కార్తీక పురాణము 10వ రోజు

 అజామీళుని పూర్వజన్మ వృత్తాంతము 

10 అధ్యాయము



                        జనకుడు వశిష్ఠమహర్షిని ఇలా అడిగారు. " మునిశ్రేష్టా!  ఈ అజామిళుడు ఎవరు?  అతని పూర్వజన్మ వృత్తాంతం ఏమిటి?  పూర్వజన్మమున ఎటువంటి పాపములు చేశాడు? విష్ణుదూతలు వైకుంఠమునకు తీసుకువెళ్ళిన తర్వాత ఏమి జరిగింది?  వివరించండి." అని ప్రార్థించాడు. వశిష్ఠులా వారు ఇలా చెప్పసాగారు.  

                 జనకమహారాజా! అజామిళుని విష్ణుదూతలు వైకుంఠమునకు తీసుకుపోయిన తర్వాత యమకింకరులు తమ ప్రభువు యమధర్మరాజు దగ్గరికి వెళ్లి " ప్రభు! తమ ఆజ్ఞ ప్రకారం అజామిళుని తీసుకురావడానికి వెళ్ళాము. అక్కడకు విష్ణుదూతలు వచ్చి మాతో వాదించి అజామీళుని విమాన మెక్కించి వైకుంటమునకు తీసుకొనివెళ్ళారు.  ఇంకా ఏమీ చేయలేక చాలా విచారంగా ఇక్కడికి వచ్చాము"  అని భయకంపితులై విన్నవించుకున్నారు. 

             "ఎంత పని జరిగింది? ఎప్పుడు ఇలా జరగలేదు? దీనికి బలమైన కారణం ఏమైనా ఉందా?"  యమధర్మరాజు దివ్యదృష్టితో అజామీళుని పూర్వ జన్మ వృత్తాంతం తెలుసుకొని " ఓ! ఆదా సంగతి! తన మరణ సమయములో 'నారాయణ' అని వైకుంఠవాసుని నామస్మరణ చేసినందు వలన విష్ణుదూతలు వచ్చి తీసుకుని వెళ్లారు. తెలిసి గాని తెలియక గాని ఎవరు  హరినామస్మరణ చేసిన వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది.  కనుక అజామిళుని వైకుంఠ ప్రాప్తి కలిగింది" అని అనుకొన్నారు. 

                అజామిళుడు పూర్వ జన్మలో మహారాష్ట్ర  దేశమున ఒకానొక శివాలయములో అర్చకునిగా ఉన్నాడు.  అతడు తన  అందము వలన, సిరిసంపదల వలన బలము వలన అహంకారి అయ్యాడు.  శివారాధన చేయక, శివాలయము యొక్క ధనమును అపహరిస్తూ, శివుని విగ్రహం వద్ద ధూపదీపనైవేద్యాలు పెట్టకుండా, చెడు సావాసాలు చేస్తూ విచ్చలవిడిగా తిరుగుతూ ఉండేవాడు. ఇతనికి ఒక బీదబ్రాహ్మణస్త్రీతో రహస్య సంబంధం ఉండేది. ఆమె కూడా అందమైనది అవటం వలన  చేసేదిలేక ఆమె భర్తగా కూడా చూసి చూడనట్టు ఉండేవాడు.  అతను బిక్షాటనకై ఊరూరా తిరుగుతూ ఎదోఒకవేళ ఇంటికి తిరిగి వచ్చేవాడు.  ఒకనాడు పొరుగూరికి వెళ్లి యాచనచేసి పెద్దమూటతో బియ్యము, కూరగాయలు నెత్తిన పెట్టుకొని వచ్చి అలసిపోయి ఇంటికి వస్తూనే భార్యతో "  నాకు ఈ రోజు ఆకలి ఎక్కువగా ఉంది. త్వరగా వంట చేసి పెట్టు" అని అన్నాడు.   అందుకు ఆమె చీదరించుకొని కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు కూడా ఇవ్వకుండా అతని వంక కన్నెత్తి అయినా చూడకుండా అజామీళునిపై ప్రేమాతో భర్తని తిట్టడంతో భర్తకు కోపం వచ్చి మూలనున్న కర్రతో కొట్టాడు. అందుకు ఆమె భర్త దగ్గర ఉన్న కర్రను లాకొని భర్తను రెండింతలు కోట్టి బయటకు తోసి తలుపు వేసింది. అతను చేసేది లేక భార్యపై విసుగు చెంది ఇంటి ముఖము చూడకూడదని దేశాటనకు వెళ్ళిపోయాడు. భర్త ఇంటినుండి వెళిపోయాడు అని సంతోషించి, ఆమె ఆ రాత్రి బాగా ముస్తాబు అయి వీధి అరుగుమీద కూర్చొని ఉండగా ఒక చాకలి వాడు ఆ దారిన వెళుతున్నాడు. అతనిని పిలిచి "ఓయి! నివు ఈ రాత్రికి నాతో ఉంటావా" అని కోరింది. అందుకు ఆ చాకలి "తల్లి! నీవు బ్రాహ్మణస్త్రీవి. నేను చాకలి వాడిని మీరు నన్ను ఇలా పిలవటం మంచిదికాదు. నేను ఇటువంటి పాపమూ చేయ్యను" అని బుద్ధిచెపి వెళిపోయాడు. ఆమె ఆ చాకలివాని అమాయకత్వానికి లోలోపల నవ్వుకొని అక్కడినుంది బయలుదేరి అజామీళుని దగ్గరకు రాత్రిఅంతా అతనివద్ద గడిపి ఉదయం ఇంటికివచ్చి "అయ్యో!నేను ఎంతపని చేశాను?ఎంతటి పాపమూ చేశాను? అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకొని భర్తను ఇంటినుండి వెళ్లగొట్టి క్షణికమైన ఆవేశానికి లోనయి. మహా అపరాధము చేశాను" అని పశ్చాత్తాపము చెందింది. ఒక కూలి వాడిని పిలిపించి కొంత ధనము ఇచ్చి తన భర్తను వెతికి తీసుకురావలసిందిగా పంపింది. కొన్ని రోజులు గడిచిన తరువాత భర్త ఇంటికి రాగానే అతని పాదాలపై పడి తన తప్పులు క్షమించమని వేసుకొంది. అప్పటినుండి ఆమె మంచి నడవడికతో భర్త అనురాగానికి పాత్రురాలి అయింది. కొంత కాలానికి అజామీళునికి వ్యాధి సంక్రమించి రోజురోజుకి క్షిణించి మరణించాడు. అతడు అనేక నరక భాధలు అనుభవించి పొంది మళ్ళి నరజన్మ ఎత్తి సత్యవ్రతుడు అని బ్రాహ్మణుడికి కుమారుడై కార్తీకమాసంలో నదీస్నానము చేసి దేవతదర్శనం చేసి ఉండటంవలన నేడు జన్మముల పాపమూ నశించటంవలన అజామీళుడై పుట్టాడు. ఇపుడు తన మరణసమయంలో 'నారాయణ' అని శ్రీహరి నామస్మరణా వలన వైకుంఠమునకు వెళ్ళాడు.

         బ్యాహ్మణుని భార్య కూడా రోగగ్రస్తురాలై చనిపోయేది. నరకములో అనేక నరకభాదలు అనుభవించి ఒక మలవాని ఇంట జన్మించింది. ఆ మలవాడు ఆ పిల్లను జన్మరాశి చూపించగా తండ్రిగండమున పుటింది అని జ్యోతిష్కుడు చెప్పాడు.  ఆ మాలవాడు ఆ పిల్లని తీసుకెళ్లి అడవిలో వదిలిపెట్టాడు. అంతలో ఒక విప్రుడు ఆ దారిన పోతున్నప్పుడు పిల్ల ఏడుపు విని జాలి కలిగి తీసుకొని పోయి తన ఇంటి పనివాళ్ళకి ఇచ్చి పోషించాని చెప్పాడు. ఆ బాలిక అజామీళుని ప్రేమించింది. ఇదివారి పూర్వజన్మ వృత్తాంతం.

             నిర్మలమైన మనసుతో శ్రీహరిని ధ్యానించటం, దానధర్మాలు చేయడం, శ్రీహరి కథలను వినడం, కార్తీక స్నానం ప్రభావము వలన ఎంతటి వారైనా మోక్షం పొందగలరు. కావున కార్తీకమాసంలో వ్రతములు, పురాణ శ్రవణం చేసిన వారికి ఇహపరసుఖమును పొందగలరు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...