భగవద్గీత
అద్యాయం 10
శ్లోకం 9
మచ్చిత్తా మద్గతప్రాణా భోధయంతః పరస్పరమ్ |
కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతిచ ||
అర్థం :-
నా భక్తులు నాయందే తమ మనస్సులను లగ్నం చేస్తారు. తమ ప్రాణములను, తమ కర్మలన్నింటిని, తమ సర్వస్వము నాకే అంకితం చేస్తారు. వారు పరస్పర చర్చలద్వారా నా మహత్త్వము గూర్చి ఒకరికొకరు తెలుపుకొను, కథలు కథలుగా చెప్పుకొంటు, నిరంతరము సంతుష్టులు అవుతున్నారు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి