శ్రీ కృష్ణ - అఘాసుర వధ

శ్రీ కృష్ణ - అఘాసుర వధ



శ్రీ కృష్ణుడు బకాసుర సంహారం చేసిన తరువాత రోజు మళ్ళీ చద్దన్నం కట్టుకొని లేగదూడలను తీసుకొని అడవికి వెళ్లరు. ఆ రోజు బలరాముడు అడవికి రాలేదు. శ్రీ కృష్ణుడు ముందు నడుస్తుంటే వెనక ఉన్న గోపాలబాలురు అందరూ మన అందరిలో ఎవరైతే ముందువెళ్లి శ్రీ కృష్ణుడిని పట్టుకుంటే వాళ్ళు గెలిచినట్టు అని పందెం పెట్టుకున్నారు. అందరూ పరిగెత్తటం మొదలు పెట్టారు. అందులో శ్రీధాముడు ముందు వెళ్లి శ్రీకృష్ణుడికి పట్టుకున్నారు. నేనే గెలిచాను అని సంతోషంతో శ్రీధాముడు తిరిగాడు. గోపాలబాలురు అందరూ శ్రీ కృష్ణుడితో కలిసి ఆదుకున్నారు. శ్రీ కృష్ణుడి మీద పడి ఆడుకున్నారు. అలా ఆడుకుంటూ వెళుతుండగా గోపాలబాలురుకి ఒక ఎనిమిది కిలోమీటరుల పొడవు ఉన్న కొండ చిలువ అడాసురుడనే రాక్షసుడు నోరు తెరుచుకొని ఉన్నది అది వాళ్ళకి కొండగుహల కనిపిచింది. దాని నుండి ఉచ్ఛస్వ నిశ్వాసలు వేడిగా వస్తున్నాయి. గోపాలబాలురు లోపలి వెళదామని అనుకొన్నారు. అందులో ఒకరు ఒరే ఇది ఏమైనా రాక్షసుడేమోరా లోపలి వెళితే మనలని మింగేస్తుందేమో అనుకున్నాడు. అందరూ శ్రీ కృష్ణుడు ఉండగా మనకు భయమేముంది అని వెనక్కి తిరిగి శ్రీ కృష్ణుడిని చూసారు. శ్రీ కృష్ణుడు నవ్వుతు కనిపించారు. అది చుసిన గోపాలబాలురు ఇంక మనకు భయము లేదు అని లోపలి వెళ్లిపోయారు. గోపాలబాలురు, గోవులు లోపలికి వెళ్లగానే నాలుకతో వాళ్ళని పొట్టలో పడేసుకుంది. లోపలవేడికి గోపాలబాలురు, గోవులు మరణించారు. తరువాత శ్రీ కృష్ణుడు లోపలకి వెళ్లారు. శ్రీ కృష్ణుడు లోపలి వెళ్లగానే అఘాసురుడు నోరు మూసేసాడు. శ్రీ కృష్ణుడు గొంతులోనుంచి లోపలి వెళ్లకుండా అక్కడే ఆగిపోయి పెద్దగా పెరిగిపోయారు. ఆలా పెరిగిన శ్రీ కృష్ణుడు వల్ల గొంతు ముసుకుపోయి ఊపిరి ఆడక చనిపోయాడు అఘాసురుడు. అతని తల నుంచి బొటన వేళ్ళు అంత జ్యోతి వచ్చి ఆకాశంలోకి వెళ్లి నుంచుంది. శ్రీ కృష్ణుడు దాని నోరు తెరచి చనిపోయిన గోపాలబాలురు, గోవులను బయటకు తీసుకువచ్చి ఒకొక్కలని భ్రతికించారు. గోపాలబాలురకు సంతోషం వేసి గంతులువేస్తూ శ్రీకృష్ణుడిని కీర్తిస్తూ కొమ్ముబూరల ఊదుతూ శ్రీకృష్ణుడి చుట్టు తిరుగుతున్నారు. దేవతలు ఈ దృశ్యం చూసి పులా వాన కురిపించి తపేటలు తాళాలు వాయించారు. ఇలా జరుగుతున్న సమయంలో ఆకాశంలో ఉన్న అఘాసుర జ్యోతి వచ్చి శ్రీకృష్ణుడిలో కలిసిపోయింది. ఈ లీలను గోపాలబాలురు బృందావనంలోని తలితండ్రులకు సంవత్సరం తరువాత చెపుతారు.

అది ఎలాగో వచ్చేభాగంలో తెలుసుకుందాము. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...