కార్తీక పురాణము 6వ రోజు

దీపధానవీధి మహత్యం 

6వ అధ్యాయము



ఓ మహారాజ! ఏ మానవుడు కార్తీకమాసము నెలరోజులు పరామేశ్వరుని, శ్రీ మహా విష్ణువును, పంచామృతస్నానము చేయించి కస్తూరి తిలకము కలిపినా మంచి గంధము గంధము నీటితో భక్తిగా పూజ చేసిన అట్టివానికి ఆశ్వమేధయాగము చేసిన ఫలితము వస్తుంది. అలాగే ఏ మానవుడు కార్తీక మాసమంతయు దేవాలయములో దీపారాధన చేసారో వారికీ కైవల్యము ప్రాప్తిస్తుంది. దీపదానము చేయుటం ఎలాగంటే పైడిప్రతి తానే స్వయముగా తీసి శుభ్రం చేసి, వత్తులను చేయవలెను. వరిపిండితో గాని, గోధుమపిండితోగాని ప్రమిదవలె చేసి వత్తులు వేసి, ఆవునేయి నిండుగాపోసి దీపమును వెలిగించి బ్రాహ్మణునికి దానము ఇవ్వాలి.శక్తికొద్దీ దక్షిణ కూడా ఇవ్వాలి. ఇదే విధముగా కార్తీక మాసములో ప్రతి రోజు చేసి ఆఖరి రోజునా వెండితో ప్రమిదను చేయించి బంగారముతో వత్తిని చేయించి ఆవునేయి పోసి  గోధుమపిండి ప్రమిదలో దీపమును వెలిగించి ప్రతిరోజు ఇస్తున్న బ్రహ్మణుడికే దానము ఇవ్వాలి. ఇలా చేసిన వారికీ సకలైశ్వర్యాలు కలుగటమే కాకుండా మోక్షప్రాప్తి కలుగుతుంది. ఈ విధముగా దీపదానము చేసిన తరువాత బ్రాహ్మణా సమారాధన చేయాలి. శక్తీ లేనివారు కనీసం పది పది మంది బ్రాహ్మణులకైనా భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలు ఇవ్వాలి. దీనికి ఒక కథ ఉంది చెపుతాను విను జనకమహారాజా.  అని వశిష్ఠుడు చెప్పసాగాడు. 

         లోభియైన వితంతువుకు మోక్షం కలుగుట 

పూర్వం ద్రవిడ దేశమున ఒక గ్రామములో ఒక స్త్రీ ఉన్నది. ఆమెకు పెళ్లి అయినా కొంతకాలానికే భర్త చనిపోయాడు. సంతానంగాని, ఆఖరికి బంధువులుగాని లేరు. అందుకే ఆమె ఇతరుల ఇంట్లో పని చేసుకొని భ్రాతుకుతుంది. అక్కడే భోజనంచేస్తూ వారు సంతోషముతో ఏమయినా వస్తువులు ఇస్తే వాటిని ఎక్కువధరకు అమ్ముకొని ఆ విధముగా తన వద్ద ఉన్న సొమ్మును వడ్డీలకు ఇచ్చి మరింత డబ్బును కూడబెట్టుకొని, దొంగలుతెచ్చిన బంగారు ఆభరణములు తక్కువధరకు తీసుకొని వాటిని ఎక్కువ ధరకు అమ్ముకొనేది. 

       ఈ విధిగా కూడబెట్టిన ధనమును తను తినక ఇతరులకి పెట్టక దానధర్మాలు చేయక లోభంబుద్ధితో ఉండటమే కాకుండా పూజలుచేసేవారిని, తీర్ధయాత్రలు చేసేవారిని చూసి అవహేళన చేసేది. 

         కొంతకాలము తరువాత ఆ గ్రామమునకు ఓక బ్రాహ్మణుడు వచ్చాడు. అక్కడే ఒక సత్రములో బస చేసారు. ఆ బ్రాహ్మణుడు గ్రామములో మంచిచెడులు తెలుసుకొని ఆ స్త్రీ గురించికూడా తెలుసుకొని ఆమెవద్దకు వెళ్లి "అమ్మ! నేను చెప్పే హితవచనములు విను నీకు కోపం వచ్చిన సరే నేను చెప్పే మాటలు విను అమ్మ. మన శరీరము శాశ్వతము కాదు.నీటి బుడగ వంటిది.  ఏక్షణము మృత్యువు మనలను తీసుకొని పోతుందో చెప్పలేరు.పంచభూతాలు, సప్తధాతువులు నిర్మిచబడిన ఈ శరీరములోని ప్రాణము, జీవము పోగానే చర్మము, మాంసము కుళ్ళి దుర్వాసన వస్తుంది. అసహ్యముగా తయారవుతాయి. అటువంటి ఈ శరీరాన్ని శాశ్వతమని భ్రమపడుతున్నావు. ఇప్పటికైనా నా మాట విని నీవు తినక ఇతరులకి పెట్టక అన్యాయముగా సంపాదించినా సంపదను కార్తీక మాసములో పేదలకు దానధర్మాలు చేసి ప్రతిరోజూ దేవాలయములో గోధుమపిండితోగాని బియ్యంపిండితో గాని ప్రమిద చేసి అందులో ఆవునేయి వేసి దీపము వెలిగించి బ్రాహ్మణుడికి దానముఇవ్వు. ఇలా నెల అంతాచేసి ఆఖరున వెండి ప్రమిదలో బంగారు వత్తి వేసి అదే బ్రాహ్మణుడికి దానము చేయి అమ్మ.  తరువాత బ్రాహ్మణ సమారాధన చేయాలి ఇట్లా ప్రతి సంవత్సరము చేయి నీవు చేసిన పాపములు పోయి సకలైశ్వర్యములు నీ మరణము తరువాత కైవల్య ప్రాప్తి కలుగుతుంది. అంతా విన ఆ స్త్రీకి జ్ఞానోదయము అయి మీరుచెపినటే చేస్తాను స్వామి అని నమస్కరించింది. ఆ బ్రాహ్మణుడు ఆ స్త్రీని ఆశీర్వదించి వెళిపోయాడు. అప్పటి నుంచి ఆ స్త్రీ తన లోభబుద్ధిని విడి ఆ బ్రాహ్మణుడు చేపినతే చేసింది. చివరికి ఆమె మరణానంతరం మోక్షం పొంది శైవల్యం పొందింది. 




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...