శ్రీ కృష్ణ - మది చెట్టులా శాపవిమోచన లీల

శ్రీ కృష్ణ

శ్రీ కృష్ణుడు, నల్లకుబేర మణిగ్రీవులకు శాప విముక్తిని ప్రసాదించిన లీల  



యశోదమ్మ చిన్ని కృష్ణుడుని రోలుకు కాటేసి ఇంటిలోకి వెళ్లిపోతుంది. చిన్ని కృష్ణుడు రోలుని విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూ ఏడుస్తూ ఉన్నారు. కొంతసేపటి తరువాత చిన్ని కృష్ణుడు పాకటం మొదలు పెట్టారు. ఆయనతో పాటు రోలు కూడా దొర్లుకుంటూ వస్తుంది. చిన్ని కృష్ణుడు పాకుతూ రెండు మది చెట్టుల మధ్య నుంచి వెళ్లారు. ఆయనతో పాటు రోలుకూడా వచ్చింది. రోలు మది చెట్టులా నుంచి వెళ్లక చిన్ని కృష్ణుడు గట్టిగా లాగేసరికి మది చెట్టులు రెండు విరిగి పడిపోయి అందులో నుంచి ఇద్దరు దివ్య పురుషులు బయటకు వచ్చారు. వచ్చిన వారు చిన్ని కృష్ణుడు పరబ్రహ్మముగా భావించి స్తోత్రం చేసారు. చిన్ని కృష్ణుడు ఏమి తెలియని వాడిలా అమాయకంగా ఏడుస్తున్నారు. ఆ దివ్య పురుషులకు అసలు శాపం ఎలావచింది.



ఒకరోజు కుబేరుడి కుమారులైన నల్లకుబేర మణిగ్రీవులు ఆకాశ గంగలో గాంధర్వకన్యలతో దిగ్బంగారంగా స్నామము ఆచరిస్తున్నారు. అంతలో అటువైపు ఆకాశమార్గములో నారదమహర్షి వెళుతున్నారు. నారద మహర్షిని చుసిన గంధర్వకన్యలు వెంటనే వస్త్రాలను కట్టుకొని నారదునికి నమస్కరించారు. నల్లకుబేర మణిగ్రీవులు మాత్రం మద్యం మత్తులో నారదమహర్షిని నమస్కరించలేదు కదా కనీసం పాటించుకోలేదు. అపుడు నారద మహర్షి ఇలా అనుకున్నారు. ధనాధిపతిఅయిన కుబేరుని కుమారులు అతని సంపదకు వారసులు అయ్యారు కానీ అతని సంస్కారానికి వారసులు కాలేకపోయారు. వారిని దారిలోకి తీసుకురావాలి అనుకున్నారు. నల్లకుబేర మణిగ్రీవులతో నారద మహర్షి మీకు పెద్దల పట్ల భయభక్తులు లేవు. మహర్షులు సన్యాసులను గౌరవించాలి అని జ్ఞానం లేదు. పెద్దల ఎదుట ఇలా దిగంబరంగా ఉండకూడదు అని లేదు. మీరు నూరు దివ్య సంవత్సరములు మది చెట్లుగా పడియుండండి. నూరు దివ్య సంవత్సరముల తరువాత శ్రీమహా విష్ణువు భూలోకములో నందవ్రజంలో కృష్ణుడికి అవతరిస్తారు. ఏమి తెలియని అమాయకపు చిన్ని కృష్ణుడికి నమస్కరించే రోజు వస్తుంది అని చేపి నారదుడు అక్కడి నుంచి వెళ్లిపోయారు. నల్లకుబేరుల, మణిగ్రీవులు వెంటనే మది చెట్టులుగా మారిపోయారు. ఆలా బయటకు వచ్చిన దివ్య పురుషులు చిన్ని కృష్ణుడికి నమస్కరించి తమ వృతంతాని చేపి స్వామి మీ దయ వల్ల మాకు శాపవిమోచనం కలిగింది. ఎన్ని సంవత్సరాలుగా మీకోసం ఎదురు చూస్తాము అని చేపి చిన్ని కృష్ణుడికి నమస్కరించి వల్ల లోకానికి వెళ్లిపోయారు. మది చెట్టులు పడిన శబ్దం విని అందరూ పరిగెత్తుకు వచ్చారు. చిన్ని కృష్ణుడికి ఏమయిందో అని కంగారు పడుతూ వచ్చారు. యశోదమ్మ ఏడుస్తూ వచ్చి చిన్ని కృష్ణుడిని రోలు నుంచి విడదీస్తుంది. ఇంకా ఎప్పుడు రోలుకి కట్టాను అని ఏడుస్తుంది. చిన్ని కృష్ణుడు తన లీలలను తలుచుకొని నవ్వుకొని యశోదమ్మ ప్రేమను ఆస్వాదిస్తారు.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...