మాఘ పురాణం 16

మాఘమాసం 16 రోజు పారాయణం



శౌనకాది ఋషులకు సూతమహర్షి మాఘమాసం 16 రోజు పారాయణాన్ని చెప్పటం మొదలు పెట్టారు. పార్వతిమాతకు మహా శివుడు చెపుతున్నారు. పార్వతి! వశిష్ట మహర్షి దిలీపమహరాజుకి ఓ దిలిపామహారాజా! జహ్నుమహాముని గృతజ్ఞ మహర్షితో  ఇలా చెప్పసాగారు. పూర్వం కాలంలో ఒక విద్యాధరుడు సంతానం కోసం బ్రహ్మ గారి కోసం తపస్సు చేసారు. అయన తపస్సుకి మెచ్చిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమైయారు. బ్రహ్మదేవుడు విద్యాధరుడితో విద్యాధరా! నీ తపస్సుకి మెచ్చాను. నీకు ఏమి వరం కావాలో కోరుకోమన్నారు. విద్యాధరుడు బ్రహ్మదేవా! నాకు ఇప్పటివరకు సంతానం కలగలేదు నాకు సంతానాన్ని ప్రసాదించు అని కోరుకున్నారు. అందుకు బ్రహ్మదేవుడు విద్యాధరా! నీకు ఈ జన్మలో సంతాన భాగ్యం లేదు. కానీ నీవు నా గురించి తపస్సు చేసావు కాబ్బటి పుత్ర సంతానం లేదు కానీ పుత్రిక సంతానం ప్రసాదిస్తున్నాను అని చేపి వెళ్లిపోయారు. కొంత కాలానికి విద్యాధరా దంపతులకి ఒక కుమార్తె జన్మిస్తుంది. ఆమెను విద్యాధరా దంపతులు ఎంతో ప్రేమగా పెంచసాగారు. ఆమెకు యుక్త వయస్సు వచ్చిన తరువాత ఒకరోజు ఆమె తోటలో ఆడుకుంటుండగా ఒక రాక్షసుడు ఆమెను చూసి ఆమె దగరకు వచ్చాడు. ఆమెతో సుందరిని నివ్వు ఎవరు ఎక్కడ ఎందుకు ఉన్నావు. నువ్వు నాకు బాగా నచ్చవు నేను నిన్ను వివాహం చేసుకుంటాను అని అడుగుతాడు. అందుకు విద్యాధరా కన్యకా నన్ను వివాహం చేసుకోవాలి అనుకుంటే వెళ్లి మా నాన్న గారిని అడగండి అని చెప్పుతుంది. అ రాక్షసుడు విద్యాధరుడిని వెళ్లి మీ కుమార్తెని నాకు ఇచ్చి వివాహం చేయమని అడుగుతాడు. అందుకు విద్యాధరుడు మేము మా కుమార్తెను విడిచి ఉండలేము. మేము విద్యాధరులము విద్యాధరుడికి మా దగ్గరే ఉండేవారికి ఇచ్చి వివాహం చేస్తాము. రాక్షసులకు ఇచ్చి వివాహం చేయము అని చెపుతాడు. ఆ మాటకి ఆ రాక్షసుడికి కోపం వస్తుంది. విద్యాధరుడు ఇంట్లో లేని సమయంలో ఆ విద్యాధరా కన్యకను రాక్షసుడు  అపహరించి సముద్రగర్భంలోని పాతాళంలోని తన నివాసంలో దాచిపెడతాడు. ఆమెను వివాహం చేసుకోవటం కోసం ముహుర్తాన్ని నిర్ణయించామని బ్రహ్మదేవుడి దగరకు వెళతారు. బ్రహ్మదేవుడు మరో ఎనిమిది మాసముల వరకు మంచి ముహూర్తం లేదు. నువ్వు అప్పటివరకు ఎదురుచూడు అని చెపుతారు. రాక్షసుడు తన నివాసానికి తిరిగివచ్చి విద్యాధరా కన్యకతో నిన్ను వివాహం చేసుకోవటానికి మరో ఎనిమిది మాసములవరకు ముహూర్తం లేదు. నువ్వు ఇక్కడే ఉండు నీకు ఏమి కావాలి అన్న నేను చేస్తాను అని అంటాడు. విద్యాధరకన్యక తనకు ఈ వివాహం ఇష్టం లేకపోయినా ఆ రాక్షసుడిని ఎదిరించలేక దేవుడే తనను రక్షంచగలగు అని ఆలోచించుకోండి. ఆ రాక్షసుడితో విద్యాధరా కన్యకా నాకు ఇక్కడ ఒక శివాలయాన్ని చూపించు నేను రోజు శివుడిని పూజించుకుంటాను అని అడుగుతుంది. అందుకు ఆ రాక్షసుడు పాతాళంలో ఉన్న హఠకేశ్వర ఆలయాన్ని చూపించారు. ఆ విద్యాధరా కన్యకా రోజు హఠకేశ్వర ఆలయానికి వెళ్లి శివుడిని పూజిస్తుండేది. కొంతకాలం తరువాత అక్కడికి నారద మహర్షి వచ్చారు. ఆ విద్యాధరా కన్యకను చూసి నువ్వు ఎవరు చుస్తే దేవకన్యలా ఉన్నావు. ఎక్కడ ఎందుకు ఉన్నావు అని అడుగుతారు. ఆ విద్యాధరా కన్యకా జరిగిన విషయం చేపి బాధపడుతుంది. నారద మహర్షి ఆమెకు ధైర్యం చేపి ఇప్పుడు మాఘమాసం వస్తుంది. ఈ నెల రోజులు ఇక్కడే ఉన్న సరస్సులో స్నానం చేసి రోజు నియమనిష్టలతో శివుడిని, శ్రీమన్నారాయణుడిని, సూర్యుడిని ఆరాధించు నీకష్టం తొలగిపోతుంది. నీకు విష్ణు భక్తుడైన ఒక మహారాజు ఆ రాక్షసుడిని చంపి నిన్ను వివాహం చేసుకుంటారు అని చేపి వెళ్లిపోతారు. విద్యాధరా కన్యకా మరుసటి రోజు నుంచి మాఘమాసం అవటం వలన నారద మహర్షి చేపిన విధంగా మాఘమాస వ్రతం ఆచరించింది. నారద మహర్షి ఆమె దగ్గర నుంచి సౌరాష్టానికి వెళ్లి అక్కడ శ్రీమన్నారాయణుడి భక్తుడు ఆ దేశపు రాజైన హరిద్రధుడు దగ్గరకు వెళతారు. నారద మహర్షిని చూడగానే శ్రీమన్నారాయణుడిని చూసినట్టుగా సంతోషించి గౌరవమర్యాదలతో ఆహ్వానించి ఆసనంపై కూర్చోపెట్టి అర్ఘ్య పాద్యములను ఇచ్చి పూజించారు. నారద మహర్షి సంతోషించి ఓ రాజా నీకు ఒక విషయం చెప్పాలని వచ్చాను. అందుకు మహారాజు ఆజ్ఞాపించండి మహర్షి నన్ను ఏమి చేయమంటారు అని అడుగుతారు. అందుకు నారద మహర్షి సముద్రలోని పాతాళంలో ఒక రాక్షసుడి నివాసంలో ఒక విద్యాధరా కన్యకా బందీగా ఉంది. ఆమెను అక్కడి నుంచి విడిపించి నివ్వు వివాహం చేసుకోవాలి అని చెపుతారు. అందుకు ఆ రాజు అక్కడికి ఎక్కడికి వెళ్లాలో చెప్పండి నేను వెంటనే వెళ్లి ఆమెను తీసుకువస్తాను అని చెపుతారు. అప్పుడు నారద మహర్షి అ రాక్షసుడిని చంపటం అంతసులభం కాదు. అతను శివుడి గురించి తపస్సు చేసి శివుడి త్రిసూలాన్ని వరంగా కోరుకొని తీసుకున్నాడు. అతనికి త్రిశులాన్ని ఇస్తూ శివుడు ఇది నీ చేతిలో ఉన్నపుడే నీకు విజయం ఇది నీ శత్రువు చేతిలోకి వెళితే అతడి చేతిలోనే నీకు మరణం వస్తుంది అని చెపుతారు. ఇంకొంత సేపటి తరువాత ఆ రాక్షసుడు త్రిశూలాన్ని తన నివాసంలో ఉంచి బ్రహ్మదేవుడి దగ్గరకు వెళతాడు నువ్వు ఆ సమయంలో అతని నివాసానికి వెళ్లి ఆ త్రిశూలాన్ని తీసుకొని అతను తిరిగి వచ్చాక అతనిని చంపు అని చెపుతారు. నారద మహర్షి మహారాజుని తీసుకొని సముద్రుడి దగరకు వెళ్లి ఆ రాక్షసుడి నివాసానికి దారిని ఇమ్మని చెప్పుతారు. మహారాజు ఆ దారి వెంట వెళ్లి నారద మహర్షి చేపినట్టుగానే చేసారు. ఈలోపు ఆ రాక్షసుడు తన నివాసానికి తిరిగి వచ్చాడు. అక్కడ తన త్రిశూలాన్ని తీసుకున్న ఆ మహారాజుని చూసి తనకు మృత్యువు సమీపించింది అని అర్ధమైంది. అతనితో పోరాడి చనిపోతాడు. ఆ మహారాజు విష్యాధారా కన్యకా దగరకు వెళ్లి జరిగిన విషయం చేపి వివాహం చేసుకుంటారు. ఆమెను తీసుకొని ఆమె తండ్రి ఐన విద్యాధరుడి దగరకు వెళతారు. ఈ విధముగా మాఘమాస వ్రతం ప్రభావం వలన ఆ విద్యాధరా కన్యకా కష్టాలు తిరి జీవితం అంత సంతోషంగా గడపసాగింది అని జహ్నుమహాముని గృతజ్ఞ మహర్షికి, వశిష్ఠ మహర్షి దిలీప మహారాజుకి మహాశివుడు పార్వతిమాతకి చెప్పారు. ఈ విధముగా శౌనకాది ఋషులకు సూతమహర్షి మాఘమాసం 16 రోజు పారాయణాన్ని చెప్పటం పూర్తిచేశారు.  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...