కార్తీక పురాణము 21వ రోజు

పురంజనుడు కార్తీకమాస వ్రత ప్రభావము తెలుసుకొనుట 

                 ఈ విధంగా యుద్ధానికి సిద్ధమైన వచ్చిన పురంజనునకు కాంబోజాది రాజులకు భయంకరమైన యుద్ధం జరిగింది.  ఈ యుద్ధంలో పురంజయుడు ఓటమి పాలైయాడు.  దానితో పురంజనుడు రహస్య మార్గంలో శత్రువుల కంటబడకుండా  అడవిలోకి వెళ్ళి పోయాడు. శత్రురాజులు రాజ్యాన్ని ఆక్రమించుకున్నారు. పురంజనుడు విచారిస్తున్న సమయంలో వశిష్ఠులు వచ్చి పురంజనుడిని ఓదార్చి "రాజా! ఇంతకుముందు నీ దగరకు ఒకసారి వచ్చినపుడు నీవు ధర్మము తప్పి ఉన్నావు. నేను నీకు అధర్మ మార్గాన్ని విడిచిపెట్టి ధర్మమార్గములో హితబోధచేసిన నీవు నా మాట వినిపించుకోలేదు. ధర్మ మార్గం తప్పటం వల్లనే ఈ రోజు ఇలా యుద్దములో ఓడిపోవలసి వచ్చింది. జయాపజయములు దైవాధీనాలు. రేపు కార్తీక పౌర్ణమి స్నానజపాది నిత్య కర్మలను ఆచరించి దేవాలయానికి వెళ్లి దేవుని సన్నిధిలో దీపారాధన చేసి భాగవనామస్మరణతో నాట్యము చేయి. ఇలా చేసినా నీకు పుత్ర సంతానం కలుగుతుంది. శ్రీమన్నారాయణుని సేవించటం వలన అయన సంతోషించి నీవు యుద్దములో గెలవటానికి సహాయం చేస్తారు. రేపు ఇలా చేసినా పోగొట్టుకున్నా రాజ్యమును పొందుతావు. కనుక నువ్వు ఇకనుంచి అధర్మ మార్గాన్ని విడి ధర్మ మార్గంలో ప్రవర్తించు. అని వశిష్టమహాముని హితబోధ చేసారు. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...