కార్తీక పురాణము 22వ రోజు

పురంజయుడు కార్తీక మాస వ్రతం చేయటం 

అత్రి మహాముని అగస్త్యునికి ఇలా చెప్పసాగారు. పురంజయుడు వశిష్ఠులవారు చెప్పిన ప్రకారం కార్తీక పౌర్ణమి రోజున శుచియై దేవాలయమునకు వెళ్లి శ్రీమన్నారాయణుని షోడశోపచారాలతో పూజించి, శ్రీహరిని ప్రార్ధించి, సాష్టాంగ నమస్కారం చేసి, సూర్యోదయము కాగానే నదికి వెళ్లి స్నానమాచరించి తన గృహానికి వెళ్ళాడు. అదే సమయిజంలో విష్ణుభక్తుడైన ఒక వృద్దబ్రాహ్మణుడు మెడనింద తులసీమాలలు ధరించి పురంజయుడి దగ్గరకు వచ్చి "రాజా! విచారించకు. నువ్వు వెంటనే చెల్లచెదురైనా సైన్యాన్ని కూడదీసుకుని నీ శత్రురాజులతో యుద్ధం చేయి. నీ రాజ్యము నీకు దక్కుతుంది" దీవించి వెళ్లారు. బ్రహ్మానుడి మాటలు నమ్మి పురంజయుడు శత్రురాజులతో ఘోరంగా యుద్ధం చేసాడు. శ్రీమన్నారాయుని ఆశీర్వాదముతో పురంజయుడు ముందు యుద్దములో నిలువలేక శత్రురాజులు పారిపోయారు. పురంజయుడు విజయం పొంది తన రాజ్యాని తాను తిరిగి సంపాదించాడు. శ్రీమన్నారాయుని కటాక్షం వలన భక్తులకు శత్రువుల భయం ఉండదు కదా!




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...