దీపావళి

                  దీపావళి పండుగా రోజునా లక్ష్మి దేవిని పూజించటానికి ఒక విశిష్టత ఉంది.  పూర్వం దుర్వాస మహర్షి ఇంద్రుడి ఆతిధ్యానికి వెళతాడు.  ఇంద్రుడి సేవలను మెచ్చుకొని దుర్వాస మహర్షి అతనికి మహిమాన్విత హారాన్ని ఇస్తాడు.  ఇంద్రుడు దానిని తిరస్కరించి తన వాహనమైన ఐరావతానికి ఇస్తాడు. ఐరావతం ఆ మాలను కాలికింద వేసి తొక్కుతుంది. ఇది చూసి ఆగ్రహించిన దుర్వాస మహర్షి ఇంద్రుడుని శపిస్తాడు. ఇంద్రుడు తాత్కాలికంగా సర్వ సుఖాలను, సంపదలను పోగొట్టుకుంటాడు.

       ఇంద్రుడికి దిక్కుతోచక శ్రీహరిని శరణు వేడుకుంటాడు. అప్పుడు శ్రీమహా విష్ణువు అతనికి నూనెతో ఒక దీపాన్ని వెలిగించి శ్రీమహాలక్ష్మిని ప్రార్ధించమని చెపుతాడు. ఇంద్రుడు అదే విధంగా శ్రీమహాలక్ష్మిని ఉపాసిస్తాడు. ఇంద్రుడి ప్రార్థనలకు సంతోషించిన మహాలక్ష్మిదేవి అతనికి పూర్వ  వైభవాలను ప్రసాదిస్తుంది. 

           ఇంద్రుడు శ్రీమహాలక్ష్మిని ఇలా ప్రార్ధిస్తాడు. మాత నీవు ఎపుడు శ్రీహరి చెంతనే ఉంటే మమ్మలిని ఎవరు రక్షిస్తారు అని అడిగితారు. అపుడు శ్రీమహాలక్ష్మి ఇలా సమాధానమిస్తుంది. ఎవరైతే ననే ఉపాసన చేస్తూ ధ్యానిస్తుంటారో వారికీ నేను సకల సంపదలను ఇస్తాను అని చెపింది. 

      ఈ దీపావళి రోజునా ఎవరయితే శ్రీమహాలక్ష్మిని పూజిస్తారో వారికీ లక్ష్మీదేవి సకల సంపదలను ప్రసాదిస్తుంది. 




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...