కార్తీక పురాణము 3వ రోజు

కార్తీక స్నాన మహిమ 

3వ అధ్యాయము 

            జనకమహారాజా! కార్తీక మాసమున ఏ ఒక చిన్న దానమును చేసినా, అది గొప్ప ప్రభావము ఉంటుంది. అటువంటి వారికీ సకలైశ్వర్యములు కలుగటమే కాకుండా మరణం తరువాత శివ సాన్నిధ్యమును చేరుతారు. కానీ కొంతమందు భోగభాగ్యములు విడువలేక కార్తీక స్నానములు చేయక,  అవినీతిపరులై చివరకు బ్రహ్మరాక్షస జన్మను ఎత్తుతారు.  దీనిని గురించి ఒక కధ ఉంది శ్రద్ధగా విను రాజా.

బ్రహ్మరాక్షసులు ముక్తి కలుగుట 

        ఈ భారతఖండమందు దక్షిణ ప్రాంతములో ఒక గ్రామములో మహావిద్యాసుడు, తపశ్శాలి, జ్ఞానశాలి, సత్యవాక్య పరిపాలకుడు అగు 'తత్వనిష్ఠు'డను బ్రాహ్మణుడు ఉండేవాడు. ఒకనాడు ఆ బ్రాహ్మణుడు తీర్థయాత్రాలకు ఆకాండ గోదావరికి బయలుదేరారు. ఆ తీర్థసమీపమున ఒక మహా వృక్షము పై భయంకరమైన ముఖంతో, పొడవైనాజుట్టుతో, బలమైనకోరాలతో, నల్లనిబానపొట్టతో భయంకరమైన ముగ్గురు బ్రహ్మరాక్షుసులు ఉండేవారు. ఆ దారిన వెళేవారిని చంపి భుజిస్తూఉండేవాళ్లు. అదే దారిన వచ్చిన ఆ బ్రాహ్మణుడిని కూడా చంపితినాలని అతని మీద దాడి చేసారు. ఆ బ్రాహ్మణుడు భయంతో నారాయణ స్తోత్రం చేసాడు. నారాయణ స్తోత్రం వినటం వలన బ్రహ్మరాక్షసులు పూర్వజన్మ జ్ఞానము కలిగింది. మమ్మలిని కాపాడండి అని ఆ బ్రాహ్మణుడి కాళ్లపై పడారు. వారి మాటలకూ కొంత ధర్యము తెచ్చుకొని "మీరు ఎవరు అని అడిగాడు" అందుకు ఆ బ్రహ్మరాక్షసులు "ఓ బ్రహ్మణోత్తమ! మీరు పూజ్యులు, వ్రతనిష్ఠగరిష్ఠులు, మీ దర్శమభాగ్యం వలన మాకు పూర్వజన్మ జ్ఞానము కలిగింది". 

 మొదటి బ్రహ్మరాక్షసుడి వృత్తంతం 

         నాది ద్రవిడదేశము. బ్రాహ్మణుడును. నేను మహా పండితుడిని అని గర్వముగల వాడినై ఉన్నాను. న్యాయాన్యాయవిచక్షణలు మరిచి పశువులాగా ప్రవర్తించాను. బాటసారులవధ్ధ, అమాయకపు గ్రామస్తులవద్ద దౌర్జన్యముగా ధనము లాకొనేవాడిని, చెడు అలవాటులతో భార్య, పిల్లలను పాటించుకోకుండా ఉండేవాడిని.

        ఇలా ఉండగా ఒక రోజు ఒక బ్రాహ్మణుడు కార్తీకమాస వ్రతమును యధావిధిగా ఆచరించి బ్రాహ్మణా సమారాధన చేయటానికి సరుకులు తీసుకొని తిరుగు ప్రయాణములో మా ఇంటికి అతిధిగా వచ్చాడు. వచ్చిన ఆ బ్రాహ్మణుడిని నేను కొట్టి, తిట్టి అతని దగరున్న సరుకులను లాకొని బయటకి గెంటాను. అందుకు ఆ బ్రాహ్మణుడుకి కోపం వచ్చి "ఓరి నీచుడ అన్యాక్రాంతముగా సంపాదిచినది చాలక తోటి బ్రాహ్మణుడిని అనికూడా ఆలోచించకుండా నావద్ద ఉన్న సమస్తాన్ని లాకున్నావు. నీవు రాక్షసుడవై నిర్మానుష్య ప్రదేశములో నరమాంసభక్షకుడవై జీవింతువు గాక అని శపించాడు". నేను అతని కాళ్ళ పై పడి క్షమించమని వేడుకొన్నాను. అందుకు ఆ బ్రాహ్మణుడు గోదావరి క్షేత్రములో ఒక వటవృక్షము ఉంది. ఒక బ్రాహ్మణుడు కార్తీక మాస వ్రతము ఆచరించుచు అక్కడికి వస్తాడు. అతని వలన నీకు మోక్షం లభిస్తుంది. అని తన వృత్తంతం చెప్పాడు. 

 రెండొవ బ్రహ్మరాక్షసుడి  వృతాంతం 

           ఓ బ్రహ్మణోత్తమ! నేను కూడా పూర్వజన్మలో బ్రాహ్మణుడినే. నేను నీచుల సావాసం చేస్తూ తల్లి తండ్రులకు తిండి పెట్టక మాడ్చి భాదపెట్టాను. వారి ఎదురుగానే నేను నా భార్య పిలల్లతో పంచనక్షపరమణలను భుజించాను. నేను ఏటువంటి దాన ధర్మాలను చేయలేదు. నా బంధువులను కూడా హింసించి వారినుండి దనమును అపహరించాను. అందుకే నాకు ఈ రాక్షస జన్మ వచ్చింది. నన్ను రక్షించు అని ఆ బ్రాహ్మణుడి పాదాలపై పడి వేడుకొన్నాడు.

మూడోవ బ్రహ్మరాక్షసుడి వృత్తంతం 

        మహాత్మ! నేను సంపన్న కుటుంబంలో పుటిన ఒక బ్రాహ్మణుడిని. నేను విష్ణు ఆలయంలో అర్చకుడిగా ఉన్నాను. స్నానము అయినా చేయకుండా ఆలయంలో తిరుగుతూ దేవునికి పూజచేయకుండా భక్తులు తెచ్చిన వస్తువులను నా ఉంపుడుగతేకు ఇచ్చి మధ్యమాంసలను సేవిస్తూ పాపకార్యములు చేశాను. మరణానంతరం ఇలా రాక్షసుడిని ఆయను. నన్ను కూడా పాపవిముక్తుడిని చేయమని ప్రార్ధించాడు. 

            ఓ జనకమహారాజ! తపోనిష్ఠుడగు ఆ బ్రాహ్మణుడు రాక్షసుల దీనాలాపనలను విని "ఓ రాక్షసులారా! భయపడకండి. మీరు పూర్వ జన్మలో చేసిన ఘోరకృత్యాలు వల్ల మీకు ఈ రూపము కలిగింది. నా వెంట రండి. మీకు విముక్తిని కలిగిస్తాను." వారిని ఓదార్చి తనతో తీసుకొని ఆ ముగ్గురిని యాతన విముక్తి కోసం సంకల్పము చెప్పుకొని తానే స్వయముగా గోదావరి స్నానమాచరించి స్నానపుణ్యఫలమును ఆ ముగ్గురు బ్రహ్మరాక్షసులు ధారపోయగా వారి రాక్షస రూపాలు పోయి దివ్యరూపాలు ధరించి వైకుంఠానికి వెళారు. 

          జనకమహారాజా! కార్తీక మాసములో ఏదయినా నాది స్నానమాచరించినచో హరిహరాదులు సంతృప్తి నొంది, వారికీ సకలైశ్వర్యములు ప్రసాదింతురు. అందువలన, ప్రయత్నిచయినా సరే కార్తీక స్నానాల నాచరించాలి.



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...