కార్తీక పురాణము 28వ రోజు

విష్ణు సుదర్శన చక్ర మహిమ

           అత్రి మహాముని అంబరీషునితో దూర్వాసుడు విష్ణుమూర్తి దగ్గర సెలవు తీసుకొని తనని తరుముకువస్తున సుదర్శన చెక్రనికి భయపడి అంబరీషుని వద్దకు వెళ్లి అతని పాదాలపై పడి వేడుకొన్నాడు. అంబరీషా నను క్షమించు. నేనే తాపశాలిని అనే గర్వముతో ముందు వెనక ఆలోచించకుండా నీ పట్ల అన్యాయం చేశాను.  ఇపుడు ఫలితం అనుభవిస్తున్నాను. నన్ను క్షమించు రక్షించు అని వేడుకొన్నాడు. అంబరీషుడు దుర్వాసుడిని లేవదీసి సుదర్శన చెక్రనికి నమస్కరించి కోరిన వాళ్లకి నా దగ్గర వున్నది లేకుండా యిచ్చిన వాడనయితే నేను ఎప్పుడూ ధర్మము తప్పకుండా ప్రవర్తించిన వాడనయితే నేను చేసిన పూజలకు శ్రీమన్నారాయణ సంతోషమును పొందిన వాడయితే నీవు ఈనాడు మహర్షిని సంహరించాలని ఉద్యుక్తతను పొందుతున్న దానివి ప్రశాంతతను పొంది, శాంతిని పొంది నీ యథాస్థానమునకు మరలి పొడువు గాక!” అన్నాడు. దుర్వాసుని రక్షించడానికి తాను చేసిన తపస్సునంతటిని ఒట్టు పెట్టాడు. ఉత్తర క్షణం ప్రశాంతతను పొంది సుదర్శన చక్రం వైకుంఠమునకు వెళ్ళిపోయింది.




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...