శ్రీ కృష్ణ - బకాసుర వధ

శ్రీ కృష్ణ - బకాసుర వధ



శ్రీ కృష్ణుడు వత్సాసురుడిని వధించిన తరువాత రోజునే మల్లి శ్రీ కృష్ణుడు, బలరాముడు, గోపాలబాలురు లేగదూడలను తీసుకొని మళ్ళీ అడవుల్లోకి వెళ్లరు. ఈ రోజు బలరాముడు, గోపాలబాలురు వెనక నడుస్తుంటే కొంచం ముందు శ్రీ కృష్ణుడు ముందు నడుస్తున్నారు. అక్కడ పర్వతమంత ఎత్తున ఉన్న ఒక తెల్ల కొంగ జపం చేస్తునట్టు కదలకుండా నోరు తెరుచుకొని దీక్షగా కూర్చుంది. ఈ కొంగ బకాసురుడు అనే రాక్షసుడు. పూతన అనే రాక్షసికి సోదరుడు. తన సోదరిని చంపినా శ్రీ కృష్ణుడిని చంపటానికి కంసుడు పంపగా వచ్చాడు. శ్రీ కృష్ణుడు దానిని చూసారు. ఆ వచ్చింది రాక్షసుడు అని తెలుసు కొని దాని దగరకు వెళ్లరు. శ్రీ కృష్ణుడు దగరకు రావటంతో వెంటనే నోటిలో వేసేసుకుంది. ఈ దృశ్యం చుసిన బలరాముడు, గోపాలబాలురు కదలిక లేకుండా పడిపోయారు. శ్రీ కృష్ణుడు ఏది చూసి కొంగ గొంతులో అడంగా ఉండి అగ్ని గోళంగా మారారు. కొంగా ఆ వేడిని తట్టుకోలేక శ్రీ కృష్ణుడు బయటకు వదిలేసింది. బయటకు కృష్ణుడు రాగానే కింద పడిపోయిన బలరాముడు, గోపాలబాలురకు మెలకువ వచ్చింది. బయటకు వచ్చిన వెంటనే శ్రీ కృష్ణుడు కొంగ ముక్కును రెండుగా చీల్చారు. కొంగ రూపంలో ఉన్న బకాసురుడు మరణించాడు. బకాసురుడు మరణించగానే అతనిలోనుంచి ఒక తేజస్సు బయటకు వచ్చి శ్రీ కృష్ణుడిలో కలిసిపోయింది. శ్రీ కృష్ణుడు, బలరాముడు, గోపాలబాలురు సాయంత్రం ఇంటికి రాగానే యశోదమ్మకు జరిగిన విషయం చెప్పారు. యశోదమ్మ ఈ సారి భయపడలేదు. రాక్షసులు ఇలాగే వస్తుంటారులే నా కృష్ణుడికి ఏమి కాదు అని అనుకోను ఊరుకుంది. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...