పోలి స్వర్గం కథ, పోలి పాడ్యమి పూజ విశిష్టత

పోలి స్వర్గం కథ, పోలి పాడ్యమి పూజ విశిష్టత

పూజ విధానం

పోలి పాడ్యమి పూజ కార్తీక మాసం అమావాస్య పూర్తయి తెల్లవారుజామున పోలి పాడ్యమి  (మార్గశిర పాడ్యమి)పూజను నిర్వహిస్తారు. కార్తీక మాసం అంత పూజ చేయలేనివారు ఈ రోజునా ముపై వత్తులతో అరటి దోనెలలో ఆవునేతితో వెలిగించి నదిలో వదులుతారు. మార్గశిర పాడ్యమి రోజునా తెల్లవారుజామున నిద్ర లేచి నది స్నానానికి వెళ్లి స్నామమాచరించి అరటి దోనెలలో తిప్పలు వెలిగించి నదిలో వదలాలి. నదిలో దీపాలను శివుడు, విష్ణువు, గంగా, ,మహాలక్ష్మి దేవిగా భావిస్తారు. పూజ చేసి కార్తీక దామోదరుడిగా భావిస్తారు. దీపాన్ని వదిలేటపుడు పోలి స్వర్గం కథ చదువుకుంటారు. నదికి వెళ్లలేని వాళ్ళు చెరువుల దగ్గర కానీ, భావి దగ్గర కానీ లేక ఇంటిలోనే ఒక తోటేలో దీపాన్ని వదులుతారు.



పోలి స్వర్గం కథ

పూర్వం కృష్ణ తీరములో పోలమ్మ అనే ఒక మహిళా ఉంది. పోలమ్మ(పోలి) చిన్ననాటి నుంచి దైవ భక్తి ఎక్కువ. ఆమె ఊహ వచ్చినప్పటి నుంచి ప్రతి సంవత్సరం కార్తీక మాసం క్రమం తప్పకుండా చేసేది. ఆమెకు యుక్తి వయస్సు వచ్చిన తరువాత వివాహం జరిగింది. ఆమె అత్తగారి ఇంట్లో ఆమె ముగ్గురు తోడికోడళ్లు ఉండేవారు. ఆమె అత్త గారి మహా గయ్యాళి. పోలమ్మ భక్తి శ్రద్ధలను చూసి ఓర్వలేక పోయింది. పోలమ్మ వివాహం అయినా మొదటి సంవత్సరం కార్తీక మాసం వచ్చింది. ఆమె అత్తగారు ఆమెను పూజ చేసుకోనివ్వలేదు. ఆమె ఇంటిలోనే వదిలి పేటి మిగతా ముగ్గురు కొండలను తీసుకొని కృష్ణ నది స్నానానికి వేలాది. పోలమ్మను పూజ చేయనివ్వకూడదని ఆమెకు పూజ సామాను అందకుండా చేసేది అత్తగారు.  ఆమెకు సమయం ఉండకుండా ఇంటిపనులన్ని చెప్పేది. పోలమ్మ వాటినన్నిటిని ఓర్పుతో చేసి ప్రతి రోజు తెలవరకుండానే భావి దగర స్నానం చేసి పెరడులో పతిచెట్టు దగరకు వెళ్లి పతిని కోసి దానిని వతిగా చేసి ఇంటిలో ఉన్న వెన్నను పతికి రాసి కొబ్బరి చిప్పలో దీపాన్ని వెలిగించేది. దీపం ఎవరికీ కనపడకుండా బూటా బోర్లించేది. ఇలా నెల రోజులు చేసింది. ఆఖరి రోజు కార్తీక అమావాస్య వెళ్లి మార్గశిర పాడ్యమి రోజునా అలాగే చేసింది. ఆమె భక్తికి మెచ్చి శ్రీమహా విష్ణువు ఆమెను సశేరీరంగా వైకుంఠానికి తీసుకుంటామని విష్ణు దూతలను పంపించారు. విష్ణు దూతలు వెంటనే అక్కడికి వచ్చారు. పోలమ్మను వైకుంఠానికి తీసుకువెళతానికి విమానంలో ఏకించుకున్నారు. ఆ విమానాన్ని చుసిన పోలమ్మ అత్తగారు ఆ విమానం తమ కోసమే వచ్చింది అని అనుకోని దగరకు చెలగా అందులో పోలమ్మ కనిపించింది. మాకు దక్కనిది పోలమ్మకు ఎందుకు దక్కాలి అని ఆమె కళ్ళు పట్టుకొని లాగబోయారు. అప్పటికే విమానం పైకి వెళ్లిపోయింది. పోలమ్మ అత్తగారు పోలమ్మ కళ్ళు పట్టుకుంది. ఆ అత్తగారి వెనక ముగ్గురు కోడలు ఒకరికలు ఒకరు పట్టుకొని విమానంతో వెలసాగారు. కొంతదూరం వెళ్లిన తరువాత విష్ణు దూతలు పోలమ్మ అత్తగారి చేతులమీద కొట్టారు వాలు కిందపడి మరణించారు. అందరూ చూస్తుండగా పోలమ్మ సశరీరంగా వైకుంఠానికి వెళ్లిపోయింది. ఆమె అత్తగారు, ఆమె ముగ్గురు తోడికోడళ్లు యమభటులు వచ్చి తీసుకు వెళ్లరు. ఈ కథను దీపాన్ని వదిలేటపుడు చెప్పుకుంటారు. 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...