కార్తీక పురాణము 4వ రోజు

దీపరాధనా మహిమ 

4వ అధ్యాయము 

        జనకమహారాజు వశిష్ఠునితో "మహతపస్వీ! మీరు చెపుతున్న ఇతిహాసాలు విన కొద్దీ వినాలి అనిపిస్తుంది.  కార్తీక మాసంలో ఇంకా ఏమేమి చేయాలి, ఎవరిని పూజించాలి వివరించండి. అని వశిష్ఠులవారిని కోరారు. 

         జనకమహారాజ! కార్తీక మాసంలో సర్వసత్కార్యములు చేయవచ్చును. దీపారాధన అందులో ముఖ్యమైనది. దీనివలన ఎంతో పుణ్యం కలుగుతుంది.  శివకేశవుల ప్రీతికొరకు శివాలయములో గాని, విష్ణు ఆలయములో గాని దీపారాధన చేయవచ్చును. సూర్యాస్తమయసమయంలో, అనగా సంధ్య చీకటిపడు సమయమున శివకేశవుల సన్నిధిని గాని దీపారాధన చేసినవారి సర్వపాపములు పోయి వైకుంఠమునకు వెళ్ళతారు. కార్తీక మాసములో హరిహరాదుల సన్నిధిలో ఆవునేతితో గాని, కొబ్బరి నూనెతో గాని, అవిసె నూనెతో గాని, విప్ప నూనెతో గాని,  ఏది దొరకనప్పుడు ఆముదముతో గాని దీపారాధన చేయాలి.  దీపారాధన ఏ నూనెతో చేసిన పుణ్యాత్ములు గాను, భక్తి పరులుగాను, నగుటయేగాక అష్టఐశ్యర్వములు కలిగి చివరికి శివసానిధ్యం చేరుకుంటారు.  ఇందుకు ఒక కథ ఉంది విను. 

  శతృజిత్కథ 

         పూర్వము పాంచాల దేశమును పాలించు రాజుకు సంతతి లేక అనేక యజ్ఞయాగాదులు చేసి, చివరకు విసుగు చెంది గోదావరి తీరములో నిష్ఠతో తపస్సు చేస్తున్న సమయంలో అక్కడికి పిప్పలాదుడను మునిపుంగవుడు వచ్చి " పాంచాల రాజా! నీవు ఎందుకు తపస్సు చేస్తున్నావు? నీ కోరిక ఏమిటి?" అని అడుగగా "ఋషిపుంగవా! నాకు అష్ట ఐశ్వర్యములు, రాజ్యము, సంపదలు, ఉన్న నా వంశం నిల్పుటకు పుత్రసంతానం లేక ఈ తీర్ధ స్థానమున తపమాచరిస్తున్నాను. అప్పుడు ముని పుంగవుడు "రాజా! కార్తీక మాసములో శివసన్నిధిలో శివుని ప్రీతికొరకు దీపారాధన చేసిన నీ కోరిక తీరుతుంది" అని చేపి వెళ్లిపోయారు. 

      వెంటనే రాజు రాజ్యమునకు చేరుకొని పుత్రప్రాప్తి కోసం అతి భక్తితో శివాలయమునకు వెళ్లి కార్తీక మాసము మొత్తం దీపారాధన చేయించి దానధర్మాలు నియమానుసారంగా వ్రతము విడువకుండా నెల రోజులు చేసారు. అందుకు ఫలితముగా రాజు భార్య గర్భవతి అయి ఒక శుభముహూర్తాన పుత్రునకు జన్మను ఇచ్చింది. రాజు సంతోషించి పుత్రోత్సవములు, బ్రాహ్మణులకు దానములు చేసారు. ఆ బాలునికి శత్రజిత్తు అని నామకరణం చేసారు. తనకి కార్తీకమాసవ్రత ఫలితముగా తనకు పుత్ర సంతానం కలగటం వలన దేశమంతా కార్తీకమాస వ్రతాలు దీపారాధనలు చేయాలనీ రాజు శాసనం చేసాడు. 

         రాకుమారుడు దినదిన ప్రవర్ధమానము అయి సకలశాస్త్రములు, ధనుర్విద్య, కత్తిసాము, మొదలైనవి నేర్చుకొన్నాడు. కానీ యవ్వనంలో అడుగుపెట్టిన తరువాత దుష్టుల సావాసం వలన రాకుమారుడు తన కంటికి ఇంపుగా ఉన్న స్త్రీలను బలాత్కరించుచు, ఎదిరించిన వారిని దడించెను. 

    తల్లిదండ్రులుకూడా తమకు లేకలేక కలిగిన సంతానని చూసి చూడనట్టు ఉండేవారు. ఇది ఇలాఉండగా ఒక రోజు రాకుమారుడు విధులలో తిరుగుతుండగా ఒక బ్రాహ్మణపడతిని చూసి మోహించెను.  రాకుమారుడు ఆమెవద్దకు వెళ్లి తన కోరికను తెలియజేసెను. ఆ బ్రాహ్మణపడతికూడా అంగీకరించెను. వీరి బంధం కొంతకాలం సాగింది. వీరి గురించి ఆమె భర్తకి తెలిసింది. ఒకరోజు వారు ఇంటికి దూరంగాఉన్న పాడుబడిన శివాలయములో కలుసుకోవాలంని అనుకొని ఎవరిదారిన వారు బయలుదేరారు. ఈ విషయం తెలుసుకున్న ఆమె భర్త వల్ల కన్నా ముందే అక్కడికి చేరుకున్నాడు. కొంత సేపటికి వారు వచ్చారు. అక్కడ చీకటిగా ఉండటంతో దీపముంటే బాగుండును అనుకొన్నారు. అక్కడే ఉన్న ఆముదము ప్రమిదగాలో ఆమె తన చీరను చించి వతిగాచేసి దీపము వెలిగించింది. అదును కోసం చూస్తున ఆమె భర్త తనతో తెచ్చుకొని కత్తితో ఆమెను రాకుమారుడిని ఒకేసారి చంపాడు. అతనుకూడా అదేకత్తితో మరణించాడు. 

           ప్రేమికులిద్దరిని తీసుకొనిపోవటానికి శివదూతలు వచ్చారు. ఆ బ్రాహ్మణుడిని తీసుకొని పోవటానికి యమదూతలు వచ్చారు. ఆ బ్రాహ్మణుడు యమదూతలతో "ఓ దూతలారా! నన్ను తీసుకొని పోవుటకు మీరు ఎలావచ్చారు. ఆ వ్యభిచారులు కొరకు శివదూతలు ఇలా వచ్చారు అని ప్రశ్నించెను".అందుకు యమదూతలు "ఓ బ్రాహ్మణుడా! వారు ఎంత నీచులైనను తెలిసోతెలియకో శివాలయములో కార్తీక పౌర్ణమి రోజునా దీపారాధన చేసారు.అందుకే వారు చేసిన పాపములు పోయి శివ సాన్నిధ్యం లభించింది". ఈ సంభాషణ విన రాకుమారుడు " అలా ఏనాటికి జరుగనివ్వను. తప్పొప్పులు ఎలాగున్నా మేము ముగ్గురము ఒకేరోజు, ఒకే స్టలములో, ఒకే సమయంలో మరణించాము. కనుక ఆ ఫలము మా అందరికి వర్తించవలసిందే".అని తాము చేసిన దీపారాధన ఫలములో కొంత ఆ బ్రాహ్మణునికి దానము చేసారు. ఆ బ్రాహ్మణుడు కూడా వారితో పాటు శివ సాన్నిధ్యం చేరెను.

         వినవుగా రాజా! కార్తీక మాసంలో శివాలయంలో దీపారాధన చేయట వలన ఆ ప్రేమికులు చేసిన పాపములు పోవటమే కాకుండా కైలాస ప్రాప్తి కలిగింది. కార్తీక మాసంలో నక్షత్రమాల యందు దీపముంచినవారు జన్మరాహిత్యం పొందుతారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...