శ్రీ కృష్ణ - వత్సాసుర వధ

శ్రీ కృష్ణ - వత్సాసుర వధ



నందవ్రజంలో నుంచి గోపాలకులు బృందావనం వెళ్లరు. కొన్నాళ్లకి నందుడు, గోపాలకులు అందరూ ఇల్లు నిర్మించుకొని నివసించసాగారు. శ్రీ కృష్ణుడు తన అన్న బలరాముడు, స్నేహితులతో కలిసి ఆడుకొనసాగారు. నందుడు తన కుమారులకు ఆవుల్ని పోషించటం నేర్పించాలని లేగ దూడలను బృందావనానికి కొంచం దూరంగా ఉన్న చిన్న అడవిలో మెపూకురమని చెప్పారు. యశోదమ్మ భయపడింది. అసలే కొత్త ప్రదేశం శ్రీ కృష్ణుడు ఇంకా చిన్న పిల్లవాడు, అల్లరివాడు. ఏ జంతువన్న లాక్కుపోతుందేమో అని పంపనంది. శ్రీ కృష్ణుడు తన తల్లికి ధర్యం చెపుతూ. అమ్మ మేము ఎక్కువ దూరం వెళ్ళాము. ఇంట్లో ఉంటె ఏమి తోయటం లేదు. మేము జాగ్రత్తగా వెళ్లి వస్తాము అన్నారు. యశోదమ్మ మరుసటి రోజు పిల్లలిద్దరికి చద్దన్నం కటిచ్చి లేగ దూడలను ఇచ్చి పంపించింది. శ్రీ కృష్ణుడు తన స్నేహితులతో కలిసి అడవిలో ఉండగా అక్కడికి ఒక లేగ దూడ వచ్చింది. అది మందలోనిది కాదు. చూడటానికి చాల అందంగా ఉంది. శ్రీ కృష్ణుడు దానిని చూడగానే వచ్చింది ఎవరో కనిపెటేసారు. తన స్నేహితులను పిలిచి "గోపాలులారా! ఇటు చుడండి ఈ లేగదూడ ఎంత బాగుందో దీని తోక దీని కళ్ళు దీని కాళ్ళు ఎంత అందంగా ఉందొ చుడండి" అని చెపుతూ దాని దగరకు వచ్చి ఎవరు ఉహిచని విధంగా దాని నాలుగు కాళ్లను దాని తోకతో చుట్టి గిరగిరా తీపి పక్కనే ఉన్న వెలగా చెట్టుమీద వేశారు. గోపాలబాలురు కృష్ణా, కృష్ణా అంటుండగానే అంత జరిగిపోయింది. దూడ పడిన బరువుకి వెలగ చెట్లు ఒక దాని మీద ఒకటి పడి ఎనభై చెట్లు పడిపోయాయి. గోపాలురు ఏమిటి కృష్ణ దూడని చంపేసావు అని అనేలోపే ఆ దూడ కాస్త ఆరు కిలో మీటర్ల పొడవున్న వత్సాసురుడు అనే రాక్షసురికి మారిపోయాడు. గోపాల బాలురు అందరూ మా కృష్ణుడు ఏమి చేసిన మన మంచికే చేస్తాడు ఒక వెల్ల కృష్ణుడు ఆ రాక్షసుడిని చంపకపోతే వాడు మనలనందరిని చంపేసి తేనేసేవాడేమో అని భయపడరు. చనిపోయి పడిఉన్న రాక్షసుడి శరీరం చుటూ తిరుగుతూ ఆదుకున్నారు. శ్రీ కృష్ణుడు, బలరాముడు, గోపాలబాలురు అందరూ చీకటి పడక ముందే ఇళ్ళకి వెళ్లిపోయారు. శ్రీ కృష్ణుడు ఇంటికి వెళుతూనే వెనకే వచ్చిన గోపాల బాలురు అందరూ యశోదమ్మతో "యశోదమ్మ! ఈ రోజు శ్రీ కృష్ణుడు ఏమి చేసాడో తెలుసా ఒక రాక్షుసుడు లేగదూడ రూపములో వచ్చాడు. శ్రీ కృష్ణుడు దానిని చంపేశాడు" అని చెప్పారు. యశోదమ్మ భయపడుతూ ఆ నారాయణ స్వామికి "హే నారాయణ! నా కుమారుడిని వెంటే ఉంది రక్షించినందుకు నీకు కోటి కోటి ప్రణామాలు తండ్రి" అని క్షణం పెటింది. ఈ లోపు నందుడు, ఉప నందుడు అక్కడికి వచ్చారు. ఈ విషయం తెలుసుకొని శ్రీ కృష్ణుడికి ఇంత దూరం వచ్చిన ఆపదలు తప్పటం లేదు అనుకున్నారు కానీ వారికీ ఏదో దైవ శక్తీ వచ్చి శ్రీ కృష్ణుడిని రక్షిస్తుంది అని భావించారు. శ్రీ కృష్ణుడు ఈమాటలు అన్ని విని నవ్వుకొని ఊరుకున్నారు.

శ్రీ కృష్ణ - బృందావన పయనం

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...