కార్తీక పురాణము 29వ రోజు

అంబరీషుడు దుర్వాసుని పూజించుట - ద్వాదశీ పారాయణము 

అత్రిమహాముని అగస్త్యుల వారితో ఈ విధముగా - సుదర్శన చక్రము అంబరీషునికి అభయమిచ్చి రక్షించి, భక్తికోటికి దర్శనమిచ్చి అంతర్ధానమైన విధానాన్ని చేపి ఇంకా ఇలా చెప్పసాగారు. 

ఆ తరువాత అంబరీషుడు దుర్వాసుని భోజనానికి ఆహ్వానించి అతనికి అతిధి మర్యాదలు చేసి అందరూ కలిసి శ్రీమహావిష్ణువుని పూజించి ద్వాదసిపారణము చేసారు. తరువాత అందరూ భోజనము చేసారు. తరువాత అంబరీషుడు దుర్వాసునితో "స్వామి! మీవంటి తాపశాలిని సేవించటం నా భాగ్యం నాయందు దయవుంచి నేను ఇపుడు సాధువులను, సన్యాసులను గౌరవించి, పూజించి ఇపుడు నా మనసులో హరినామస్మరణ విడవకుండా ఉండేలా నన్ను ఆశీర్వదించండి" అని దుర్వాసుడిని కోరాడు అందుకు దూర్వాసుడు "అంబరీషా! నువ్వు ధన్యుడవు. ప్రజా రంజకంగా పరిపాలిస్తున్నావు. నువ్వు శ్రీహరి భక్తులలో శ్రేష్ఠుడవు. నువ్వు అడిగిన ఈ చిన్న వరాన్ని నీకు ఇస్తున్నాను. ఇకనుంచి నీవు నాకు ఇష్టుడవు. ఎవరైతే ప్రతి ఏకాదశి నాడు కటిక ఉపవాసం చేసి ద్వాదశినాడు శ్రీమహావిష్ణువుని పూజించి శక్తికొలది దానధర్మలు చేసి బ్రాహ్మణులతో సహా ద్వాదశిఘడియలు దాటకుండా భోజనము చేస్తారో వారికీ వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. 



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...