పాశురము 17
అమ్బరమే తణ్ణీరే! శోఱే! అఱమ్ శెయ్యుమ్
ఎమ్బెరుమాన్! నన్దగోపాలా! ఎళిందిరాయ్
కొంబనార్కెల్లామ్ కొళున్దే! కులవిళక్కే
ఎమ్బెరు మాట్టి యశోదాయ్! అఱివుఱాయ్
అమ్బర మూడఱుత్తు ఓంగి యులగళన్ద
ఉమ్బర్ కోమానే ఉఱంజ్గాదు ఎళిందరాయ్
శెమ్ పొఱ్కళలడిచ్చెల్వా; బలదేవా
ఉమ్బియమ్ నీయుమ్ ఉఱంగేలో రెమ్బావాయ్
అర్ధం :-
ద్వారాపాలకులు గోపాంగనలను లోనికి అనుమతించగా వారు మొదట అన్న, వస్త్ర, తీర్ధాదులను ధర్మబుద్ధితో దానము చేసే నందగోపులను 'స్వామి! మేలుకొను' మని ప్రార్ధించారు. తరువాత 'ప్రబ్బలి తీగవంటి స్త్రీల కందరకును, తీగవలె ముఖ్యమైనదానా! గొల్లకులమునకు మంగళదీపము వంటిదానా! మాకును స్వామినివైన ఓ యశోదమ్మా! లేమ్మా!' అని వేడుకొనిరి. 'ఆకాశమంత ఎత్తుకెదిగి సమస్త లోకాలను కొలిచి దేవతలకే రాజైన ఓ కృష్ణా! ఇక నిద్ర చాలునయ్యా! మేలుకో!' అని ప్రార్ధించిరి. ఆయన వేళకుండుట చూచి, బలరాముని లేపక తప్పు చేసితిమని ఎరిగి 'మేలిమి బంగరు కడియములతో శోభించు పాదయుగళిని గల ఓ బాలరామా! నీ తమ్ముడు శ్రీకృష్ణుడును, నీవును యింకను నిదురించుట తగదు. కావున శీఘ్రమే లేచి రండు!' అని అందరినీ క్రమము తప్పక మేల్కొలుపుచున్నారు. వారి కృపను వేడుచున్నారు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి