కార్తీక పురాణము 15వ రోజు

దీపం వెలిగించటం వలన ఎలుక పూర్వజన్మ స్మృతితో మానవరూపము పొందుట

15వ అధ్యాయము 

ఓ జనకమహారాజా!  కార్తీక మాసము నెలరోజులు చేయలేనివారు  కార్తీక శుద్ధ త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి రోజుల్లో అయినా నిష్టతో పూజలు చేసి ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి.  కార్తీక మాసంలో ఆవు పాలు పితికినంతసేపు మాత్రము దీపం ఉంచిన మరుజన్మలో బ్రాహ్మణుడిగా జన్మిస్తారు.  ఇతరలు ఉంచిన ఆరిపోతున్న దీపంని వృత్తి చేసినా,  ఆరిన దీపాన్ని మళ్ళీ వెలిగించిన పాపాలు హరిస్తాయి.  ఇందుకు ఒక ఇతిహాసం ఉంది  వినుమని  వశిష్ఠులవారు ఇలా చెప్పసాగారు. 



             పూర్వము సరస్వతి నది తీరమున  శిధిలమైన దేవాలయం ఒకటి ఉంది. కర్మనిష్ఠుడనే యోగి  ఆ దేవాలయం దగ్గరకు వచ్చి కార్తీకమాసం అంతా అక్కడే ఉండి పురాణపఠనము చేయాలని అనుకొని ఆపాడుబడిన దేవాలయాన్ని శుభ్రంగా ఊడ్చి నీళ్ళతో కడిగి బొట్లు పెట్టి పక్కన ఉన్న గ్రామంకి వెళ్లి ప్రమిదలు తెచ్చి దూదితో వత్తులు చేసి ఆవు నెయ్యితో దీపాలు వెలిగించి స్వామిని పూజించి పురాణపఠనము చేస్తున్నారు.  కార్తీకమాసం మొదలైనప్పటి నుంచి చేస్తున్నారు.  ఒకరోజు ఎలుక  దేవాలయం లోకి ప్రవేశించి నాలుగువైపులా తిరిగి ఏమీ దొరకక  అక్కడ ఆరిపోయిన వత్తిని తినాలని అనుకొని నోటికి కరచుకుని వెళుతుండగా అక్కడ పక్కన వెలుగుతున్న దీపానికి ఈ వత్తి కూడా అంటుకొని వెలిగింది. అది కార్తీక మాసం అవటం వలన అ ఎలుక పాపములు నశించి ఎలుక రూపము నుంచి మానవరూపానికి వచ్చింది.  ధ్యాననిష్ఠలో ఉన్న యోగిపుంగవుడు తన కళ్ళు తెరచి చూడగా అక్కడ నిలిబడిఉన్న మానవుడిని గమనించి "నువ్వు ఎవరు? ఎందుకు ఇక్కడ నుంచున్నావు? అని ప్రశ్నించగా "ఆర్య! మునివర్యా నేను ఒక ఎలుకను రాత్రి నేను ఆహారము వెదుకుకొంటూ ఈ దేవాలయాములోకి వచ్చి ఇక్కడ కూడా ఏమి దొరకక నెయ్యి వాసనా వస్తున్న వత్తిని తినటానికి తీసుకువెళుతుండగా నా అదృష్టం కొద్దీ ఆ వత్తి వెలగటం వలన నా పాపములు పోయి నాకు మానవరూపం వచ్చింది. ఓ మహానుభావా! నేను ఎందుకు ఈ ఎలుక జన్మమము ఎత్తవలసి వచ్చింది. దానికి గల కారణం ఏమిటో వివరించండి"  అని కోరాడు.  అపుడు ఆ ముని దివ్యదృష్టిచే సర్వస్వము తెలుసుకొని "ఓయి! నువ్వు పూర్యజన్మలో ఒక బ్రాహ్మణుడవు.  కానీ నిన్ను బాహ్లికుడు అని పిలిచేవారు.  నీ కుటుంబాన్ని పోషించటానికి వ్యవసాయము చేస్తూండేవాడివి.  ధనముపై ఆశతో దేవపూ,జలు నిత్యకర్మలు మరచి నీచుల సహవాసము వలన నిషిద్ధ పదార్ధములు తినటం వలన మంచివారాలను, యోగ్యులను నిందించుచు పరులచెంత స్వార్ధచింత గలవాడై ఆడపిల్లలను అమ్మువృతిని చేస్తూ, దాని వలన సంపాదించిన ధనాన్ని కూడబెట్టుకొని, సమస్థ తినుబండారాలను కారుచౌకగా కొని తిరిగి వాటిని ఎక్కువ ధనానికి నీవు అనుభవించక ఇతరులకు ఇవ్వక ఆ ధనమును భూస్థాపితం చేసి పిసినారివై జీవవించావు. మరణించిన తరువాత ఎలుక జన్మమెత్తి వెనుకటి జన్మ పాపములు అనుభవిస్తునావు. నేడు భగవంతుని దగర ఆరిన దీపాన్ని వెలిగించినందువలన పుణ్యాత్ముడవు అయ్యావు. దానివలన నీకు తిరిగి పూర్వజన్మ ప్రాప్తించింది. కనుక నువ్వు నీ గ్రామానికి వెళ్లి ని పెరడులో నువ్వు దాచిన ధనాన్ని త్రవ్వి, ఆ ధనంతో దానధర్మాలు చేసి భగవంతుని ప్రార్థించికొని మోక్షము పొందుతావు" అని అతనికి హితబోధ చేసారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...