కార్తీక పురాణము 24వ రోజు

 అంబరీషుని ద్వాదశీవ్రతము 

అత్రిమహాముని మళ్లీ అగస్త్యునితో "అగస్త్య మహర్షి! కార్తీకవ్రత ప్రభావము  వివరించిన తనివితీరదు. కార్తీక మాసములో శుద్ధ ద్వాదశిరోజునాడు చేసే వ్రతానికి అత్యంత ప్రాముఖ్యత ఉన్నది.  ఆ రోజు చేసే దాన ధర్మాలకు అధిక ప్రాముఖ్యత ఉన్నది. ఈ ద్వాదశీవ్రతము ఎలాచేయాలి వివరిస్తాను విను. 

        కార్తీక శుద్ధ దశమి రోజున పగటిపూట మాత్రమే భుజించి ఆ మరుసటిరోజు అనగా ఏకాదశిరోజు ఎటువంటి ఆహారము తీసుకోక కటిక ఉపవాసము చేసి ద్వాదశి గడియలు వచ్చిన తరువాత భోజనము చేయాలి. ఎందుకు ఒక ఇతిహాసము ఉన్నది. అదికూడా వివరిస్తాను. 

          పూర్వము అంబరీషుడను రాజు ఉన్నాడు. అతడు పరమ భాగవతోత్తముడు. ద్వాదశీవ్రత ప్రియుడు. అంబరీషుడు ప్రతి ద్వాదశినాడు తప్పకుండా వ్రతము చేస్తుండేవాడు. ఒక ద్వాదశినాడు ద్వాదశిఘడియలు స్వల్పంగా ఉన్నాయి. అందుకే ఆరోజు త్వరగా వ్రతమును ముగించి బ్రాహ్మణసమారాధన చేయదలచి సిధ్ధముగా ఉన్నాడు. అదే సమయానికి అక్కడికి కోపస్వభావము కలిగిన దుర్వాస మహర్షి వచ్చారు. అంబరీషుడు ఆమునిని గౌరవించి, ద్వాదశి ఘడియలలో పారాయణ చేయాలి కనుక తొందరగా స్నానమునకేగి రమ్మనమని కోరాడు. అందుకు దుర్వాసుడు అంగీకరించి దగ్గరలో ఉన్న నదికి వెళ్లారు. అంబరీషుడు ఎంతసేపు ఎదురుచూసిన దుర్వాస మహర్షి రాకపోయేసరికి తనలోతానుద్వాదశిఘడియాలి దాటిపోతున్నాయి. మహర్షి ఇంకారాలేదు. ఇపుడు ఏమిచేయాలి. అని తన రాజ్యములో ఉన్న పండితులను పిలిచి ఇలా చెప్పసాగారు. ఇంటివచ్చిన దుర్వాసమహర్షి భోజనానికి రమ్మన్నాను. మహర్షి స్నానానికి వెళ్లి ఇంకా రాలేదు. మహర్షిని భోజనానికి పిలిచి తాను ముందు భోజనము చేయటం ధర్మమూ కాదు. మహర్షి వచ్చేవరకు ఉంటే వ్రతభంగము అవుతుంది. ద్వాదశి వ్రతము విడిస్తే శ్రీహరి భక్తిని వదిలిన వాడిని అవుతాను. దుర్వాసమహర్షి మహా కోపము కలవాడు. అయన రాకుండా భోజనము చేస్తే మహర్షి శపిస్తారు. ద్వాదశి విడిచి భుచించిన భగవంతునికి, భోజముచేసిన దుర్వాసమహర్షికి కోపం వస్తుంది. ఈ రెండిటిలో ఏది ఉత్తమమైనది తెలియజేయండి. పండితులు అందరూ కలిసి మహారాజ! సమస్త ప్రాణకోటికి గర్భకుహరములో జఠరాగ్ని రూపములో రహస్యముగానున్న అగ్నిదేవుడు ఆకలిని పుటించి ప్రాణులు భుజించిన చాతురిధాన్నమును పచనముగావించి దేహేంద్రియాలకు శక్తిని ఇస్తున్నాడు. ప్రాణవాయువు సహాయముతో జఠరాగ్ని చెలరేగి ఆకలి దప్పికలి కలుగును. ఆ తాపముము చల్లార్చవలెనన్న అన్నము, నీరు పుచ్చూకొని శాంతపరచవలెను. శరీరమునకు శక్తి కలుగచేయువాడు అగ్నిదేవుడు, దేవతల అందరి కంటే అధికుడై దేవపూజ్యుడు. ఆ అగ్నిదేవుడిని అందరు సదాపూజించాలి.గృహస్థుడు, ఇంటికివచ్చిన అతిథి కడజాతివాడైన భోజనము పెడతాను అని చేపి వానికి పెట్టకుండా తినకూడదు. అందులోనూ వేదవేదంగావిద్యావిశారదుడు, మహాతాపశాలి, సదాచారసంపనుడు అయినా దుర్వాస మహర్షిని భోజనానికి పిలిచి అతనికి పెట్టకుండా తాను భుజించటం వలన మహాపాపము కలుగుతుంది. అందువలన ఆయుఃక్షిణము కలుగుతుంది. దుర్వాస మహాముని అంతటి వానిని అవమానమొనరించిన పాపము కలుగుతుంది అను వివరించారు............



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...