భగవద్గీత
అద్యాయం 9
శ్లోకం 33
కిం పునర్ర్బాహ్మణాః పుణ్యా భక్తా రాజర్షయస్తథా |
అనిత్యమసుఖం లోకమ్ ఇమం ప్రాప్య భజస్వ మామ్ ||
అర్థం :-
ఇక పుణ్యాత్ములైన బ్రాహ్మణులను, రాజర్షులును భక్తులును నన్ను శరణుపొందినచో, వారు పరమపదమును చేరుదురని చెప్పవలసిన పనిలేదు. ఈ మానవశరీరము క్షణభంగురము. సుఖరహితము. ఐనను దుర్లభము. కనుక దీనిని పొంది నిరంతరము నన్నే భజింపుము.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి