కార్తీక పురాణము 27వ రోజు

దుర్వాసుడు అంబరీషుని ఆశ్రయించుట

         అత్రి మహాముని అగస్యునికి ఇలా చెప్పసాగారు. అగస్యా!  శ్రీ హరి దుర్వాసుని యెంతో ప్రేమతో చేరదీసి ఇలా చెప్పసాగారు. 

            ఓ దుర్వాసముని!  నువ్వు అంబరీషుని శపించినట్లు గానే  ఆపది జన్మలు నాకు సంతోషకరమైనవే.  నేను అవతారాలు ధరించడం కష్టం కాదు. నువ్వు తప్పసాలివి.  మీ మాటకు విలువ ఇవ్వాలి.  అందుకే నేను అంగీకరిస్తున్నాను.  బ్రాహ్మణుల మాట సత్యాలు అయితే వారికి గౌరవం ఉండదు.  ఇటు భక్తులను కాపాడటం అటు బ్రాహ్మణుల మాట తప్పకుండా ఉండటం నా కర్తవ్యం.  నువ్వు అంబరీషుని ఇంట్లో భుజించకుండా వచ్చావు.  అందుకే అతడు నా వలన దుర్వాసమహర్షి ప్రాణాలకు ముప్పు వచ్చింది అని ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధపడుతున్నాడు.  ఆ కారణం వల్లనే విష్ణుచక్రం నిన్ను బాధిస్తుంది.  వెంటనే నువ్వు అంబరీషుని దగ్గరకు వెళ్ళు. మీ ఇద్దరికి శాంతి శాంతి లభిస్తుంది.  విష్ణువు దుర్వాసునికి నచ్చజెప్పి అంబరీషుని దగ్గరకి పంపారు.  దూర్వాసుడు వెంటనే అంబరీషుని దగ్గరకు భయాలుదేరారు. 




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...