కార్తీక పురాణము 26వ రోజు

దూర్వాసుడు శ్రీహరిని శరణువేడుట

ఈ విధంగా అత్రిమహాముని అగస్త్యునితో దుర్వాసుని కోపమువలన జరిగిన ప్రమాదం గురించి చేపి ఇంకా చెప్పసాగారు. దూర్వాసుడు అని లోకాలను తిరిగి తనని రక్షించేవాళ్ళు ఒక శ్రీహరి అని వైకుంఠానికి వెళ్లి శ్రీమన్నారాయణ నన్ను రక్షించండి. నీ భక్తుడైన అంబరీషుడికి కీడు చేయాలి అని చూసి నేను బ్రాహ్మణుడిని ముకోపినై ముందు వెనక చూడకుండా మహాపరాధము చేశాను. నీవు బ్రాహ్మణప్రియుడవు. నీ భక్తునికి శాపమిచ్చిన నేనుకూడా రక్షించండి. శ్రీహరి! నీ చక్రాయుధము నను తరుముకొస్తుంది. అని దూర్వాసుడు అహంకారాన్ని వదిలి అనేకవిధాలుగా వేడుకొన్నాడు. శ్రీహరి చిరునవ్వు నవ్వి దుర్వాస! బ్రాహ్మణా రూపములో పుటిన రుద్రుడవు. నీ వంటి తపోధనులు నాకు ఇష్టులు. ప్రతియుగములో గో, బ్రాహ్మణ, దేవా, సాదుజనులకు సంభవించే ఆపదలను పోగొట్టటానికి నేను అవతారాలు ధరిస్తాను. నీవు అకారణంగా అంబరీషుడిని శపించావు. నేను శత్రువుకైనను మనోవకాయకర్మలలో హాని తలపేటను. అంబరీషుడు ధర్మయుక్తంగా ప్రజాపాలన చేస్తున్నాడు. కానీ అటువంటి భక్తుడిని అనేక విధాలా ధూషించావు. నీ ఎడమ పాదముతో తన్నావు. అతని ఇంటికి నువ్వు అతిథివై వెళ్లి నీకు ఆలస్యం అయితే ద్వాదశి ఘడియలు ముగియక ముందే భోజన చేయమని చెప్పలేదు. అతడు వ్రతభంగానికి భయపడి నీళ్లు మాత్రమే తాగాడు. అంతకంటే అపరాధము ఏమి చేయలేదు. చాతుర్వర్ణాల వారికీ భోజన నిషిద్ధ సమయంలో కూడా దాహంతీర్చుకోవటానికి నీళ్లు త్రాగటం మంచిదే కదా. మంచి నీళ్లు తాగాడని నా భక్తుడిని తిట్టి శపించావు. అతడు వ్రతభంగానికి భయపడి నీళ్లు మాత్రమే తాగాడు కానీ నిన్ను అవమానించటానికి కాదు కదా. నువ్వు కోపంగా ఉన్న అతడు నిన్ను భ్రతిమి లాడాడు. ఎంత బ్రతిమిలాడినా నువ్వు శాంతించలేదు. అందుకే అతను నన్ను శరణు వేడాడు. నేనపుడు రాజు హృదయములో ప్రవేశించాను. నీ శాపము పది జన్మలలో అనుభవిస్తాను అని నేనే పలికాను. అతడు ని వల్ల భయముతో  శరణువేడుతున్నాడు.  తనని తాను తెలుసుకోలేని స్థితిలో ఉన్నాడు.  నీ శాపమును అతడు వినలేదు.  అంబరీషుడు నా భక్తులలో శ్రష్ఠుడు.  నిరపరాధి.  విచారించకు.  ఆ శాపాన్ని లోకోపకారంకై  నేనే అనుభవిస్తాను. 

            మీ శాపం లో మొదటి జన్మ ఈ కల్పాని  రక్షించటానికి మత్యవతారం గాను,  రెండొవ జన్మ క్షిరసాగరమధనంలో కూర్మావతారం గాను, మూడవ జన్మ భూమిని కాపాడటానికి వరాహ అవతారం గాను, నాలుగోవ అవతారం ప్రహ్లదుడిని కాపాడతానికి నరసింహావతారం గాను, ఐదొవ అవతారం బలిచేక్రవర్తిని పాతాళానికి వామామవతారం గాను, ఆరొవ అవతారం పరశురామ అవతారం గాను, ఎడొవ అవతారం రాముని గాను, ఎనిమిదోఅవతారం కృష్ణుడి గాను, తోమిదొవ అవతారం బుధ్ధుడిగాను, పదోవ అవతారం కల్కి గాను అవతరిస్తాను. ఈ పది అవతారములు ఎవరైనా నిత్యం స్మరించిన వారికీ వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. 



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...