గోదాదేవి పనేందు ఆళ్వారులో ఒకరు. గోదాదేవి విష్ణుచిత్తుడు అనే ఆళ్వారుకి తులసి చెట్టు దగ్గర దొరుకుతుంది. ఆమె చిన్ననాటి నుంచి శ్రీరంగ నాధుడినే ఆరాధిస్తూ వస్తుంది. పెరిగి పెద్దయినా తరువాత శ్రీరంగ నాధుడిని వివాహం చేసుకోవాలని పట్టు పటింది. దానికి విష్ణుచిత్తుడు ఇదిఅంతా జరిగేపనికాదు అని వదిలేసారు. కానీ గోదాదేవి పండితుల ద్వారా ద్వాపరయుగములో గోపికలు శ్రీకృష్ణుడిని భర్తగా పొందటానికి కాత్యాయని వ్రతాన్ని చేసారని తెలుసుకొని తనుకూడా ఆ వ్రతాన్ని చేస్తుంది. విష్ణుచిత్తుడు ప్రతిరోజు శ్రీరంగనాధుడి కోసం పూవులను సిద్ధం చేసారు. వాటిని గోదాదేవి అలంకరించుకొని తండ్రి వచ్చేలోపు వాటిని వాటి స్థానంలో ఉంచేది ఇలా 30రోజులు గడిచాయి. ఆమె ఈ ముపై రోజులు ప్రతిరోజు ఒక పాశురాని రాసి, పాడింది. ఒకరోజు విష్ణుచిత్తుడు స్వామి కోసం పూవులు తీసుకువెళుతుండగా అందులో పొడవైన వెంట్రుకలు కనిపిస్తాయి. గోదాదేవిని పిలిచి అడుగుతారు. గోదాదేవి చేసినా పనిని తెలుసుకొని ఆమెను మందలిస్తారు. ఆరోజు రాత్రి కలలో శ్రీకృష్ణుడు కనిపించి గోదాదేవిని పెళ్లి కుమార్తెగా అలంకరించి ఆలయానికి తీసుకురమ్మని ఆజ్ఞాపిస్తారు. ఆ దేశరాజు, పెద్దలు, పండితులు, విష్ణుచిత్తుడు అందరూ కలిసి గోదాదేవిని సాలంకృత కన్యగా ఆలంకరించి దేవాలయానికి తీసుకువస్తారు. గోదాదేవి స్వామిని అర్చిస్తున సమయంలో అందరూ చుట్టునుండగా స్వామిలో ఐక్య అవుతుంది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.
రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు. 1. పరశురాముడు = ఈయన రామాయణంలోను మహాభారతంలోను కనిపించారు. రామాయణంలో రా...
-
అద్యాయం 8 శ్లోకం 21 అవ్యక్తో క్షర ఇత్యుహుః పరమాంగతిమ్ | యం ప్రాప్య న నివర్తంతే తద్ధామ పరమం మమ || అర్థం :- ఈ అవ్యక్తమునే అక్షరము అని అంటారు. ...
-
అష్టాదశ శక్తి పీఠాలు వాటి వివరాలు 1. లంకాయాం శాంకరీదేవి! అష్టాదశ శక్తి పీఠాలలో ముందుగా నమస్కరించవలసిన శక్తి స్వరూపిణి శాంకరీదేవి. నేటి శ్రీల...
-
శివానందలహరి కలాభ్యాం చూడాలంకృతశశి కలాభ్యాం నిజ తపః ఫలాభ్యాం భక్తేషు ప్రకటితఫలాభ్యాం భవతు మే । శివాభ్యామస్తోకత్రిభువనశివాభ్యాం హృది పునర్భవాభ...
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి