ అయిన తర్వాత పురాణపఠనం చేసినా, చేయించినా, విన్నా, వినిపించినా అటువంటివారు తప్పనిసరిగా వైకుంఠమును పొందుతారు.  దీనిని గురించి ఒక ఇతిహాసము ఉన్నది శ్రద్ధగా ఆలకించు అని  వశిష్టుల వారు ఇలా చెప్పసాగారు. 

                పూర్వకాలములో కళింగ దేశమందు ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు.  అతని పేరు మంధరుడు.  అతడు ఇతరుల ఇండ్లలో వంటలు చేస్తూ అక్కడే భుజించేవాడు. మద్యం సేవించుట, దుష్టసాంగత్యం వలన స్నాన జప దీపారాధన ఆచారాలను పాటించడం మానేసి తిరిగేవాడు. అతని భార్య మహాసాధ్వి, గుణవంతురాలు, భర్త ఎంత దుర్మార్గుడైన  విసుగు చెందకుండా సకల ఉపచారాలు  చేసేది. పతివ్రతాధర్మాలను నిర్వర్తించేది. మంధరుడు ఇతరుల ఇళ్లల్లో వంటవాడిగా పని చేసిన ఇల్లు గడవక  చిన్న వర్తకం కూడా చేశాడు.  ఆఖరికి దాని వలన కూడా పోట్టగడవక దొంగతనాలు చేశాడు. దారి కాచి బాటసారులను బాధించి వారి వద్ద ఉన్న ధనమును వస్తువులను దొంగతనం చేసి జీవించేవాడు.  అడవి దారిన వెళ్తున్నా ఒక బ్రాహ్మణుడిని భయపెట్టి ధనమును దొంగతనం చేస్తూ ఉండగా అక్కడికి ఇంకొక కిరాతకుడు  వచ్చి ధనమును అపహరించి ఇద్దరిని చంపి వెళుతుండగా దగరలో దగరలో ఉన్న గుహనుండి సింహము బయటకు వచ్చి కిరాతకునిపై పడింది.  కిరాతకుడు దానినికూడా చంపాడు.  కానీ ఆ పులి కూడా తన పంజాతో కిరాతకుని కొట్టటంవల్ల అతనుకూడా చనిపోయాడు.  ఆ విధముగా ఒకే కాలములో నలుగురు చనిపోయారు.  ఆ నలుగురు కూడా యమలోకంలో అనేక శిక్షలు అనుభవిస్తున్నారు.  

        మంధరుడు చనిపోయిన దగ్గర నుంచి అతని భార్య నిత్యం హరినామస్మరణ చేస్తూ  సదా చారిని భర్తను తెలుసుకునేది చేస్తూ కాలం గడిపేస్తుంది.  కొన్నాళ్ళకు ఆమె ఇంటికి ఒక ఋషి పుంగవులు వచ్చారు.   ఆ ఋషిని గౌరవంగా ఆహ్వానించి అర్ఘపాద్యాదులచే పూజించి "స్వామి! నేను దీనురాలను,  నాకు భర్త గానీ, పిల్లలు గానీ లేరు.  నేను సదా హరినామస్మరణ చేస్తూ జీవిస్తున్నాను.  నాకు మోక్షమార్గము ప్రసాదించండి"  అని ప్రార్థించింది.  ఆమె వినయమునకు, ఆచారానికి ఆఋషి సంతసించి "అమ్మ! ఈ రోజు కార్తీక పౌర్ణమి. చాలా పవిత్రమైన రోజు. ఈ రోజుని వృధాగా పాడు చేసుకోవద్దు.  ఈ రాత్రి దేవాలయములో పురాణము చదువుతారు.  నేను నూనెను తీసుకు వస్తాను.  నీవు ప్రమిదను వత్తిని తీసుకుని రావాలి. దేవాలయంలో ఆ వత్తిని తెచ్చిన ఫలితము నీకు కలుగుతుంది. అని చేపి వెళ్లరు.  అందుకు ఆమె సంతోషించి వెంటనే దేవలయానికి వెళ్లి  శుభ్రం చేసి గోమయంతో అలికి ముగ్గులు పెట్టి తానే స్వయముగా వత్తిని చేసి రెండు వత్తులు వేసి ఋషి తెచ్చిన  నూనె ప్రమిదలలో పోసి దీపారాధన చేసింది.  తరువాత ఇంటికి వెళుతూ తనకు కనిపించిన వారికలా "ఈరోజు రాత్రి ఆలయంలో జాగరణ పురాణకాలక్షేపం జరుగుతుంది రండి" అని చెప్పింది.  ఆమె కూడా రాత్రి అంతా పురాణము విన్నది.  ఆ నాటి నుండి ఆమె విష్ణు చింతనతో కాలం గడుపుతూ కొంతకాలానికి మరణించింది.  ఆమె పుణ్యాత్మురాలు అవటం వలన విష్ణుదూతలు వచ్చి విమానమెక్కించి వైకుంఠమునకు తీసుకొని పోయారు.  కానీ ఆమెకు పాపాత్ముడైన భర్తతో సహవాసం వల్ల కొంచెం దోషం ఉండటం చేత మార్గమధ్యంలో యమలోకానికి   తీసుకొని పోయారు.  అక్కడ నరకములో ఆ ముగ్గురితో బాధపడుతున్న తన భర్తను చూసి "ఓ విష్ణు దూతలారా! నా భర్త ఆ ముగ్గురు నరక బాధలు పడుతున్నారు.  కనుక నాయందు దయ ఉంచి వాడని ఉదహరించండి" అని ప్రాధేయపడింది.  అందుకు విష్ణుదూతలు "అమ్మ! నీ భర్త బ్రాహ్మణుడే ఉండి కూడా స్నాన సంధ్యాదులు మాని పాపాత్ముడు అయ్యాడు.  రెండోవవాడు బ్రాహ్మణుడైన అతను కూడా తన ప్రాణ స్నేహితుడు చంపి ధనం అపహరించాడు.  మూడోవాడు సింహము.  నాలుగో వాడు పూర్వము ద్రావిడ దేశమున బ్రాహ్మణుడై జన్మించిన అనేక అత్యాచారాలు చేసి ద్వాదశి రోజున కూడా తైల లేపనము,  మద్యమాంసం సేవించి  పాపాత్ముడు అయ్యాడు.  అందుకే ఆ నలుగురు నరక బాధలు పడుతున్నారు"  అన్ని వారి చరిత్రలు చెప్పారు. అందుకు ఆమె విచారించి "ఓ  పుణ్యాత్ములారా!  నా భర్తతో పాటు మిగిలిన ముగ్గురిని కూడా ఉద్ధరించండి" అని ప్రార్థించగా,  అందుకు విష్ణుదూతలు "అమ్మ ! కార్తీక పౌర్ణమి రోజు నీవు చేసిన  వచ్చి ఫలితము సింహానికి,  ప్రమిద ఫలితము కిరాతకునికి, పురాణా ఫలితము బ్రాహ్మణులకు ధారపోసిన వారికీ మోక్షం కలుగుతుంది" అని చెప్పారు. ఆమె అలాగే ధారపోసింది. నలుగురు ఆమెతో విమానము ఎక్కి వైకుంఠానికి వెళ్లారు.  కనుక ఓ రాజా!  కార్తీక పురాణం వినటం వలన, దీపం వెలిగించడం వలన ఎటువంటి ఫలితం కలుగుతుంది విన్నావా? అని వశిష్ఠులవారు చెప్పారు. 

కార్తీక పురాణము 10వ రోజు

 అజామీళుని పూర్వజన్మ వృత్తాంతము 

10 అధ్యాయము



                        జనకుడు వశిష్ఠమహర్షిని ఇలా అడిగారు. " మునిశ్రేష్టా!  ఈ అజామిళుడు ఎవరు?  అతని పూర్వజన్మ వృత్తాంతం ఏమిటి?  పూర్వజన్మమున ఎటువంటి పాపములు చేశాడు? విష్ణుదూతలు వైకుంఠమునకు తీసుకువెళ్ళిన తర్వాత ఏమి జరిగింది?  వివరించండి." అని ప్రార్థించాడు. వశిష్ఠులా వారు ఇలా చెప్పసాగారు.  

                 జనకమహారాజా! అజామిళుని విష్ణుదూతలు వైకుంఠమునకు తీసుకుపోయిన తర్వాత యమకింకరులు తమ ప్రభువు యమధర్మరాజు దగ్గరికి వెళ్లి " ప్రభు! తమ ఆజ్ఞ ప్రకారం అజామిళుని తీసుకురావడానికి వెళ్ళాము. అక్కడకు విష్ణుదూతలు వచ్చి మాతో వాదించి అజామీళుని విమాన మెక్కించి వైకుంటమునకు తీసుకొనివెళ్ళారు.  ఇంకా ఏమీ చేయలేక చాలా విచారంగా ఇక్కడికి వచ్చాము"  అని భయకంపితులై విన్నవించుకున్నారు. 

             "ఎంత పని జరిగింది? ఎప్పుడు ఇలా జరగలేదు? దీనికి బలమైన కారణం ఏమైనా ఉందా?"  యమధర్మరాజు దివ్యదృష్టితో అజామీళుని పూర్వ జన్మ వృత్తాంతం తెలుసుకొని " ఓ! ఆదా సంగతి! తన మరణ సమయములో 'నారాయణ' అని వైకుంఠవాసుని నామస్మరణ చేసినందు వలన విష్ణుదూతలు వచ్చి తీసుకుని వెళ్లారు. తెలిసి గాని తెలియక గాని ఎవరు  హరినామస్మరణ చేసిన వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది.  కనుక అజామిళుని వైకుంఠ ప్రాప్తి కలిగింది" అని అనుకొన్నారు. 

                అజామిళుడు పూర్వ జన్మలో మహారాష్ట్ర  దేశమున ఒకానొక శివాలయములో అర్చకునిగా ఉన్నాడు.  అతడు తన  అందము వలన, సిరిసంపదల వలన బలము వలన అహంకారి అయ్యాడు.  శివారాధన చేయక, శివాలయము యొక్క ధనమును అపహరిస్తూ, శివుని విగ్రహం వద్ద ధూపదీపనైవేద్యాలు పెట్టకుండా, చెడు సావాసాలు చేస్తూ విచ్చలవిడిగా తిరుగుతూ ఉండేవాడు. ఇతనికి ఒక బీదబ్రాహ్మణస్త్రీతో రహస్య సంబంధం ఉండేది. ఆమె కూడా అందమైనది అవటం వలన  చేసేదిలేక ఆమె భర్తగా కూడా చూసి చూడనట్టు ఉండేవాడు.  అతను బిక్షాటనకై ఊరూరా తిరుగుతూ ఎదోఒకవేళ ఇంటికి తిరిగి వచ్చేవాడు.  ఒకనాడు పొరుగూరికి వెళ్లి యాచనచేసి పెద్దమూటతో బియ్యము, కూరగాయలు నెత్తిన పెట్టుకొని వచ్చి అలసిపోయి ఇంటికి వస్తూనే భార్యతో "  నాకు ఈ రోజు ఆకలి ఎక్కువగా ఉంది. త్వరగా వంట చేసి పెట్టు" అని అన్నాడు.   అందుకు ఆమె చీదరించుకొని కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు కూడా ఇవ్వకుండా అతని వంక కన్నెత్తి అయినా చూడకుండా అజామీళునిపై ప్రేమాతో భర్తని తిట్టడంతో భర్తకు కోపం వచ్చి మూలనున్న కర్రతో కొట్టాడు. అందుకు ఆమె భర్త దగ్గర ఉన్న కర్రను లాకొని భర్తను రెండింతలు కోట్టి బయటకు తోసి తలుపు వేసింది. అతను చేసేది లేక భార్యపై విసుగు చెంది ఇంటి ముఖము చూడకూడదని దేశాటనకు వెళ్ళిపోయాడు. భర్త ఇంటినుండి వెళిపోయాడు అని సంతోషించి, ఆమె ఆ రాత్రి బాగా ముస్తాబు అయి వీధి అరుగుమీద కూర్చొని ఉండగా ఒక చాకలి వాడు ఆ దారిన వెళుతున్నాడు. అతనిని పిలిచి "ఓయి! నివు ఈ రాత్రికి నాతో ఉంటావా" అని కోరింది. అందుకు ఆ చాకలి "తల్లి! నీవు బ్రాహ్మణస్త్రీవి. నేను చాకలి వాడిని మీరు నన్ను ఇలా పిలవటం మంచిదికాదు. నేను ఇటువంటి పాపమూ చేయ్యను" అని బుద్ధిచెపి వెళిపోయాడు. ఆమె ఆ చాకలివాని అమాయకత్వానికి లోలోపల నవ్వుకొని అక్కడినుంది బయలుదేరి అజామీళుని దగ్గరకు రాత్రిఅంతా అతనివద్ద గడిపి ఉదయం ఇంటికివచ్చి "అయ్యో!నేను ఎంతపని చేశాను?ఎంతటి పాపమూ చేశాను? అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకొని భర్తను ఇంటినుండి వెళ్లగొట్టి క్షణికమైన ఆవేశానికి లోనయి. మహా అపరాధము చేశాను" అని పశ్చాత్తాపము చెందింది. ఒక కూలి వాడిని పిలిపించి కొంత ధనము ఇచ్చి తన భర్తను వెతికి తీసుకురావలసిందిగా పంపింది. కొన్ని రోజులు గడిచిన తరువాత భర్త ఇంటికి రాగానే అతని పాదాలపై పడి తన తప్పులు క్షమించమని వేసుకొంది. అప్పటినుండి ఆమె మంచి నడవడికతో భర్త అనురాగానికి పాత్రురాలి అయింది. కొంత కాలానికి అజామీళునికి వ్యాధి సంక్రమించి రోజురోజుకి క్షిణించి మరణించాడు. అతడు అనేక నరక భాధలు అనుభవించి పొంది మళ్ళి నరజన్మ ఎత్తి సత్యవ్రతుడు అని బ్రాహ్మణుడికి కుమారుడై కార్తీకమాసంలో నదీస్నానము చేసి దేవతదర్శనం చేసి ఉండటంవలన నేడు జన్మముల పాపమూ నశించటంవలన అజామీళుడై పుట్టాడు. ఇపుడు తన మరణసమయంలో 'నారాయణ' అని శ్రీహరి నామస్మరణా వలన వైకుంఠమునకు వెళ్ళాడు.

         బ్యాహ్మణుని భార్య కూడా రోగగ్రస్తురాలై చనిపోయేది. నరకములో అనేక నరకభాదలు అనుభవించి ఒక మలవాని ఇంట జన్మించింది. ఆ మలవాడు ఆ పిల్లను జన్మరాశి చూపించగా తండ్రిగండమున పుటింది అని జ్యోతిష్కుడు చెప్పాడు.  ఆ మాలవాడు ఆ పిల్లని తీసుకెళ్లి అడవిలో వదిలిపెట్టాడు. అంతలో ఒక విప్రుడు ఆ దారిన పోతున్నప్పుడు పిల్ల ఏడుపు విని జాలి కలిగి తీసుకొని పోయి తన ఇంటి పనివాళ్ళకి ఇచ్చి పోషించాని చెప్పాడు. ఆ బాలిక అజామీళుని ప్రేమించింది. ఇదివారి పూర్వజన్మ వృత్తాంతం.

             నిర్మలమైన మనసుతో శ్రీహరిని ధ్యానించటం, దానధర్మాలు చేయడం, శ్రీహరి కథలను వినడం, కార్తీక స్నానం ప్రభావము వలన ఎంతటి వారైనా మోక్షం పొందగలరు. కావున కార్తీకమాసంలో వ్రతములు, పురాణ శ్రవణం చేసిన వారికి ఇహపరసుఖమును పొందగలరు.

కార్తీక పురాణము 9వ రోజు

విష్ణు దూతలు, యమదూతల వివాదం

9వ అధ్యాయము



           "ఓ యమదూతలారా! మేము విష్ణుదూతలము. వైకుంఠము నుండి వచ్చాము. మీ ప్రభువైన యమధర్మ రాజు ఎటువంటి పాపాత్ములను పాపాత్ములను తీసుకొని రమ్మని మిమ్మలిని పంపారు" అని ప్రశ్నించారు. అందుకు జవాబుగా యమదూతలు "ఓ విష్ణుదూతలారా! మానవుడు చేసే పాపపుణ్యాలను సూర్యుడు, చంద్రుడు, భూదేవి, ఆకాశము, ధనంజయాది వాయువులు, రాత్రి, పగలు, సంధ్యాకాలము సాక్షులుగా ఉండి ప్రతి రోజు మాప్రభువు దగరకు వచ్చి చెపుతుంటారు. మా ప్రభువులు వారి కార్యకలాపాలను చిత్రగుప్తునికి చూపించి ఆ మానవుని మరణసమయంలోమమ్మలిని పంపి రప్పిస్తారు. పాపాత్ములు ఇటువంటి వారో వినండి. 

             వేదోక్త సదాచారములు విడిచి వేదశాస్త్రములను నిందించే వారు, పరస్త్రీలను కామించేవారు, పరాన్నభుక్కులు, తల్లితండ్రులను, గురువులను, బంధువులను, కులవృత్తిని, తిట్టి హింసించేవారిని, జీవహింస చేసేవారు, దొంగపధ్ధులతో వడ్డీలు పెంచి ప్రజలను పీడించేవారు, శిశుహత్య చేసేవారు, శరణమన్నవారినికూడా వదలకుండా బాధపెటేవారు, చేసినమేలు మరచేవారు, వివాహశుభకార్యాలు జరగనివ్వకుండా అడ్డుతగిలేవారు పాపాత్ములు. వారు మరణించగానే  తన వద్దకు తీసుకు వచ్చి నరకములో పడవేసి దండించమని  యమధర్మరాజు గారి ఆజ్ఞ.

            ఈ  అజామిళుడు బ్రాహ్మణుడై పుట్టి దురాచారాలకులోనే  కులభ్రష్టుడై  జీవహింసచేసి కామాంధుడై వావివరుసలు మరచి  సంచరించిన పాపాత్ముడు.  వీనిని విష్ణులోకానికి  ఎలా తీసుకువెళతారు. అని యమదూతలు అడిగారు.  విష్ణుదూతలు ఇలా సమాధానమిచ్చారు "ఓ  యమదూతలారా!  మీరు ఎంత అవివేకులు.  మీకు ధర్మసూక్ష్మాలు తెలియవు. ధర్మ సూక్ష్మములు అంటే ఏమిటో చెబుతాను వినండి. సజ్జన సహవాసం చేసే వారు జపదానధర్మాలు చేసేవారు. అన్న దానము, కన్యాదానము, సాలగ్రామదానము చేసేవారు.   అనాధ శవాలకు దహనసంస్కారాలు చేసేవారు.  తులసి వనము పెంచేవారు. చెరువులను తవ్వించేరు.  శివకేశవులను పూజించేవారు. సదా హరినామస్మరణ చేసేవారు. మరణసమయంలో 'నారాయణ' అని శ్రీహరిని గాని 'శివ' అని శివుని గాని స్మరించేవారు.  తెలిసి గాని తెలియక గాని హరినామస్మరణ చెప్పిన వినిన వారు పుణ్యాత్ములు. కాబట్టి అజామిళుడు ఎంతటి పాపాత్ముడైన మరణ సమయంలో 'నారాయణ' అని స్మరిస్తూ మరణించాడు కాబట్టి మేము వైకుంఠమునకు తీసుకొని పోతాము"  అని పలికారు.

       అజామిళుడు  విష్ణుదూతలు, యమదూతల సంభాషణ విని ఆశ్చర్యంపొంది " విష్ణుదూతలారా! పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు శ్రీమన్నారాయణ పూజ గాని వ్రతము గాని ధర్మములు గాని చేయలేదు. నవమాసాలు మోసి కనిపెంచిన తల్లిదండ్రులకు ఎప్పుడూ నమస్కారం చేయలేదు. వర్ణ  ఆశ్రమాలు విడిచి కులభ్రష్టుడిని అయ్యాను.  నీచకుల కాంతలతో సంసారం చేశాను.  నా పుత్రుని ఎందున్న ప్రేమించే 'నారాయణ' అన్నంత మాత్రాన నన్ను ఘోర నరక బాధల నుండి రక్షించి వైకుంఠమునకు తీసుకుపోతున్నారు.  నేను ఎంత అదృష్టవంతుడిని నా పూర్వజన్మసుకృతం! నా తల్లిదండ్రుల పుణ్యఫలము నన్ను రక్షించింది"  అని చెప్పి సంతోషంగా విమానమెక్కి వైకుంఠమునకు వెళ్లెను.

          జనకమహారాజా! తెలిసి గాని తెలియక గాని నిప్పు తగిలిన  దహిస్తుందో అలాగే శ్రీ హరి నామస్మరణ చేసిన సకల పాపములు నశించి మోక్షము కలుగుతుంది ఇది ముమ్మాటికి నిజం.

          ఇంకావుంది.......................... 

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...