గోదాదేవి

గోదాదేవి పనేందు ఆళ్వారులో ఒకరు. గోదాదేవి విష్ణుచిత్తుడు అనే ఆళ్వారుకి తులసి చెట్టు దగ్గర దొరుకుతుంది. ఆమె చిన్ననాటి నుంచి శ్రీరంగ నాధుడినే ఆరాధిస్తూ వస్తుంది. పెరిగి పెద్దయినా తరువాత శ్రీరంగ నాధుడిని వివాహం చేసుకోవాలని పట్టు పటింది. దానికి విష్ణుచిత్తుడు ఇదిఅంతా జరిగేపనికాదు అని వదిలేసారు. కానీ గోదాదేవి పండితుల ద్వారా ద్వాపరయుగములో గోపికలు శ్రీకృష్ణుడిని భర్తగా పొందటానికి కాత్యాయని వ్రతాన్ని చేసారని తెలుసుకొని తనుకూడా ఆ వ్రతాన్ని చేస్తుంది. విష్ణుచిత్తుడు ప్రతిరోజు శ్రీరంగనాధుడి కోసం పూవులను సిద్ధం చేసారు. వాటిని గోదాదేవి అలంకరించుకొని తండ్రి వచ్చేలోపు వాటిని వాటి స్థానంలో ఉంచేది ఇలా 30రోజులు గడిచాయి. ఆమె ఈ ముపై రోజులు ప్రతిరోజు ఒక పాశురాని రాసి, పాడింది. ఒకరోజు విష్ణుచిత్తుడు స్వామి కోసం పూవులు తీసుకువెళుతుండగా అందులో పొడవైన వెంట్రుకలు కనిపిస్తాయి. గోదాదేవిని పిలిచి అడుగుతారు. గోదాదేవి చేసినా పనిని తెలుసుకొని ఆమెను మందలిస్తారు. ఆరోజు రాత్రి కలలో శ్రీకృష్ణుడు కనిపించి గోదాదేవిని పెళ్లి కుమార్తెగా అలంకరించి ఆలయానికి తీసుకురమ్మని ఆజ్ఞాపిస్తారు. ఆ దేశరాజు, పెద్దలు, పండితులు, విష్ణుచిత్తుడు అందరూ కలిసి గోదాదేవిని సాలంకృత కన్యగా ఆలంకరించి దేవాలయానికి తీసుకువస్తారు. గోదాదేవి స్వామిని అర్చిస్తున సమయంలో అందరూ చుట్టునుండగా స్వామిలో ఐక్య అవుతుంది. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...