కార్తీక పురాణము 1వ రోజు

కార్తీక మాస మహత్యం 

ఒకనాడు శౌనకాది మునులు సూతుని పిలిచి "మునివర్యా ! తమవలన ఎన్నో పురాణాలు వేదవేధగాములను వివరించారు.  అలాగే మాకు కార్తీక మాసా మహత్యం గురించి తెలుసుకోవాలని ఉంది" అని అడుగుతారు.  

సూతమహర్షి "ఓ శౌనకాది మునులారా! ఒకప్పుడు ఇదే కోరికను నారదుడు బ్రహ్మను కోరగా బ్రహ్మ ఇలా చెప్పారు.  ఈ కథను వినటం వలన మానవులకు ధర్మార్ధములు కలగటమే కాకుండా సకలైశ్వర్యములతో తులతూగుతారు. 

పూర్వకాలమునందు పార్వతి పరమేశ్వరులు ఆకాశంలో విహరిస్తుండగా పార్వతిమాత పరమేశ్వరుడుని స్వామి సకలైశ్వర్యములు కలుగచేసేది,  సకల మానవులు ఆచరించే వ్రతమును వివరింపుము అని కోరుకుంటుంది. 

దేవి! నీవు అడుగుతున్న వ్రతమును గురించి ఇపుడు మిథిలానగరములో వశిష్ఠుడు జనకమహారాజుకి చెపుతున్నాడు విందువు గాని అని మిథిలానగరమువైపు చూపించెను.

    మిథిలానగరానికి వశిష్ఠుడు జనకమహారాజు దగరకు వస్తాడు. జనకమహారాజు వశిష్ఠ మహర్షిని సాదరంగా ఆహ్వానించి అర్ఘ్య పాద్యములు ఇచ్చిన తరువాత జనకమహారాజు మహర్షిని మునివర్యా సంవత్యరములో గల మాసములో కార్తీక మాసము ఎందుకు అంత విశిష్టిమైనది. ఆ మాసము గురించి వివరించండి అని అడుగుతారు. 

  జనకమహారాజా ఈ కార్తీక మాసము హరిహర స్వరూపము. ఈ మాసమునందు ఆచరించు వ్రతము ఇచ్చే ఫలితము అంత ఇంత కాదు. వినినంతనే నరకబాధలను, పాపములను తొలగించేది. సుఖసంతోషాలను కలిగించేది. శ్రద్ధగా విను అని వశిష్ఠుడు వివరించెను. 

కార్తీకమాసా వ్రతవిధానము 

ఓ జనకమహారాజా! ఏ మానవుడైన, ఏ వయస్సువాడైనా, కార్తీక మాసంలో, సూర్యభగవానుడు తులారాశిలో ఉన్నపుడు వేకువజామునే లేచి కాలకృత్యాలు తీర్చుకొని, స్నామాచరించి, దేవతారాధన, దానధర్మములును  చేసినచో ఆకాండమైన పుణ్యఫలము లభిస్తుంది. విష్ణు సహస్రనామార్చన, శివలింగార్చన ఆచరించవలెను. ముందుగా కార్తీక మాసామునకు అధిదేవత అయినా దామోదరుని ప్రార్ధించాలి. ఓ దామోదర నేను ఆచరిస్తున్న ఈ వ్రతముకు ఎటువంటి ఆటంకము కలగకుండా కాపాడమని ప్రార్ధించి వ్రతమును ఆరంబించాలి.  

కార్తీక స్నానవిధానము

ఓ రాజా! ఈ వ్రతమును ఆచరించు రోజులలో సూర్యదయమునకు పూర్వమే నిద్ర లేచి కాలకృత్యాలు తీర్చుకొని నదీస్నానము ఆచరించి గంగకు శ్రీమన్నారాయణునకు, పరమేశ్వరునకు, భైరవునికి నమస్కరించు సంకల్పం చెప్పుకొని, మరల నీటమునిగి సూర్యభగవానునికి అర్ఘ్యపాద్యములు ఇచ్చి పితృదేవతలకు క్రమ ప్రకారం తర్పణములొసగి గట్టుపై మూడు దోసిలి నీళ్ళు పోయాలి.ఈ కార్తీక మాసములో నదులయందు స్నానమాచారించుట గొప్ప ఫలితము లభిస్తుంది. శ్రీ మహా విష్ణువుకు ప్రీతికరమైన పూవులతో ధూపదీప నైవేద్యాలతో పూజించాలి. తరువాత అతిధి అభ్యాగతులను పూజించి వారికీ ప్రసాదము తన ఇంటివద్దగాని, దేవాలయము వద్దగాని,  రావిచెట్టు వద్దగాని  కార్తీక పురాణం పారాయణం చేయాలి. సాయంకాలం శివాలయంలోగాని, విష్ణువులయంలోగాని, తులసికోటవద్దగాని దీపారాధనచేసి శక్తినిబట్టి నైవేద్యం తయారుచేసి స్వామికి సమర్పించి అందరికి పంచిపెట్టి తరువాత తాను తినాలి. తరువాతి రోజు మృష్ఠానముతో భోజనం చేయాలి. ఈ విధముగా వ్రతము ఆచరించు మానవులందరికి పాపమూ పోయే మోక్షం కలుగును.



          






కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...