మార్గశిరమాసం గురువారం లక్ష్మిదేవి వ్రతకథ

మార్గశిరమాసం గురువారం లక్ష్మిదేవి వ్రతకథ



పూర్వం కళింగదేశములో ఒక బ్రాహ్మణా కుటుంబం ఉండేది. ఆ దంపతులకు సుశీల అని ఒక కుమార్తె ఉండేది. ఆమె పుటిన కొంత కాలానికి ఆమె తల్లి మరణించింది. తండ్రి మళ్ళి వివాహం చేసుకున్నాడు. సవతి తల్లి ఆమె పిల్లలను ఎత్తుకొని ఆడించామని ఒక బెల్లం ముక్క తినమని ఇచ్చేది. సుశీల ఆ ఊరిలో వారు మార్గ శిరమాసం గురువారం వ్రతం చేసుకోవటం చూసి తనుకూడా చేసుకోవాలని మట్టితో లక్ష్మి ప్రతిమని చేసుకొని పెరడులో ఉన్న జిలేడు పువ్వులను, అక్కడ దొరికిన ఆకులతో లక్ష్మి దేవికి షోడశోపచరాలతో పూజ చేసి ఆమె సవతి తల్లి తనకు తినమని ఇచ్చిన బెల్లం ముక్కను నైవేద్యంగా పెటింది. లక్ష్మి దేవి ఆమె పూజకు మెచ్చి సకలైశ్వర్యములు ఇచ్చింది. కొంతకాలానికి సుశీలకు ఆమె తండ్రి వివాహం చేసి అత్తవారింటికి పంపించారు. సుశీల తాను పూజించుకుంటున లక్ష్మీదేవి ప్రతిమను కూడా తీసుకువెళ్ళింది. 

సుశీల వెళ్లిన దగర నుంచి పుటింటి వారి దారిద్ర్యం వచ్చింది. ఈ పని చేసిన కలిసి రాకపోవటం జరిగింది. సుశీల అత్తవారింటికి వెళ్లిన దగర నుంచి వాళ్లకు బాగా కలిసి వచ్చింది. సుశీల సవతి తల్లి వారి దారిద్ర్యం భరించలేక తన కుమారుడిని పిలిచి అక్క దగరకు వెళ్లి మన పరిస్థితిని చేపి అక్కని సహాయం చేయమని అడుగు అని పంపించింది. తమ్ముడు సుశీల దగరకు వచ్చి జరిగిన విషయం చేపి తమ సహాయం చేయమని అడుగుతారు. సుశీల తమ్ముడి మాటలకూ బాధపడి ఒక కర్రను తొలిపించి అందులో వరహాలు నింపి పంపించింది. తమ్ముడు ఆ కర్రను తీసుకొని వెళుతుందగా ఆ కర్ర ఎక్కడో పడిపోయింది. ఇంటికి వెళ్లి అక్క కర్ర ఇచ్చింది అని అది దారిలో పడిపోయింది అని చెప్పాడు. తల్లి బాధపడుతుంది. మరి కొంతకాలానికి మళ్ళి పంపిస్తుంది తమ్ముడు మళ్ళి అక్కదరరకు వెళతాడు. కర్రను ఇంటికి తీసుకువెళ్లలేక పోయాను అని చెపుతాడు. సుశీల బాధపడి ఈ సారి చూపులలో వరహాలు పేటి చెప్పులు కుటించి తమ్ముడికి ఇస్తుంది. తమ్ముడు వాటిని తీసుకువెళ్ళుతూ దారిలో మంచినీరు తాగటానికి చెప్పులను గట్టుమీద పేటి చెరువులోకి దిగుతాడు. మంచి నీరు తాగి వచ్చేసరికి చెప్పులు కనిపించవు. ఇంటికి వెళ్లి జరిగిన విషయం తల్లికి చెపుతాడు. తల్లి బాధపడుతుంది. మరి కొంతకాలానికి మళ్ళి తమ్ముడిని అక్క దగరకు పంపిస్తుంది. సుశీల జరిగినది తెలుసుకొని బాధపడి ఒక గుమ్మడి కాయను తొలిపించి దాని నిండా వరహాలు నింపి జాగ్రత్తగా తీసుకువెళ్ళమని తమ్ముడికి చెపుతుంది. తమ్ముడు వెళుతుండగా సంధ్య సమయం అయింది అని సంధ్య వార్చటానికి చెరువులోకి దిగుతారు. సంధ్య వార్చుకొని వచ్చి చుస్తే గట్టుమీద పెట్టిన గుమ్మడికాయ కనిపించదు. ఇంటికి వచ్చి తల్లికి విషయం చెపుతాడు. అయ్యో సుశీల మనకు ఎదో సహాయం చేయాలనీ చూస్తుంది కానీ అది మనకు చేరటం లేదు. 

ఈ సారి నేనే వెళాతాను అని పిల్లలను తీసుకొని బయలుదేరింది. సుశీల దగరకు వచ్చి జరిగినది చేపి బాధపడింది. సుశీల తల్లితో అమ్మ రేపటి నుంచి మార్గశిరమాసం గురువారం నేను లక్ష్మీదేవి పూజ చేస్తాను నువ్వుకూడా చేసుకో అని చెప్పి పూజ అయేంతవరకు ఏమి తినదు అని చెపుతుంది. తల్లి సరే అంటుంది. మరునాడు పిల్లలకి చద్దన్నం పెడుతూ ఒక ముద్ద నోటిలో వేసుకుంటుంది. సుశీల ఈ విషయం తెలుసుకొని తాను ఒకతె లక్ష్మి దేవి పూజ చేసుకుంటుంది. రెండోవారం మళ్ళి చెపుతుంది తల్లికి జాగ్రత్తగా ఉండమని తల్లి సరే అంటుంది. కానీ పిల్లలకి నూనె రాసి తనుకూడా రాసుకుంటుంది. అలా రెండోవారం కూడా కుదరదు. మూడోవారం సుశీల ఇలా కాదు అని తల్లిని ఒక గోతిలో కూర్చోపెట్టి పైన ఒక గంప పెట్టి మూస్తుంది. పిల్లలు అరటి పండ్లు తిని గంపమీద వేస్తారు. తల్లి ఏమి తోయక అరటి తొక్కలలో ఉన్న అరటి పండు గుజ్జుని తింటుంది. మూడోవారం కుదరదు. నాలుగోవారము సుశీల ఈసారి తన తల్లిని కొంగున కట్టుకొని వెంటే తిప్పుకొంటుంది. 

ఈ సరి తల్లి చేత వ్రతాన్ని పూర్తి చేయిస్తుంది. వాయనం అందుకోవటానికి లక్ష్మి దేవిని పిలుస్తుంది. లక్ష్మి దేవి సుశీల ఇచ్చిన వాయనని తీసుకొని ఆమె తల్లి ఇచ్చిన వాయనని తీసుకోనని వెళ్ళిపోతుంది. సుశీల ఏడుస్తూ లక్ష్మి దేవి పాదాలపై పడుతుంది. లక్ష్మి దేవి మీ సవతి తల్లి నువ్వు నా పూజ చేస్తున్నపుడు నిన్ను చుపురుతో కోటింది నేను అనే వాయనని తీసుకోను అన్నది. సుశీల తన తల్లి తప్పును క్షమించమని కోరుతుంది.లక్ష్మి దేవి కనికరించి సరే ఈ సరి మీ అమ్మ చేత వ్రతం చేయించు నేను వాయనం అందుకుంటాను అని చెప్పింది. సుశీల సంతోషించి అలాగే ఐదొవ గురువారం తన తల్లి చేత వ్రతం చేయిస్తుంది. జీవించినంతకాలం అష్టఐశ్వర్యాలతో  జీవించి మరణించిన తరువాత వైకుంఠం ప్రాపిస్తుంది అని దీవించింది లక్ష్మి దేవి.  అప్పటి నుండి పుటింటి వారికీ కూడా సకల అష్టఐశ్వర్యాలు వస్తాయి.సుశీల తల్లి తన తప్పుని తెలుసుకొని తన జీవించి నంతకాలం మార్గశిరమాసం గురువారం లక్ష్మి వ్రతం నియమ నిష్ఠలతో చేస్తాని కుమార్తెకి చెపుతుంది.   

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...