శ్రీ కృష్ణ - బృందావన పయనం

శ్రీ కృష్ణ - బృందావన పయనం



శ్రీ కృష్ణుడు మది చెట్లు పడిపోయిన తరువాత అందరికి అనుమానం వచ్చింది. ఇంత పెద్ద చెట్లు ఎలా పడాయి అని ఆలోచించసాగారు. చెట్లను నరకలేదు. గాలివాన రాలేదు. అసలు ఎలా పడాయి అని ఆలోచించసాగారు. అక్కడే ఆడుకుంటున్న పిల్లలు వచ్చి శ్రీ కృష్ణుడు చెట్ల మధ్యలో నుంచి వచ్చారు. ఆ చెట్లు పడిపోయి అందులోనుంచి దేవతలు బయటకు వచ్చి శ్రీ కృష్ణుడిని ప్రార్ధన చేసి వెళ్లిపోయారు. అందరూ చిన్న పిల్లవాడు ఎల్లా చేస్తారు. పిల్లలు ఏదోచెపుతున్నారు. ఏ భూతమో పడేసి ఉంటాయి అని అన్నారు గాని అందరికి మనసులో అనుమానంగా ఉంది. శ్రీ కృష్ణుడు ఈ విషయాన్ని కనిపెట్టి వారందరిని ఈ విషయాలు మరచిపోయేలా చేయాలి అని అనుకున్నారు. ఆ రోజు నుంచి తండ్రి అయినా నందుడు ఇంటికి రాగానే చిన్న పిలాడిలానే ఎదురు వెళ్లి నాన్నని పలకరించడం. పెద్దవాళ్ళు ఎవరైనా మంచినిళ్లు ఎవరంటే ఇచ్చేవారు. ఒకరోజు యశోదమ్మ దగరకు వచ్చి శ్రీ కృష్ణుడు అమ్మ ఎవరో నన్ను కొట్టాలని చుస్తునారు అతను ఆచం నాలాగే ఉన్నారు అని యశోదమ్మను తీసుకెళ్లి నీటితో నిండిన చిన్న తొట్టిని చూపించి ఏడిచాడు. యశోదమ్మ నవ్వు కొన్ని ఎవరు లేరమ్మ అది నీ ప్రతిభింబం అని సర్ధిచెపింది. ఇంకోరోజు యశోదమ్మ దగరకు వచ్చి అమ్మ నాకు అన్నయ్యలాగా జుట్టు లేదు ఎందుకు అని అడిగారు. యశోదమ్మ కన్నయ్య అన్నయ పాలు, పెరుగు బాగా తిట్టాడు అందుకే జుట్టు ఎక్కువగా ఉంది. వెంటనే పక్కనే ఉన్న బిందిలోని పాలను తాగేసి నా జుట్టు పెరిగిందా అని అడిగారు. యశోదమ్మ శ్రీ కృష్ణుడి అమాయకత్వానికి నవ్వుకుంది. ఒకరోజు నందవ్రజంలోకి పండ్లను అమ్ముకుంటానికి ఒక ఆవిడా వచ్చింది. ఆమె పండ్లకు బదులు ధాన్యాన్ని తీసుకుంటుంది. ఆ పండ్ల ఆవిడా యశోదమ్మ ఇంటికి వచ్చింది. యశోదమ్మ ధాన్యాన్ని ఇచ్చి పండ్లని తీసుకుంది. శ్రీ కృష్ణుడు కూడా తన చిన్ని చిన్ని చేతులతో ఒక నాలుగు ధాన్యాపు గింజలను తీసుకొని ఆవిడా దగరకు వచ్చి కొన్ని పండ్లను ఇవ్వమన్నారు. ఆవిడా చిన్ని కృష్ణుడి అమాయకత్వానికి మురిసిపోయి అతని చేతుల్లోని నాలుగు ధాన్యపు గింజలను తీసుకొని ఆ చిన్ని చేతుల నిండా పండ్లను ఇచ్చింది. శ్రీ కృష్ణుడు ఆవిడా వైపే చూస్తూ చూస్తూ వెళ్లరు. ఆవిడా వెళ్లటానికి పండ్ల బుట్టని తీసుకొని వెళ్లబోతుంటే బుట్ట బరువుగా అనిపించింది. ఆవిడా దించి చూసుకుంది. బుట్ట నిండా బంగారం, రత్నాలు ఉన్నాయి. ఒకసారి నందవ్రజంలో పెద్దలందరూ సమావేశమయ్యారు. శ్రీ కృష్ణుడు పుటిన దగర నుంచి నందవ్రజంలో ప్రమాదాలు జరుగుతున్నాయి. అవి కూడా శ్రీ కృష్ణుడికే జరుగుతున్నాయి. దేవుడు రక్షిస్తున్నారు అనుకోని ఇక్కడే ఉంటె కృష్ణుడికి మరింత ప్రమాదం పెరుగుతుంది. కాబ్బటి మనం శ్రీ కృష్ణుడు కోసంమైన ఈ ప్రదేశాన్ని వదిలి వెళ్ళాలి అన్నారు. నందుడు తమ కుమారుడిపైన నందవ్రజంలో ఉన్న ప్రజలు చూపిస్తున్న ప్రేమకి సంతోషించి మీరు ఎలాగా చెపితే అలాగే చేద్దాము అన్నారు. కానీ మనం కొత్త ప్రదేశానికి వేళలో అంతే మనకి పశుసంపద ఎక్కువ కనుక నీళ్లు గడి ఎక్కువ దొరికే ప్రదేశానికి వేళలో అక్కడ పండ్లచెట్లు కూడా ఎక్కువగా ఉండాలి. ఏమి సంపద లేకపోతే కనీసం పండ్లు అయినా తినిబ్రతకచ్చు అని ఆలోచించసాగారు. పెద్దలు ఇక్కడికి దగరలో బృందావనం ఉంది మనం అక్కడికి వెళదాము అనుకొన్నారు. అందరూ సంతోషించారు. మరుసటి రోజు అందరూ తయారు అయి బండ్లు కట్టుకొని బయలుదేరారు. ఆడవాళ్లు, చిన్న పిల్లలు బండ్లలో వెళ్లరు. వెళుతున్న దారిలో యశోదమ్మ చిన్ని కృష్ణుడి గురించి పాటలు పడుకుంది. బృందావనం రాగానే చిన్ని కృష్ణుడు చాల సంతోషించారు. ప్రజలందరూ తాము వచ్చిన బండ్లను వలయాకారంలో పెట్టి తాము ఇళ్ళు కట్టుకునే వరకు అక్కడే ఉండాలి అని నిశయించుకున్నారు.  

శ్రీ కృష్ణ - మది చెట్టులా శాపవిమోచన లీల

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...